గ్రెక్సిట్: కార్మికవర్గ ఉద్యమాలు, మెటాక్సస్ నియంతృత్వం -5

4వ భాగం తరువాత…………………. 1929 నుండి ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘గ్రేట్ డిప్రెషన్’ రెండో ప్రపంచ యుద్ధానికి తగిన ఆర్ధిక భూమికను ఏర్పరిచింది. 2008 నాటి ‘గ్రేట్ రిసెషన్’ (ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం) లాగానే ఆనాటి ‘గ్రేట్ డిప్రెషన్’ కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం గమనించవలసిన విషయం. మొన్నటి గ్రేట్ రిసెషన్ వాల్ స్ట్రీట్ లోని బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘లేమాన్ బ్రదర్స్’ కుప్పకూలిన దరిమిలా ఉనికిలోకి రాగా ఆనాటి గ్రేట్ డిప్రెషన్ అమెరికా స్టాక్…

గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

మూడో భాగం తరువాయి………………… – గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం 20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని…

గ్రెక్సిట్: ఆంగ్లో-అమెరికన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావు, గ్రీసు -3

రెండో భాగం తర్వాత…………………………. పశ్చిమ పెట్టుబడిదారీ వ్యవస్ధ గ్రీసును అభివృద్ధి చెందిన దేశంగా 1961 నుండి పరిగణిస్తోంది. (అభివృద్ధి చెందిన దేశాల క్లబ్ గా చెప్పే ఓ.ఇ.సి.డి కూటమిలో గ్రీసు సభ్య దేశం.) కానీ అక్కడి ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఎన్నడూ ఆ అభివృద్ధిని అనుభవించలేదు. ఆధునిక గ్రీసు చరిత్రను ప్రజల దృక్కోణంలో పరిశీలిస్తే పాలకవర్గాల అణచివేతలతో పాటు, ప్రజల తిరుగుబాటు పోరాటాలు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హిట్లర్…

గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

మొదటి భాగం తరువాత……………… గ్రీసు అబద్ధాలు?! గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి…

గ్రెక్సిట్: జర్మనీ సామ్రాజ్యవాదం ఉక్కు కౌగిలిలో ఐరోపా -1

మొదటి భాగం………………. గత అయిదేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో పతాక శీర్షికలలో నానుతున్న వార్త గ్రెక్సిట్! గత రెండేళ్లుగా గ్రెక్సిట్ వార్తల మధ్య వ్యవధి తగ్గుతూ వచ్చింది. ఈ యేడు జనవరిలో ‘రాడికల్ లెఫ్ట్’ గా పిలువపడుతున్న సిరిజా కూటమి అధికారం చేపట్టాక గ్రెక్సిట్ క్రమం తప్పని రోజువారీ వార్త అయింది. గ్రీక్ + ఎక్సిట్ కలిసి గ్రెక్సిట్ అయింది. ఎక్సిట్ అంటే బయటకు వెళ్లిపోవడం. గ్రీసు యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోయే పరిస్ధితులను గ్రెక్సిట్ అని…

ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం -ది హిందు ఎడిట్..

ఇరాక్ లోని ప్రధాన నగరం మోసుల్ ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాత, పశ్చిమ ఆసియాలో ఒక బలీయమైన శక్తిగా ఇస్లామిక్ స్టేట్ కొనసాగుతూనే ఉంది. అమెరికా నేతృత్వంలో సాగుతున్న బాంబింగ్ దాని ఊపును అడ్డుకుంటున్న జాడ లేదు. కుర్దిష్ మరియు షియా మిలీషియాల చేతుల్లో ఎదురైన కొన్ని ఓటములు తప్పితే, గత సంవత్సర కాలంలో ఐ.ఎస్ తన ప్రభావ ప్రాంతాన్ని సిరాక్ (Syraq = Syria + Iraq) లోని తన (ప్రధాన) స్ధావరం కంటే…

ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

చైనా సరిహద్దులో భద్రత తగ్గింపు

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో చైనా చొరబాట్ల గురించి బి.జె.పి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రధాని నరేంద్ర మోడి గారయితే చైనా విషయంలో యు.పి.ఏ పై నిప్పులు చెరిగేవారు. హిందూత్వ అభిమానగణం గురించి ఇక చెప్పనే అవసరం లేదు. హిందూత్వపై విమర్శలు కనపడిన చోటల్లా చొరబడి చైనా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని దాడికి దిగుతారు. కొండొకచో బూతులకు లంకించుకుంటారు. తీరా మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా, చైనా…

వెనుదిరిగిన (అరబ్) వసంతం -ది హిందు ఎడిట్..

2013లో జరిగిన మిలట్రీ కుట్ర ద్వారా అధికారం నుండి కూల్చివేయబడిన ముస్లిం బ్రదర్ హుడ్ (ద ఇఖ్వాన్) నాయకులపై మోపిన ప్రధాన క్రిమినల్ కేసుల నుండి వెలువడతాయని భావిస్తున్న అనేక తీర్పుల్లో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ, ఆయన సహ ప్రతివాదులపై గత వారం వెలువడిన దోషిత్వ నిర్ధారణ తీర్పు మొదటిది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం వెలుపల నిరసనకారులపై అల్లర్లు రెచ్చగొట్టినందుకు గాను మోర్సీకి 20 యేళ్ళ కారాగారవాస శిక్ష విధించారు. నూతన రాజ్యాంగ…

స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

ప్రశ్న: బోసుపై నెహ్రూ గూఢచర్యం; నేతాజీ మరణించారా?

ప్రశ్న (రవిచంద్ర): నేతాజీ మరణం నిజమేనా? ఆయన కుటుంబంపై మన ప్రభుత్వమే గూఢచర్యం నిర్వహించడం ఎందుకు? ఆయన దేశ భక్తుడు కారా? సమాధానం: యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద చేరిన పాలక వర్గ గ్రూపుల మధ్య వైరుధ్యం, వైరం కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడో స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నాటి గూఢచార కార్యకలాపాలను పనిగట్టుకుని మరీ ఇప్పుడు వెల్లడి చేయడం, అది కూడా ఎంచుకున్నవి మాత్రమే వెల్లడి చేయడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా…

WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి. హీరోషిమా, నాగసాకి నగరాలపై…

నాజీ హత్యాక్షేత్రం ‘ఆష్విజ్’ విముక్తికి 70 యేళ్ళు -ఫోటోలు

జనవరి 26 తేదీ మనకి రిపబ్లిక్ దినంగా తెలుసు. ఆ తేదీకి ప్రపంచం గుర్తుంచుకునే ప్రాముఖ్యత కూడా మరొకటి ఉన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. నాజీ సైన్యం దెబ్బకి మహా ఘనత వహించిన ఐరోపా రాజ్యాలన్నీ తోకముడిచి పారిపోవడమో, చేతులెత్తి లొంగిపోవడమో చేస్తున్న దశలో ఆ హంతక సైన్యానికి ఎదురొడ్డి పోరాడి నిలిచిన ఒకే ఒక్క దేశం  సోవియెట్ రష్యా. బోల్శివిక్ సైన్యం ధాటికి నాజీ సైన్యమే కకావికలై పరుగులు తీస్తుంటే వారిని వెన్నంటి…

ఒబామా మోడీల అణు కౌగిలి -కార్టూన్

రిపబ్లిక్ డే రోజున భారత సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆ ముందు రోజున భారత ప్రధాని మోడితో మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం 2008లో కుదుర్చుకున్న ‘పౌర అణు ఒప్పందాన్ని’ ఆపరేషనలైజ్ చేసేందుకు తాము ఒక అంగీకారానికి వచ్చామని ఇరువురు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇంతవరకు జనానికి చెప్పలేదు. అమెరికా అధికారులకు తెలిసిన ఒప్పందం వివరాలు భారత ప్రజలకు ఎందుకు తెలియకూడదు? భారత ప్రజలకు చెప్పకూడని…

చైనా-ఇండియాల కోసం సుష్మా షడ్సూత్రాలు

మూడు రోజుల చైనా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఇరు దేశాల స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి ‘పంచశీల’ సూత్రాల తరహాలో ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ‘షడ్శీల పధకం’ అనవచ్చో లేదో ఇంకా తెలియదు. బీజింగ్ లో భారత విదేశీ మంత్రి ఆవిష్కరించిన ఆరు సూత్రాలు 1 నుండి 6 వరకు కాకుండా A నుండి F వరకు ఉండడం విశేషం. విదేశీ మంత్రి సుష్మా ప్రకటించిన ఆరు సూత్రాలు ఇలా ఉన్నాయి. A –…