జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -ఈనాడు వ్యాసాలు

గత ఫిబ్రవరి నుండి మే నెల వరకు 12 వారాల పాటు ఈనాడు పత్రికలో నేను వ్యాసాలు రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాసాల్లో కవర్ చేసిన అంశాలపైనే మిత్రులు కొందరు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. బహుశా వారు ఈ వ్యాసాలు చూడలేదనుకుంటాను. అలాంటివారి ఉపయోగం కోసం సదరు వ్యాసాలకు లంకెలను కింద ఇస్తున్నాను. “జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే శీర్షికన చదువు పేజీలో ప్రచురితమైన వ్యాసావళితో పాటు ఎడిటోరియల్ పేజీలో వచ్చిన మరో…

మోడీ చరిత్ర పరిజ్ఞానం ఇంతేనా?

“మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం సర్, చారిత్రక పేర్ల గురించి ప్రస్తావించదలుచుకుంటే జస్ట్ గూగుల్ చేయండి చాలు!” ——— ప్రధాన  మంత్రి కాగోరేవారికి భారత దేశ చరిత్ర గురించి సరైన అవగాహన ఉండాలని భావించడంలో తప్పుకాదు. పైగా అదొక షరతు కూడా. దేశ చరిత్ర పైన అవగాహన లేనివారు దేశ రాజకీయ-ఆర్ధిక-విదేశాంగ విధానాలను ఎలా నిర్దేశిస్తారు? కానీ బి.జె.పి ప్రధాని అభ్యర్ధికి అత్యవసరమైన ఈ అవగాహన కొరవడిందని ఆయన ఉపన్యాసాలు చెబుతున్నాయి. రెండు సందర్భాల్లో ఆయన చారిత్రక అవగాహన…

టిడిపితో దోస్తీపై పునరాలోచనలో బిజెపి?

రాష్ట్రంలో టి.డి.పి, బి.జె.పి లు దగ్గరవుతున్న సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నప్పటికీ ఆ విషయంలో బి.జె.పి పునరాలోచనలో పడినట్లు వివిధ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతు ఇచ్చిన బి.జె.పి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన టి.డి.పి తో దోస్తీ కట్టడానికి బి.జె.పి తెలంగాణ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చే పక్షంలో టి.ఆర్.ఎస్ కూడా ఆ కూటమిలో చేరే అవకాశాలున్నాయని బి.జె.పి నాయకులు కొందరు భావిస్తున్నారు. దానితో…

రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్

ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి. కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల…

ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది. ఇంకా చెప్పాలంటే నేను వేసిన…

మల్లిక్ స్పెషల్: రాష్ట్ర విభజన పాటలు

(తెలుగు కార్టూనిస్టుల్లో మల్లిక్ ది ఒక ప్రత్యేకమైన బాణీ. నిజ జీవితంలో సీరియస్ గా కనిపిస్తాడని చెప్పే మల్లిక్ రాజకీయ కార్టూన్లను చూడడం నాకు ఇదే మొదటిసారి. -విశేఖర్) ***               ***               *** సోనియా గాంధీ : ” తలచినదే జరిగినదా…దైవం ఎందులకూ….” దిగ్విజయ్ సింగ్:  ” ఆగదు ఏ నిమిషం నీ కోసమూ…ఆగితే సాగదు ఈ లోకమూ…” కిరణ్ కుమార్ రెడ్డి: ” జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా….” – – – – మిగిలిన భాగం…

చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…

ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఏపాటిది? -కార్టూన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోర్టీ మొదటిసారిగా తన బలాన్ని నిరూపించుకోబోతోంది. బడా భూస్వామ్య – బడా పెట్టుబడిదారీ వర్గాల పార్టీలయిన బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలతో అది పోటీపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పరిస్ధితి కాంగ్రెస్, బి.జె.పిలతో పోలిస్తే ఎలా ఉంటుందో కార్టూనిస్టు ఈ కార్టూన్ లో చెబుతున్నారు. జన, ధన బలాలూ, బలగాలూ దండిగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి లతో ఆమ్ ఆద్మీ పార్టీ…

మోడీకి పటేల్ ఆమోదం ఉండేది కాదు -పటేల్ బయోగ్రాఫర్

బి.జె.పి ప్రధాని పదవి అభ్యర్ధి నరేంద్ర మోడీని సర్దార్ పటేల్ తన వారసుడిగా ఆమోదించి ఉండేవారు కాదని పటేల్ జీవిత చరిత్ర రచయిత రాజ్ మోహన్ గాంధీ వ్యాఖ్యానించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ మోహన్ గాంధీ మోడిని తన సైద్ధాంతిక వారసునిగా ఆమోదించకపోగా ముస్లింల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపట్ల ఎంతో ఆవేదన చెందేవారని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీకి మనవడు కూడా అయిన రాజ్ మోహన్ గాంధీ భారత దేశ…

అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్

– “అవి మన మన్ హట్టన్…. ఆకాశహర్మ్య విగ్రహాలు” – అక్టోబర్ 29 తేదీన కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ప్రారంభం అయితే, అక్టోబర్ 31 తేదీన గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే నరేంద్ర మోడి ఆధ్వర్యంలో అనుకోవాలి. ఆయన నిర్మించబోయే పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అవుతుందట. న్యూయార్క్ నగరంలోని మన్ హటన్…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్: సాక్ష్యానికి స్నోడెన్ రెడీ

జర్మనీ ఛాన్సలర్ సెల్ ఫోన్ సంభాషణలపై అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలపై అమెరికా – జర్మనీల మధ్య వాదోపావాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, జర్మనీ ప్రభుత్వానికి తెలిపాడు. అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలన్న షరతు మీద స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇచ్చినప్పటికీ అమెరికా – జర్మనీల మధ్య మరింత దూరం పెంచే అవకాశాన్ని…

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం -కేంద్రం

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…

నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్

సుప్రీం తీర్పు ప్రకారం ఓటింగ్ మిషన్ లో ‘None Of The Above’ (NOTA) బటన్ ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే NOTA మీట నొక్కాల్సి ఉంటుంది. కానీ NOTA ఓట్లు లెక్కించరాదని తీర్పులో పేర్కొన్న దృష్ట్యా ఈ మీటకు విలువ లేకుండా పోయింది, అది వేరే సంగతి! NOTA మీట ప్రవేశ పెడుతున్నారు కాబట్టి నిర్బంధ ఓటింగ్ ని అమలు చేయాలని నరేంద్ర మోడి ఒక ప్రతిపాదన…