కావాలనే దారి మార్చారు -మలేషియా ప్రధాని

మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కావాలనే దారి మళ్లించారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ధృవీకరించారు. అయితే విమానం హైజాక్ కి గరయిందని మాత్రం ఆయన చెప్పలేదు. మరిన్ని వివరాలు తెలిస్తే తప్ప హైజాక్ కి గురయింది లేనిదీ ధృవీకరించడం సాధ్యం కాదని మలేషియా భావిస్తోంది. విమానం కమ్యూనికేషన్లు మరియు ట్రాకింగ్ వ్యవస్ధలను ఉద్దేశ్యపూర్వకంగానే మూసివేసి విమానాన్ని దారి మళ్లించారని నజీబ్ తెలిపారు. ప్రధాని నజీబ్ విలేఖరులకు ఈ సంగతి చెప్పిన తర్వాత పోలీసులు విమానం పైలట్…

మలేషియా విమానం: ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చిందా? -ఫొటోలు

అదృశ్యం అయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం Flight MH370 ఉద్దేశ్యపూర్వకంగానే దారి మార్చుకుని అండమాన్ వైపుకి ప్రయాణించిందా అన్న అంశాన్ని మలేషియా అధికారులు పరిశోధిస్తున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు హిందూ మహా సముద్రంలో కూడా వెతుకులాట ప్రారంభం కావచ్చని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జె కార్ని ప్రకటించడంతో మలేషియా అధికారుల అనుమానాలకు ఇతర దేశాలు కూడా విశ్వసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. విమానాన్ని ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చి అండమాన్ సముద్రం మీదికి,…

జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్

అవును. జనం పెద్ద సంఖ్యలో వస్తేనే అన్నా హజారే సభలకు వస్తారట. లేకపోతే రారట. ఈ సంగతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభ ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అన్నా హజారేలు ఇరువురూ హాజరు కావలసిన సభకు అన్నా రాలేదు. కారణం ఏమిటా అని చూస్తే సభకు పెద్దగా జనం రాకపోవడం వల్లనే అన్నా రాలేదని ఆయన ప్రతినిధులు వివరించారని పత్రికలు తెలిపాయి. మార్చి 12 తేదీన ఢిల్లీలో ఒక ఎన్నికల…

ఉక్రెయిన్: ఆంక్షలు ప్రమాదకరం, తొలి గొంతు విప్పిన చైనా

ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా, ఐరోపా బెదిరింపులను చైనా వారించింది. నాలుగు నెలలుగా నలుగుతున్న ఉక్రెయిన్ సంక్షోభంపై ఇంతవరకు చైనా నోరు మెదిపింది లేదు. బ్రిక్స్ కూటమిలో సహ సభ్య దేశమైన రష్యాకు మద్దతు ఇవ్వడానికి చైనా ముందుకు రాలేదు. ఐరాస భద్రతా సమితిలో కూడా శాంతి ప్రవచనాలు పలకడం వరకే పరిమితం అయింది. పైగా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అనుల్లంఘనీయం అంటూ రష్యాను సుతి మెత్తగా మందలించబోయింది. అలాంటిది రష్యాపై ఆంక్షలు విధిస్తామని…

న్యూయార్క్: పేలుళ్లలో కుప్పకూలిన భవనాలు -ఫోటోలు

35 వేల అడుగుల ఎత్తునుండి కుప్ప కూలిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ దొరకనే లేదు. ప్రపంచం అంతా ‘ఫ్లైట్ ఎం‌హెచ్370’ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగానే అమెరికాలో మరో ప్రమాదం నమోదయింది. న్యూయార్క్ నగరం లోని అప్పర్ మన్ హటన్ (ఈస్ట్ హర్లేమ్) లో పేలుడు సంభవించడంతో రెండు భవనాలు కుప్ప కూలాయి. ఈ పేలుడుకు పైపుల నుండి వంట గ్యాస్ లీక్ అవడం కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. పేలుడులో ముగ్గురు మరణించారని గురువారం…

విమాన ప్రమాదం: ఇండియా సాయం కోరిన మలేషియా

ప్రమాదానికి గురయిందని భావిస్తున్న Flight MH370 మలేషియా విమానం వెతుకులాటలో సహాయం చేయాలని మలేషియా ఇండియాను కోరింది. కౌలాలంపూర్ నుండి ఈశాన్య దిశగా ప్రయాణమై బీజింగ్ చేరాల్సిన విమానం మధ్యలోనే వెనక్కి మళ్ళీ పశ్చిమ దిశగా మలక్కా ద్వీపాల వరకు వచ్చినట్లు ఆ దేశ మిలట్రీ అధికారులు చెప్పడంతో ఇండియా సాయం అవసరం అయింది. మలక్కా ద్వీపాలకు సమీపంలోనే అండమాన్ నికోబార్ ద్వీపాలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ ద్వీపాల్లో భారత నావికా బలగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.…

ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?

హరీష్: ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల  ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా  మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి  కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు. సమాధానం: ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను…

ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.…

శవ పేటికలే ఆంటోని క్రెడిట్? -కార్టూన్

రక్షణ మంత్రి అరక్కపరంబిల్ కురియన్ ఆంటోని 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. స్వయంగా చెప్పలేదు గానీ ఒక కేరళ కాంగ్రెస్ నాయకునితో చెప్పించారు. రాజ్యసభ సభ్యులయిన ఎ.కె.ఆంటోని గతంలో కూడా ఎప్పుడూ లోక్ సభకు పోటీ చేసిన రికార్డు లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆంటోని కొద్ది సేపు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కానీ అంతకు మునుపు ఆయన వేరే కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. భారత నావికా బలగాలకు చెందిన…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?

కె.బ్రహ్మయ్య: 1) ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ESPECIALLY FOR MUSLIMS INVADERS. 2) గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు? IS THERE NOT ENOUGH STRENTH FOR INDIA? సమాధానం: ప్రాచీన క్షాత్ర పరంపర…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

ఆచూకీ లేని విమానం, టెర్రరిజం అనుమానం

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఉమ్మడిగా గాలిస్తున్నప్పటికీ వారి గాలింపు ఫలవంతం కాలేదు. అమెరికా, ఐరోపాల సాయం తీసుకోవడానికి నిర్ణయించినట్లు మలేషియా మంత్రులు ప్రకటించారు. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ఇద్దరు ప్రయాణీకులు విమానంలో ఉన్నందున టెర్రరిస్టు చర్యకు గురై ఉండొచ్చన్న అవకాశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. విమానం ప్రయాణించిన తీరును బట్టి అది…

239 మందితో సముద్రంలో కూలిన మలేషియా విమానం?

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం…

హిందు పండగలతో పోలిన కేధలిక్ కార్నివాల్ -ఫోటోలు

భారత దేశంలో పండగలు సాంస్కృతిక కలయికలకు వేదికలుగా నిలుస్తాయి. శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం, వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లు, సంక్రాంతి సంబరాల్లో పంటలు, అల్లుళ్ళ సందడి మొదలయినవన్నీ భారత దేశంలో సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండగలు కాకుండా వివిధ నదుల వద్ద జరిగే పుష్కరాలు, కుంభమేళాల సంగతి చెప్పనే అవసరం లేదు. రోజువారీ శ్రామిక జీవితం నుండి ఆటవిడుపుగానూ, పూర్వీకులు సాధించిన విజయాలను సెలెబ్రేట్ చేసుకునే రోజులుగానూ…