శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో…

పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్

సగటు పురుషుడు: పార్లమెంటులో దీన్ని ‘వెల్ ఆఫ్ ద హౌస్’ అంటారు… సగటు స్త్రీ: ఎన్నికల్లోనేమో మహా అగాధం అని పిలుస్తారు… మరో అద్భుతమైన కార్టూన్! పార్లమెంటు ఉభయ సభల్లోనూ సాధారణంగా జరిగే గొడవలకు, ముఖ్యంగా ఇటీవల తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా వివిధ పార్టీల నేతలు వేసిన వేషాలకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియజెపుతున్న కార్టూన్ ఇది. 2014 సాధారణ ఎన్నికల ప్రచారం చివరి లోక్ సభ, రాజ్య సభల సమావేశాల నుండే మొదలయిందని కార్టూన్…

జనారణ్యంలో చిరుత -ఫోటోలు

మనిషి జీవనంపై మోజు పెంచుకుందో ఏమో గానీ ఓ చిరుతపులి మీరట్ జనారణ్యంలోకి ప్రవేశించింది. పోలీసు అధికారుల్ని, అటవీ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. పోలీసులు తమ సహజ స్టైల్ లో లాఠీ చార్జికి దిగినా అది అదరలేదు, బెదరలేదు. పోలీసు లాఠీ ఝళిపిస్తే బెదిరి పరుగులు పెట్టాలని దానికి తెలియదు గదా మరి! పోలీసుల పైకే లంఘించి ఏడుగురిని గాయపరిచి మరీ తన సత్తా చాటుకుంది. ఆదివారం, ఫిబ్రవరి 23…

ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ…

సహారా బాస్ కి నాన్ బెయిలబుల్ వారంట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్…

ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?

జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

అన్నా హజారే రాజకీయం -కార్టూన్

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…” *** రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు…

కాలిఫోర్నియా: పోలియో తరహా వ్యాధితో 25 మంది పిల్లలు

పోలియో రహిత ప్రపంచాన్ని స్ధాపిద్దాం అంటూ న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుండగా ఐరాస కార్యకలాపాలకు కేంద్ర అయిన అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కాలిఫోర్నియా రాష్ట్రంలోని పిల్లలను ఇప్పుడో వింత వ్యాధి భయపెడుతోంది. సరిగ్గా పోలియో తరహాలోనే పిల్లల కాళ్ళు, చేతులు ఒక్కసారిగా చచ్చుబడిపోతున్నాయి. పోలియో తరహా వ్యాధి అని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పోలియో మాత్రం కాదని కూడా వారు చెబుతున్నారు. ఫుకుషిమా…

అమెరికా: ఆర్ధిక కష్టాలతో మిలట్రీ ఖర్చుల కోత

“మన కోశాగార (ఆదాయం) సవాళ్ళ పరిమాణం యొక్క వాస్తవికతను గుర్తించే బడ్జెట్ ఇది. మనం ఉంటున్న ప్రమాదకరమైన ప్రపంచంలో, ఈ దేశపు భద్రతను కాపాడుకోవడంలో మనకి గల కీలక పాత్ర నేపధ్యంలో, అస్ధిరమైన ప్రపంచ పరిస్ధితులకు తగిన విధంగా రూపొందించిన బడ్జెట్” అని 2015 సం రక్షణ బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ చక్ హెగెల్ చెప్పారని సి.ఎన్.ఎన్ తెలిపింది. “మునుముందు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మనం ముందున్న వాస్తవికత అదే” అని ఆయన నిర్మొహమాటంగా…

ఇటలీ మెరైన్ కేసు: ఇండియా వెనకడుగు?

ఇటలీ, ఇ.యు ల నుండి వచ్చిన ఒత్తిడికి భారత ప్రభుత్వం తల వంచినట్లు కనిపిస్తోంది. పైరసీ చట్టాన్ని ప్రయోగించడం లేదని కేంద్రం ఈ రోజు సుప్రీం కోర్టుకు తెలిపింది. యాంటీ-పైరసీ యాక్ట్ (సముద్ర దోపిడి వ్యతిరేక చట్టం) ప్రకారం తమ మెరైన్ సైనికులను విచారించడానికి ఇండియా సిద్ధపడడం పట్ల ఇటలీతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాను అనుకున్నట్లుగా ఇండియా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన ప్రతిస్పందన ఖాయం…

వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం

‘WhatsApp’ అప్లికేషన్ కొనుగోలు మరియు స్వాధీనం (acquisition) కోసం జరిగిన పోటీలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ విజయం సాధించాడు. దానితో త్వరలో జరగబోయే ప్రపంచ స్ధాయి ఐ.టి (మొబైల్) కాన్ఫరెన్స్ లో జుకర్ బర్గ్ విజయగర్వంతో పాల్గొననున్నాడని వ్యాపార వార్తా సంస్ధలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు ప్రతి రంగంలోనూ పాతుకుపోయిన గూగుల్ ని త్రోసిరాజనడం అంటే మాటలు కాదు మరి! స్మార్ట్ ఫోన్ ల దగ్గర నుండి మధ్య…

GSAT, GISAT ల మధ్య తేడా ఏమిటి?

శ్రీవిద్య: GSAT మరియు GISAT ల మధ్య ఉన్న తేడా ఏమిటో వివరించగలరు? సమాధానం: GSAT అంటే జియో సింక్రొనస్ శాటిలైట్ (Geosynchronous Satellite) అని అర్ధం. GISAT అంటే GEO ఇమేజింగ్ శాటిలైట్ (GEO Imaging Satellite) అని సాధారణ అవగాహనగా చెబుతారు. అయితే శాస్త్రీయంగా ఖచ్చితంగా చెప్పాలంటే దీని పూర్తి నామం ‘Geostationary Hyperspectral Imager Satellite’. వివరాల్లోకి వెళ్తే: GSAT ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ISRO దేశీయంగా అభివృద్ధి చేసిందని…

ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు

యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన…

చైనాతో సమస్యలా? అదేం లేదే! -అమెరికా

దలైలామా, ఒబామాల సమావేశం దరిమిలా చైనా ప్రభుత్వం అమెరికా రాయబారికి ఓవైపు సమన్లు జారీ చేస్తుండగానే చైనాతో తమకు సమస్యలేమీ లేవని అమెరికా మిలట్రీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా అత్యున్నత మిలట్రీ అధికారి బీజింగ్ పర్యటిస్తూ చైనాతో సంబంధ బాంధవ్యాలు తమకు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా టిబెటన్ భౌద్ధ గురువు దలైలామాను అమెరికా అధ్యక్షుడు ఒబామా కలుసుకున్నందుకు చైనా తీవ్ర నిరసన తెలిపిన మరుసటి రోజే మిలట్రీ అధికారి శాంతి…