శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…

ప్యారిస్ దాడి సామ్రాజ్యవాద అణచివేతను చట్టబద్ధం చేస్తుంది -2

మొదటి భాగం తరువాత……………….. ప్యారిస్ పత్రికపై జరిగిన దాడిలో పాల్గొన్నవారు అసలు ఉగ్రవాదులే కాదని, ఫ్రాన్స్ గూఢచార సంస్ధల ప్రోద్బలంతో వారి ఏజెంట్లుగానే దాడి చేశారు తప్ప ఉగ్రవాదులుగా దాడి చేయలేదని అనుకోవలసిన అవసరం లేదు. ఫ్రాన్స్ లో పాలకవర్గాలు పనిగట్టుకుని వ్యాపింపజేసిన ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ల వల్ల, ఫ్రాన్స్ సమాజంలోనూ ప్రభుత్వాల నుండి ఎదురవుతున్న వివక్ష వల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయినందునే ఆ ముగ్గురు ముస్లిం పౌరులు ఉగ్రవాద దాడికి తెగబడి ఉండవచ్చు కూడా. ఫ్రాన్స్…

ప్యారిస్ దాడి: ఉగ్రవాదులను సాయుధం చేసింది ఫ్రాన్సే

జనవరి 7వ తారీఖున, కొత్త సంవత్సరం మత్తు ఇంకా వదలని ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి మత్తు విదిల్చుకుని అప్రమత్తం అయింది. రెండు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన సాయుధ దాడి నగరంపై జరిగిందన్న వార్త ప్యారిస్ పౌరులకు కలవరం కలిగించింది. ముసుగులు ధరించిన దుండగులు కొందరు ప్రఖ్యాత వ్యంగ్య పత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ తో పాటు 12 మందిని కాల్చి చంపారని ఆ వార్త వారికి తెలియజేసింది. ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు ముగియకుండానే ‘ఇది…

ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

చైనాలో జీమెయిల్ బంద్!

అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు…

సమాన దూరం అయింది, ఇజ్రాయెల్ కౌగిలి మిగిలింది

గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన…

ఉగ్రవాదానికి పాక్ విరుగుడు మరణ శిక్షలు! -కార్టూన్

పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…” ********* పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు! ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి…

అతి చిన్న శవ పేటికలు అత్యంత బరువైనవి -ఫోటోలు

“SMALLEST COFFINS ARE THE HEAVIEST” పెషావర్ పాఠశాలపై తాలిబాన్ జరిపిన పైశాచిక మృత్యు క్రీడకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో ఒక యువతి పట్టుకున్న ప్లకార్డ్ పై రాసి ఉన్న ప్రకటన ఇది. “అతి చిన్న శవపేటికలు, అత్యంత బరువైనవి” ఈ ఐదు పదాల ప్రకటనకు ఎంత లోతైన అర్ధం! మానవ మాత్రుల సామాన్య దృష్టికి అందని లోతు అది. బహుశా మానవుడి సాధారణ భావోద్వేగానికి కూడా అందని లోతు కావచ్చు. ప్లకార్డు పట్టుకున్న ఆ యువతికి…

తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు…

తాలిబాన్ తుపాకి శిక్షణ టార్గెట్లు: పూలు! -కార్టూన్

లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా…

పాక్ పాఠశాలపై ఉగ్ర దాడి, 84 మంది పిల్లలు బలి -ఫోటోలు

పాకిస్ధాన్ కు చెందిన తాలిబాన్ శాఖ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పెషావర్ పట్టణంలో పరమ హీనమైన దాడికి పాల్పడింది. అమెరికాలో మాత్రమే కనిపించే ఉగ్రవాద తరహా దాడికి పాక్ తాలిబాన్ తెగబడింది. పాఠశాలపై తుపాకులతో దాడి చేసి అభం శుభం ఎరుగని పసి పిల్లలను కాల్చి చంపే ఉన్మత్త ఘటనలు ఇప్పటిదాకా అమెరికాకు మాత్రమే పరిమితం. అలాంటి దాడి పాకిస్ధాన్ లో చోటు చేసుకుంది. 6గురు తాలిబాన్ ఆత్మాహుతి కార్యకర్తలు జరిపిన దాడిలో 126 మంది చనిపోగా వారిలో 84…

అమెరికా ఎన్.ఎం.డిని ఛేదించగల చైనా హైపర్ సోనిక్

అమెరికా అభివృద్ధి చేసుకున్న మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడును చైనా తాజాగా పరీక్షించింది. శబ్ద వేగానికి 10 రెట్ల వేగంతో ప్రయాణించగల హైపర్ సోనిక్ మిసైల్ అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడు కావడం దాని వేగం వల్లనే. దూసుకు వచ్చే మిసైళ్లను మధ్యలోనే కనిపెట్టి దానిని గాలిలోనే మరో మిసైల్ తో ఎదుర్కొని మట్టి కరిపించే వ్యవస్ధను అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇందులో దాడికి వచ్చే మిసైల్ వేగాన్ని కనిపెట్టి, నిర్దిష్ట సమయంలో ఏ పాయింట్…

ఇండియా-రష్యా సంబంధాలకు పరీక్షకాలం -ది హిందు ఎడిట్

(రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా వచ్చి వెళ్లారు. 20 ఒప్పందాలను ఆయన కుదుర్చుకుని మరీ వెళ్లారు. ఈ ఒప్పందాలను అమెరికా విమర్శించింది. ఈ అంశం గురించి ఈ రోజు ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ‘Testing times for India-Russia ties’ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ********* బిలియన్ల డాలర్ల విలువ కలిగిన 20 ఒప్పందాలపై ఒక్క రోజులో సంతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత సందర్శన ఒక ఉత్పాదక సందర్శన…

సిరియా టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ సాయం -ఐరాస

ఇప్పుడిక అనుమానం అనవసరం. ఇజ్రాయెల్ నిజ స్వరూపం ఏమిటో స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. న్యాయమైన పాలస్తీనా ప్రజల పోరాటాలను టెర్రరిజంగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నించే యూదు రాజ్యం తాను స్వయంగా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, వైద్య సహాయం అందజేస్తోందని ఐరాస నివేదికలు స్పష్టం చేశాయి. 1967 నాటి ఐరాస తీర్మానం అనుసారం సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగం గోలన్ హైట్స్ లో నెలకొల్పిన ఐరాస కార్యాలయం UNDOF సంస్ధ ఐరాస…