10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ నిర్ణయం

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాయల తెలంగాణ ఏర్పాటుపై సాగిన ఊహాగానాలకు దీనితో తెరపడింది. కావూరి సాంబశివరావు రాయల తెలంగాణ కోసం కేబినెట్ లో ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదని వార్తా ఛానెళ్ల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ 10 యేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 45…

రాయల తెలంగాణ కాకపోవచ్చు!

తెలంగాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జి.ఓ.ఎం సభ్యులు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతున్నట్లు సోమ, మంగళవారాల్లో దాదాపు పత్రికలన్నీ ఊహాగానాలు చేశాయి. కానీ మంగళవారం రాత్రికి జి.ఓ.ఎం సభ్యులు మళ్ళీ 10 జిల్లాల తెలంగాణే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను బి.జె.పి దృఢంగా తిరస్కరించడమే దానికి కారణం అని ది హిందు తెలిపింది. బి.జె.పి మద్దతు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ విభజన అసాధ్యం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే బి.జె.పి మద్దతు తప్పనిసరి.…

తెలంగాణ సోనియా వంటకమా? -కార్టూన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా చేతుల్లోనే ఉందన్నట్లుగా అనేకమంది అభిప్రాయపడడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణ ప్రజల ఆందోళన, ఆకాంక్షలు, చరిత్ర… ఇవేవీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం, చిత్రించడం అమాయకత్వమా, అజ్ఞానమా, మిడి మిడి జ్ఞానమా? వివిధ పార్టీల నేతలు ఇరుకు స్వభావంతో, స్వార్ధ ప్రయోజనాల కోసం అంతా సోనియాయే చేస్తున్నట్లు చెబితే చెప్పొచ్చు గాక! సోనియా వల్లనే…

అన్నా: ఇంకా కొత్త మెరుగైన దీక్ష -కార్టూన్

“ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం, ఇంకా కొత్తది, మెరుగైనది, మీ కోసం. ఇక పాత దానిలోని @#$% అన్నీ ఇట్టే మాటు మాయం. తళతళలాడే కొత్తది… కేవలం మీ కోసం.” టి.వీల్లోనూ, సినిమాకి ముందూ మనకోసం అంటూ మనల్ని ఇబ్బంది పెట్టే ఇలాంటి యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! మన జీవితాల్ని ఎంతో సుఖమయం చేస్తున్నామనీ, అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నామని చెప్పని కంపెనీకి మార్కెటింగ్ మెళకువలు తెలియనట్లే లెఖ్ఖ! ఆ రకంగా మన ఓపికని పరీక్షించడమే కాక చమురు కూడా…

ఆపరేషన్ బ్లూ వైరస్: మోడి పాపులారిటీ పెరుగునదెట్టిదనిన…

సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వినియోగించేది ఎవరంటే టక్కున వినిపించే పేరు, నరేంద్ర మోడి. ప్రత్యర్ధులకు ఒకింత ఈర్ష్య కలిగించే ఈ ఫీట్ మోడి ఎలా సాధించారన్నది ఇప్పటిదాకా ఒక మిస్టరీ. ఆ మిస్టరీని కోబ్రా పోస్ట్ న్యూస్ పోర్టల్ ఛేదించింది. అనేక ఐ.టి కంపెనీలు డబ్బు తిని మోడి తదితరులకు కృత్రిమ ఫాలోయర్స్ ను సృష్టిస్తూ ఆయన పాపులారిటీ కృత్రిమంగా పెరిగేలా చేస్తున్నారని కోబ్రా పోస్ట్ నిర్వహించిన ‘ఆపరేషన్…

హైద్రాబాద్ యు.టికి నో

తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జి.ఒ.ఎం) నుండి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఒక షాక్ లాంటిది ఎదురయింది. హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వచ్చిన సీమాంధ్ర మంత్రులకు వారు గట్టిగా ‘నో’ చెప్పేశారు. అసలు విభజనకే ఒప్పుకునేది లేదని హఠాయించిన సీమాంధ్ర మంత్రులు చివరి నిమిషంలో వచ్చి ‘కేంద్ర పాలిత ప్రాంతం’ చేయాలని కోరడం జి.ఒ.ఎం సభ్యులకు నచ్చినట్లు లేదు. ‘ఇప్పడు సమయం మించిపోయింది’ అని జి.ఒ.ఎం సభ్యులు…

విధానాల్లో తేడా లేదు, ఇక మిగిలింది బురద జల్లుడు -కార్టూన్

సోనియా ఎన్నికల హెచ్చరిక: బి.జె.పికి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. మోడి ఎన్నికల హెచ్చరిక: కాంగ్రెస్ కి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. *** ఎల్.కె.అద్వానీ కొన్ని వారాల క్రితం ఓ మాటన్నారు. ఇప్పుడిక దేశంలో రెండే రాజకీయ శిబిరాలున్నాయని వాటికి నాయకులు కాంగ్రెస్, బి.జె.పిలని ఆయన మాట సారాంశం. గతంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయమ్ ఉండేది కాదనీ అలాంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయం స్ధాయికి బి.జె.పిని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోదలిచారు.…

విభజన బుల్ డోజర్ కు మమత అడ్డం? -కార్టూన్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నానని చెబుతున్న జగన్ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్.సి.పి నేత శరద్ పవార్, జె.డి.(యు) నేత శరద్ యాదవ్ లను ఇప్పటికే కలిశారు. వీరిలో రాష్ట్ర విభజనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎదుర్కొంటున్న మమత విభజనకు వ్యతిరేకం అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదేమో. “తెలంగాణ…

పీటముడిలో నేపాల్ ప్రజాస్వామ్యం -కార్టూన్

రాజ్యాంగ సభకు రెండో దఫా జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో యూనిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) పార్టీ ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. దానితో రాజ్యాంగ సభ ఎన్నికల ఫలితాలకు చట్టబద్ధత కొరవడే పరిస్ధితి ముంచుకొచ్చింది. మొదటి దఫా ఎన్నికల ద్వారా ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగ రచన పూర్తి చేయడంలో విఫలం కావడంతో రెండో దఫా రాజ్యాంగ సభ కోసం ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మొదటి దఫా ఎన్నికల్లో, ఎన్నికలు జరిగిన 250…

P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం

ఇరాన్, P5+1 దేశాల మధ్య ఇరాన్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర స్ధాయిలో సాగించిన లాబీయింగు విఫలం అయింది. ఒప్పందం ఫలితంగా ఇరాన్, 20 శాతం మేర యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిలిపేస్తుంది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ పై విధించిన వాణిజ్య ఆంక్షలను 6 నెలల పాటు పాక్షికంగా ఎత్తేస్తారు. ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగడానికి తగిన భూమిక ఏర్పడడానికి…

రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని గేలి చేస్తూ రష్యా మరో దౌత్య విజయం నమోదు చేసింది. ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి ‘సిరియా రసాయన ఆయుధాల వినాశనం’ ద్వారా మధ్య ప్రాచ్యం రాజకీయాల్లో అమెరికాను చావు దెబ్బ తీసిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మరో పంజా విసిరింది. తాజా పంజా దెబ్బ ఫలితంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సాపత్యం కోసం జరుపుతున్న చర్చలను సస్పెండ్ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని డిక్రీపై సంతకం చేశారు. ఉక్రెయిన్ చర్యతో వివిధ…

స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన ఎఎపి అభ్యర్ధి?

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి ఒకరు అక్రమ పద్ధతుల్లో విరాళాలు సేకరించడానికి అంగీకరించారన్న ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. ఒక మీడియా పోర్టల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఎఎపి అభ్యర్ధి షాజియా ఇల్మి అక్రమ విరాళాలు అంగీకరిస్తూ దొరికిపోయారని ఆరోపణలు రావడంతో బడా పార్టీలు ఎఎపిపై తమ దాడిని తీవ్రం చేశాయి. తమ అభ్యర్ధిపై స్టింగ్ ఆపరేషన్ కుట్రగా అరవింద్ కేజ్రివాల్ కొట్టిపారేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా పోటీనుండి తప్పుకోవడానికి అభ్యర్ధి సిద్ధపడ్డారు. మీడియా సర్కార్ అనే పోర్టల్…

అమెరికా ప్రతినిధుల సభలో మోడి వ్యతిరేక తీర్మానం

నరేంద్ర మోడికి అమెరికా వీసా కష్టాలు కొనసాగుతున్నాయి. భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అమెరికా పర్యటించినపుడు మోడి వీసా గురించి ప్రత్యేకంగా చర్చించినప్పటికీ ఫలితం దక్కినట్లు లేదు. అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives)లో సోమవారం ప్రవేశ పెట్టబడిన తీర్మానం చూస్తే ఈ అనుమానం రాక మానదు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉమ్మడిగా ప్రతిపాదించిన ఈ తీర్మానం, మోడీకి వీసా ఇవ్వరాదన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికాను ప్రశంసించింది. మరో వంక,…

కోడి పిల్లొచ్చి కోడిని వెక్కిరించినట్టు! -కార్టూన్

‘గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు’ అంటాం కదా! కార్టూనిస్టు ఇక్కడ కోడి పిల్లే వచ్చి కోడి తల్లిని వెక్కిరిస్తోందని సూచిస్తున్నారు. అన్నా హజారే కష్టపడి ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ అనే గుడ్డును పొదిగిన తర్వాత అందులోంచి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కోడి పిల్లగా బైటికి వచ్చిందని, ఆ కోడి పిల్ల ఇప్పుడు అన్నా హజారేను వెక్కిరిస్తోందని కార్టూన్ సూచిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య రెండు రోజులుగా ఒక కొత్త వివాదం నడుస్తోంది. అన్నా హజారే, మరో…

భారత రత్న: విజ్ఞప్తుల/డిమాండ్ల వరద -కార్టూన్

ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఈసారి ఒకేసారి ఇద్దరికీ ఈ గౌరవం ప్రకటించింది. శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావు కి భారత రత్న ప్రకటించడాన్ని అందరూ ఆహ్వానిస్తుండగా సచిన్ టెండుల్కర్ కి ఇవ్వడమే వివాదాస్పదం అయింది. మరోవైపు భారత రత్న ఫలానా వ్యక్తికి ఎందుకు ఇవ్వరంటూ విజ్ఞప్తులు, అదిలింపులు, బెదిరింపులు వరద కట్టడం విశేషం. సచిన్ కు భారత రత్న ఇవ్వడానికి ముదట వ్యతిరేకించింది హోమ్ మంత్రిత్వ శాఖే. అవును, ఇది నిజం.…