తాత్కాలిక సెలవుకు ముగింపు…!

ఔను! తాత్కాలికంగా మూడు నెలల పాటు (కాస్త అటూ ఇటుగానే లెండి!) నేను తీసుకున్న సెలవు ఇక ముగిసింది. నా సెలవుకి కారణాలు? షరా మామూలుగా నేను ఇంతకు ముందు చెప్పినవే. మా ఇంటికి తలపెట్టిన షోకులు (పెయింట్లు, ఇంటి చుట్టూ ఫ్లోరింగ్, కొత్త లైట్లు, కొత్త కర్టెన్లు, ఇంటి బయట ఓ బాత్ రూమ్ మొ.వి) మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. నేనేదో చెమట చిందించేసేనని కాదనుకోండి. కానీ పని సక్రమంగా -డబ్బుకి తగినట్లుగా-  జరుగుతోందా…

వ్యాపం: సమాచారాన్ని తొక్కిపెట్టిన సి.ఎం చౌహాన్

సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి…

వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2

మొదటి భాగం తరువాత…… . సాక్షులు, నిందితుల హత్యలు కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు,…

వ్యాపం: మోడి అవినీతి పాలనలో ఓ మైలు రాయి -1

తమది నీతిమంతమైన పాలన అంటూ ప్రధాని నరేంద్ర మోడి చెప్పుకునే గొప్పలను నిలువునా చీరేస్తూ బి.జె.పి ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. యు.పి.ఏ పాలనలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసేందుకు మూడు నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంది. యు.పి.ఏ రికార్డును ఎన్.డి.ఏ-2 తిరగరాసింది. యు.పి.ఏ/కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని కుంభకోణాలే పెట్టుబడిగా అధికార లాభం సంపాదించిన ఎన్.డి.ఏ-2/బి.జె.పి సంవత్సరం తిరక్కుండానే తనకు, కాంగ్రెస్ కు ఎంతమాత్రం తేడా లేదని వేగంగా రుజువు చేసుకుంటోంది. కాంగ్రెస్ అవినీతిపై…

యోగా: ఇందుగల దందులేదని… -ఫోటోలు

“ఇందుగలదందులేదని సందేహంబు వలదు యోగా సర్వోపగతుందెందెందు వెదకి చూచిన అందెందే గలదు” అని చదువుకోవచ్చని ఖాయంగా అనిపిస్తుంది కింది ఫోటోలు చూస్తే! ‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు గానీ, నిజానికి యోగా ఎన్నడో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉంది. 1982 లోనే అమెరికా పౌరులు యోగా, ధ్యానం లను అభ్యసించడమే కాకుండా కొందరు దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారని కూడా ఈ బ్లాగర్ కి తెలుసు. ఎలాగంటే ఆ సంవత్సరంలో ప్రఖ్యాత…

ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్…

నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్

ఏప్రిల్ 25, 2015 తేదీన నేపాల్ ప్రజల్ని కొద్ది సెకన్ల కాలంలోనే భారీ వినాశనంలోకి నెట్టివేసిన భూకంపం అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ప్రభావితం చేయకుండా వదల్లేదు. భూకంప లేఖిని (రిక్టర్ స్కేల్) పై 7.9 పరిమాణాన్ని నమోదు చేసిన నేపాల్ భూకంపం వల్ల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశగా, అనగా ఇండియా వైపుకి 3 సెంటీ మీటర్ల మేరకు కదిలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు. నేపాల్ భూకంపం వల్ల…

విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు

వెనకటికో పెద్దాయన పని లేక పిల్లి తల గొరగడం మొదలు పెట్టాట్ట. పని లేని పెద్దలు తల పైన జుట్టుని, మొఖం మీద వెంట్రుకల్ని విచిత్రమైన షేపులతో కత్తిరించే ఫ్యాషన్ ని కనిపెట్టారేమో ఎవరన్నా పరిశోధించి కనిపెట్టాలి. పనే లేదో, తెలివి ప్రదర్శనకు మరో మార్గమే దొరక లేదో తెలియదు గానీ కొందరు తాము నివసించే ఇళ్లను సైతం వినూత్నంగా నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారూ వీరని కాకుండా ఈ బాపతు మేధావులు లేదా కళా కారులు ప్రపంచం…

యోగాపై అమితాసక్తి -ది హిందు ఎడిటోరియల్

శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదం చేసే ప్రయోజక శాస్త్రంగా ప్రపంచవ్యాపితంగా యోగా అంతకంతకూ అధిక గుర్తింపు పొందుతున్న సమయంలోనే, ఈ భారతీయ ప్రాచీన పద్ధతి, ప్రధానంగా నరేంద్ర మోడి ప్రభుత్వం యొక్క దూకుడుమారి ప్రోత్సాహం కారణంగా, అనవసర వివాదంలో చిక్కుకోవడం విచారకరం. (యోగా అమలుపై) ప్రభుత్వం అతిశయాత్మక ఆసక్తి చూపుతోందనీ తన ఉద్యోగులు మరియు సంస్ధలను తన సొంత దృక్పధంతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు వినియోగించే ధోరణిలో ఉన్నదన్న భావనలు కలగకుండా ఉండడం చాలా…

సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!

శాస్త్ర బద్ధ అంశాలకు మతాన్ని జోడిస్తే వచ్చే దుష్ఫలితం ఇది! మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా దోహదం చేసే ‘యోగా’, ‘సూర్య నమాస్కారాలు’ ఇస్లాం కి వ్యతిరేకం కాబట్టి వాటిని పాఠశాలల్లో బోధించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేస్తోంది. తద్వారా బ్రూనోను తగలబెట్టిన క్రైస్తవాన్ని, వేదాలు వినకుండా పంచముల చెవుల్లో సీసం పోసిన మనువాదాన్ని ముస్లిం బోర్డు స్ఫురణకు తెస్తోంది. రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని బి.జె.పి ప్రభుత్వాలు ఇటీవల తమ పాఠశాలల్లో…

ఒక ఆదేశం, కొన్ని ప్రశ్నలు -ది హిందు ఎడిట్..

సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు…

నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం…

చైనా సమూహ కళకు సరిలేరు ఎవ్వరూ! -ఫోటోలు

ప్రజా సమూహాలు అన్నీ ఒకే మాదిరిగా, ఒకే భావాన్ని కలిగించేవిగా ఉండవు. కొన్ని సమూహాలు అబ్బురపరిస్తే కొన్ని సమూహాలు చీదర  పుట్టిస్తాయి. కొన్ని సమూహాలు ఔరా! అనిపిస్తే మరికొన్ని ఇదెలా సాధ్యం అని విస్తుపోయేలా చేస్తాయి. సమూహంలో క్రమ శిక్షణ ఉంటే ఆ సమూహానికి ఎనలేని అందం వచ్చి చేరుతుంది. అది మిలటరీ క్రమ శిక్షణ అయితే చెప్పనే అవసరం లేదు. క్రమబద్ధమైన కదలికలతో మిలట్రీ సమూహాలు చేసే విన్యాసాలు చూడముచ్చట గొలుపుతూ విసుగు అనేది తెలియకుండా…

నువ్వు ముస్లింవి.. ఉద్యోగం ఇవ్వం ఫో!

సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల్లో ఒక కులం వారికి తప్ప ఉద్యోగం ఇవ్వరు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఇప్పటికీ ఆ కులం వారికే ఎక్కువ ఉద్యోగాలు దక్కడం ఒక చేదు నిజం. దేశంలో దళితులకు దూరం నుండి నీళ్ళు వొంచి పోసే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వని మురికి మనసుల కుటుంబాలు ప్రతి పల్లె, పట్టణంలోనూ ఉన్నాయి. ముంబైలో ముస్లింలకు కూడా ఇళ్ళు అద్దెకు లభించవు. ఇప్పుడు అదే ముంబైలో పేరు మోసిన…