పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం

పాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది.…

అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

ప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు…

ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

మార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఫుకుషిమా ప్రమాదం…

భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…

దక్షిణ చైనా సముద్రం ప్రపంచ ఆస్తి -ఎస్.ఎం.కృష్ణ

దక్షిణ చైనా సముద్రంలో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఓ.ఎన్.జి.సి విదేశ్ సాగిస్తున్న ఆయిల్ వెతుకులాటపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని దానిపై ఏ దేశానికి హక్కులు లేవనీ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణం వ్యాఖ్యానించాడు. దేశాల జోక్యాన్నుండి దక్షిణ చైనా సముద్రంలో జోక్యం ఉండరాదని ఆయన ప్రకటించాడు. “దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని భారత దేశం భావిస్తోంది.…

Gas prices

ఆయిల్ కంపెనీల దోపిడి -కార్టూన్

శక్తి జనించడానికి ఇంధనం అత్యవసరం. ఆధునిక సమాజంలో ఆయిల్, విద్యుత్ లే ప్రధాన శక్తి జనితాలుగా ఉండడంతో ఆయిల్ కంపెనీల దోపిడి కి అడ్డు లేకుండా పోతోంది. పౌరులందరికీ సమాన స్ధాయిలో అందుబాటులో ఉండవలసిన ప్రకృతి వనరులు కొద్ది మంది పెట్టుబడిదారుల చేతిలో లాభార్జనా సాధనంగా మిగిలిపోయింది. వారికి ప్రభుత్వాలు అండదండలిస్తున్నాయి. ఫలితంగా ఆయిల్ క్రమంగా లగ్జరీ సరుకు గా మారిపోతోంది. సగటు జీవికి మళ్లీ సైకిలే ప్రధాన రవాణా సాధనంగా మారిపోయే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. మరో…

అమెరికా, నెంబర్ 1 ఇంటర్నెట్ స్వేచ్చా హంతకి

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో…

Free app

ఈ ఆప్ మీకు ఉచితం -కార్టూన్

ఇంటర్నెట్ సంస్ధలు, సాఫ్ట్ వేర్ డవలపర్లు ఉచితంగా ‘అప్లికేషన్లు’ ఆఫర్ చేస్తూ వినియోగదారుల ప్రైవసీ ని తీవ్రంగా కొల్లగొడుతున్నాయి. వారిలో గూగుల్ అగ్ర స్ధానంలో ఉంది. వినియోగదారుల సమాచారాన్ని రహస్యంగా, అనుమతి లేకుండా దొంగిలించి నిలవ చేస్తున్నందుకు గూగుల్ పైన అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల పార్లమెంటులు గూగుల్ దుర్మార్గాలను తీవ్ర స్ధాయిలో ఖండించాయి. యూరోప్ లో చాలా ప్రభుత్వాలు గూగుల్ వ్యాపార పద్ధతులపైనా, మోసాలపైనా విచారణ…

మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం

గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…

ఖమ్మం స్కూల్ బస్ కాలవలో పడి 14 మంది పిల్లల మృతి

ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్సు కాలవలో పడిపోవడంతో 14 మంది స్కూల్ పిల్లలు చనిపోయారని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం 40 మంది పిల్లలు దుర్ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. కొత్త గూడెం మండలం లో ఎల్.వి.రెడ్డి స్కూల్ కి చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడిందని ఎన్.డి.టి.వి తెలిపింది. గాయపడిన 18 మంది పిల్లలను ఆసుపత్రిలో…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…

‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…

ఇండియాలో కాల్ సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో చట్టం

ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దిన అమెరికా తన ప్రయోజనాల విషయానికి వస్తే అవే విధానాలను తాను నిస్సందేహంగా తిరస్కరిస్తానని మరోసారి నిరూపించుకుంది. ఎండు చేపలు తినకూడనిది ఊరివాళ్ళే గానీ తాను కాదని తన…

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఎగుమతులపై చైనా అదనపు సుంకాలు

చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంలో మరో ముందడుగు పడింది. చైనా నుండి ఎగుమతి అవుతున్న గ్రీన్ ఉత్పత్తుల వలన అమెరికా గ్రీన్ ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతున్నదంటూ అమెరికా ఉత్పత్తిదారులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించిన తర్వాత చైనా ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికానుండి కార్లు పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి నుండి దిగుమతి అవుతున్న కార్లపైన చైనా వివిధ స్ధాయిల్లో అదనపు సుంకాలను విధించింది. అమెరికా కేవలం దర్యాప్తు…

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…