అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -2

లిబియా ప్రధాని తొలగింపు బెంఘాజీ దాడి తర్వాత రోజు లిబియా ప్రధానమంత్రి అబ్దుర్రహీమ్ ఎల్-కీబ్ పదవినుండి తొలగించబడ్డాడు. స్టీవెన్స్ హత్య విషయమై నాటో/అమెరికా చెప్పమన్నట్లు చెప్పకపోవడమే దానికి కారణం. స్టీవెన్స్ ను చంపింది గడాఫీ విధేయ గ్రీన్ రెసిస్టెన్సేనని మొదట లిబియా ప్రభుత్వ నేతలు ప్రకటించారు. అయితే గ్రీన్ రెసిస్టెన్స్ నీడలో లిబియా ప్రజలు ప్రతిఘటన ఇస్తున్నారన్న వాస్తవం నాటో పరువు తీస్తుంది. గడాఫీకి వ్యతిరేకంగా లిబియా ప్రజలు తిరుగుబాటు చేశారన్న పశ్చిమ దేశాల ప్రచారం అబద్ధమని…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1

ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై దాడులు జరిగి సెప్టెంబర్ 11, 2012 తో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లిబియాలో రెండో అతి పెద్ద పట్టణమైన బెంఘాజిలో అమెరికా రాయబారి కార్యాలయంపై విధ్వంసకర దాడులు జరిగాయి. దాడిలో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ దుర్మణం చెందాడు. సంవత్సరం పైగా లిబియా ప్రజలపైనా, ప్రభుత్వంపైనా నాటో యుద్ధ విమానాల సాయంతో ముస్లిం టెర్రరిస్టు సంస్ధలు సాగించిన విధ్వంసకాండకీ, సామూహిక జనహననానికీ క్రిస్టఫర్…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

ఇండియా-చైనా యుద్ధం: మిలట్రీ చర్యపై ముందే హెచ్చరించిన చైనా

ఈ అక్టోబర్ 20 తేదీతో చైనా-ఇండియాల యుద్ధం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలపై పత్రికలు తాజా విశ్లేషణలకు పూనుకుంటున్నాయి. టి.వి చానెళ్లు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి. చైనా ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండియాపై దాడి చేసిందన్నది ఈ విశ్లేషణలు, ప్రత్యేక కధనాల సారాంశంగా ఉన్నది. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ ఆదేశాలతోనే చైనా ఇండియాపై దురహంకార దాడికి దిగిందని నిన్న…

అమెరికా దురాక్రమణపై పోరాటంలో తాలిబాన్ పరిమితులు గుర్తించాలి

(ఇది నాగరాజు అవ్వారిగారి వ్యాఖ్య.  తాలిబాన్ కి మద్దతు ఎందుకివ్వాలన్నదీ వివరిస్తూ నేను రాసిన ఆర్టికల్ కింద రాసిన వ్యాఖ్య. ‘తాలిబాన్ కి మద్దతు’ లాంటి పెద్ద పదాలను ఉపయోగించనవసరం లేదన్న ఆయన సూచనని నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. తాలిబాన్ కి ఉన్న పరిమితులను గుర్తించాలన్న నాగరాజు గారి పరిశీలన వాస్తవికమైనది. తాలిబాన్ గురించి ఆయన చేసిన విశ్లేషణ సమగ్రంగా ఉన్నందున, పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో ఆయన రాసిన రెండు వ్యాఖ్యలను కలిపి టపా గా…

తాలిబాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ఎందుకివ్వాలి?

(గత మలాల యూసఫ్జాయ్ ఆర్టికల్ కింద వ్యాఖ్యాత చక్రిగారు ఒక కొత్త కోణాన్ని పాఠకుల ముందు ఉంచారు. ‘వర్టికల్ మరియు హారిజాంటల్ సమస్య’ అనే దృష్టి కోణంలో తాను సమస్యను చూస్తున్నట్లు చెప్పారు. సామాజిక విశ్లేషణల్లోనే కాక ప్రజలతో సంబంధం ఉన్న అనేక ఇతర సమస్యల విశ్లేషణలో కూడా  కొందరు ఈ కోణాన్ని తరచుగా ప్రస్తావిస్తారు. ఈ కోణంలో చూసినపుడు వ్యవస్ధాగత సమస్యలు కొంత తేలికగా అర్ధం అయే అవకాశం ఉంటుంది. తన దృష్టిలో ఏది వర్టికల్,…

మలాల యూసఫ్జాయ్: అమెరికా దురాక్రమణ యుద్ధ వాస్తవాలు వాస్తవాలే, ‘కుట్ర సిద్ధాంతాలు’ కాదు

కుట్రలు లేనిదే అమెరికా ప్రపంచాధిపత్యం నడవదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు యూరప్ లో కూడా అమెరికా జరిపిన, జరిపిస్తున్న కుట్రల సమాచారం బైటికి వచ్చినప్పుడల్లా, వాటిని ‘కుట్ర సిద్ధాంతాలు’ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కొట్టిపారేయడం పరిపాటి. అది వాటి అవసరం, ప్రయోజనం. అందువల్లనే ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు పూనుకుని ఈ కుట్రలను బైటికి తీస్తున్నాయి. మనం చేయవలసింది వాటిని గుర్తించడమే తప్ప అక్కడ కూడా పశ్చిమ పత్రికల ప్రచారంలో కొట్టుకుపోయి ‘కుట్ర సిద్ధాంతాలు’గా…

‘మలాల యూసఫ్జాయ్’: 14 యేళ్ళ బాలిక చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు -కార్టూన్

పాకిస్ధాన్ పశ్చిమ రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోని స్వాట్ లోయలో ‘మలాల యూసఫ్జాయ్’ అనే 14 సంవత్సరాల బాలికపై హత్యా ప్రయత్నం జరిగింది. అక్టోబర్ 9 తేదీన ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ను మిలట్రీ చెక్ పోస్టుకి సమీపంలోనే ఆపి, దుండగులు ఆమె తలపైనా, గొంతులోనూ కాల్పులు జరిపారు. బాలికా విద్య కోసం ప్రచారం చేస్తున్నందుకు ఆమెను పాకిస్ధాన్ తాలిబాన్లు చంపడానికి ప్రయత్నించారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారం లంకించుకున్నాయి. పాకిస్ధాన్ లో వైద్యం సరిపోలేదని…

మా దేశంలో రక్తపాతానికి టర్కీ ఆపాలజీ చెప్పిందా? -సిరియా

టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి…

శిఖండి టర్కీ అండగా, సిరియా దురాక్రమణలో అమెరికా మరో అడుగు

సిరియాపై అమెరికా ప్రత్యక్ష దురాక్రమణ దాడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల అండతో 18 నెలలుగా సిరియా ప్రజలపై టెర్రరిస్టులు సాగిస్తున్న మారణకాండ అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యక్ష జోక్యానికి సాకులు వెతుకుతున్న నాటో కూటమి తానే ఒక సాకును సృష్టించుకుంది. టర్కీ భూభాగం నుండి సిరియాలోకి చొరబడిన టెర్రరిస్టులు టర్కీ పైకే జరిపిన దాడిని అడ్డు పెట్టుకుని సిరియాపై ఆయుధ దాడికి టర్కీ (నాటో సభ్యురాలు) మిలట్రీ తెగబడింది. ఇరాక్ పై…

సిరియాలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా కొత్త కుట్ర

సిరియా కిరాయి తిరుగుబాటు ఎంతకీ ఫలితం ఇవ్వకపోవడంతో ఆ దేశంపై ప్రత్యక్ష దాడికి అమెరికా కొత్త మార్గాలు వెతుకుతోంది. రష్యా జోక్యంపై అబద్ధాలు సృష్టించి ఆ సాకుతో తానే ప్రత్యక్షంగా రంగంలో దిగడానికి పావులు కదుపుతోంది. జులైలో సిరియాలో జొరబడిన టర్కీ విమానాన్ని సిరియా ప్రభుత్వం కూల్చివేయడం వెనుక రష్యా హస్తం ఉందంటూ తాజాగా ప్రచారం మొదలు పెట్టింది. సిరియా కిరాయి తిరుగుబాటుకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్న సౌదీ అరేబియాకి చెందిన చానెల్ ఆల్-అరేబియా ఈ…

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం: రెండు వేలు దాటిన అమెరికన్ల చావులు

అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి సాగిస్తున్న ‘ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధం’ లో అమెరికా సైనికుల చావులు 2,000 దాటిందని బి.బి.సి తెలిపింది. అయితే, స్వతంత్ర సంస్ధల లెక్కకూ, అమెరికా నాటో ల లెక్కకూ అమెరికా చావుల్లో ఎప్పుడూ తేడా ఉంటుంది. స్వతంత్ర సంస్ధ ‘ఐ కేజువాలిటీస్’ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2,125 కి పైనే. తాలిబాన్ మిలిటెంట్ల చేతుల్లో అమెరికా సైనికులు మరణించారని వార్తా సంస్ధలు చెప్పినపుడు కొన్ని సార్లు ఆ వార్తలను అమెరికా…

చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల…

ప్రపంచ వ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు -ఫోటోలు

ఒక అమెరికన్ యూదు (నకౌలా బెస్సెలే నకౌలా) నిర్మించాడని చెబుతున్న ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమా కు నిరసనగా సెప్టెంబరు 11 తేదీన ప్రారంభమయిన నిరసనలు ప్రపంచం అంతటా విస్తరించాయి. కైరో, బెంఘాజీ నగరాల్లో జరిగిన హింసాత్మకం దాడుల అనంతరం పెచ్చరిల్లిన ఈ నిరసనలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. అమెరికా ఎంబసీలు నిరసనలకు, విధ్వంసాలకు లక్ష్యంగా మారాయి. తమ ఎంబసీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెబుతూనే అమెరికా కొన్ని అరబ్,…

లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు.…