నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…

ఆశకు తగిన కారణం -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 6, 2014 నాటి ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ఐదు అణ్వస్త్ర దేశాలు మరియు జర్మనీ (P5+1), ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న చర్చల ఎగుడు దిగుడు చరిత్ర గురించి బాగా తెలిసినవారు సదరు చర్చల తాజా రౌండ్, జూన్ 2015 వరకు మరో కొనసాగింపుకు నోచుకోవడాన్ని ఆశాభావంతో పరికించడం పట్ల చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్ తన మౌలిక అణు నిర్మాణాలను అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించడానికీ, ఆంక్షల నుండి గణనీయ మొత్తంలో,…

ఇసిస్ లో చేరిన ఇండియన్ తిరిగి రాక

ఇరాక్, సిరియాలలో భూభాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పరిచిందని అమెరికా ప్రకటించిన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా’ సంస్ధ లో చేరిన భారతీయుడు వెనక్కి వచ్చేశాడని ది హిందు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాయబార ఛానెళ్ల ద్వారా ప్రయత్నాలు చేయడంతో ఆరిఫ్ మజీద్ క్షేమంగా దేశానికి చేరుకున్నాడని పత్రిక తెలిపింది. మోసుల్ లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆరిఫ్ చనిపోయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆరిఫ్ తో పాటు వెళ్ళిన మరో…

జాతివివక్ష: ఆందోళనల సుడిలో అమెరికా -ఫోటోలు

ఫెర్గూసన్ పోలీసు కాల్పుల్లో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన కేసులో నిందితుడైన తెల్లజాతి పోలీసుపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. తెల్లజాతి సభ్యులే 75 శాతం స్ధానాల్ని ఆక్రమించి ఉండే గ్రాండ్ జ్యూరీ తెల్లజాతి పోలీసుకు అనుకూలంగా వ్యవహరించిందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా గ్యాండ్ జ్యూరీ తీర్పుకు వ్యతిరేకంగా అమెరికా అంతటా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. నల్లజాతి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ యంత్రాంగం వివక్షా రహితంగా వ్యవహరించబోదని ఫెర్గూసన్…

మోడి ఎక్స్ ప్రెస్ టు అమెరికా, వయా ఆస్ట్రేలియా -2

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం యురేనియం సరఫరా అన్నది సమాన స్ధాయి వ్యాపార సంబంధాల్లో భాగంగా జరిగినది కాదు. భారత దేశం అమెరికా, దాని మిత్ర దేశాలతో వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మరింత దృఢతరం చేసుకుని, అమెరికా శిబిరానికి మరింత దగ్గర అయ్యే భౌగోళిక రాజకీయ అవసరం రీత్యానే యురేనియం సరఫరా అవుతుంది. అనగా యురేనియం ఇంధనాన్ని ఇచ్చి ఇండియా నుండి చైనా-రష్యా శిబిరంపై వ్యతిరేకతను అమెరికా సంపాదిస్తోంది. ఇది దళారీ పాలకుల లక్షణాల్లో ఒకటి.…

ఆస్ట్రేలియా మీదుగా అమెరికా వెళ్ళు మోడి రైలు -1

భారత ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 11 నుండి 20 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. మియాన్మార్ పర్యటనలో ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సభకు హాజరయిన మోడి ఆస్ట్రేలియా పర్యటనలో జి-20 గ్రూపు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడియే ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుని భారత పత్రికలు మురిసిపోయాయి. వామపక్ష భావాలు కలిగి ఉన్నట్లు భావించే ది హిందు పత్రిక సైతం ఈ పత్రికల్లో ఒకటిగా ఉండడం గమనార్హం. అంటరాని నేతగా దాదాపు ప్రపంచం…

మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.…

రక్తం పారిన ఎర్రెర్రని నేలలు, సముద్రాలు -ఫోటోలు

‘ఎరుపంటే ఎందుకురా భయం భయం! పసి పిల్లలు మీకంటే నయం నయం!! కలం వెంబడి అచ్చంగా నిప్పులు కురిపించిన చెరబండరాజు గారి ఓ కవితలోని పాదాలివి. ఇంధ్ర ధనుస్సులో ఎరుపు రంగు ఆ చివరన ఉంటుంది. ఎరుపు రంగు కిరణానికి తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) మిగిలిన ఆరు రంగులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందువలన ఎరుపు రంగు తీక్షణత ఎక్కువ. ఆ కారణం వల్ల పసి పిల్లలు ఎరుపు రంగుకి ఇట్టే ఆకర్షితులు అవుతారు. రక్తం…

ఇంకా వెన్నాడుతున్న ప్రమాదాలు -ది హిందు ఎడిట్

భారత నౌకా బలగం, స్వల్ప కాల విరామం అనంతరం, ప్రమాదాల నిలయంగా కొనసాగుతూనే ఉంది. గత వారమే సహాయక నౌక ఒకటి విశాఖపట్నం తీరంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన ఒక నావికుడి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో నలుగురు ఆచూకీ దొరకని వారుగా ప్రకటించబడ్డారు. వైజాగ్ సమీపంలో ఒక వాణిజ్య నౌక ఢీ కొట్టడంతో ఐ.ఎన్.ఎస్ కోరా అనే క్షిపణి యుద్ధ నావ స్వల్ప నష్టానికి గురైన తర్వాత పక్షం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద ఘటన.…

గేట్ల వద్ద వద్ద అసలు శత్రువు -ది హిందు ఎడిట్ (ఫోటోలు)

(ఆదివారం నాడు ఇండియా-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద అవతలివైపు భారీ పేలుడు సంభవించింది. అమాయక పౌరులు అనేకమంది ఈ ఆత్మాహుతి బాంబు పేలుడులో మరణించారు. ఈ అంశంపై మంగళవారం, నవంబర్ 4 2014, ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ***************** పాకిస్తాన్ లో వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి దుఃఖభాజనం. శోచనీయం ఏమిటంటే ఇది (సరిహద్దు) ద్వారాల వద్ద అసలు శత్రువు ఇండియా…

టెర్రరిజంను అమెరికా ఎలా ప్రోత్సహిస్తుంది?

జి.కె.గణేష్: టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా? సమాధానం: ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.  ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం…

డ్రోన్ లను కూల్చగల చైనా లేజర్ వెపన్ సిద్ధం

‘తాడిని తన్నేవాడు ఉంటే, వాడి తలను తన్నేవాడూ ఉంటాడ’ని సామెత! ప్రపంచంలో అత్యంత అధునాతనమైన మానవ రహిత యుద్ధ విమాణాలైన డ్రోన్ లను లెక్కకు మిక్కిలిగా తయారు చేసుకుని విర్ర వీగుతున్న అమెరికాకు చైనా నుండి దుర్వార్త ఎదురయింది. డ్రోన్ విమానాలను, అవి ఎంత చిన్నవైనా సరే, పసిగట్టిన 5 సెకన్లలో కూల్చగల లేజర్ ఆయుధాలను తయారు చేశామని చైనా ప్రకటించింది. తయారు చేయడమే కాదు విజయవంతంగా పరీక్షించామని కూడా చైనా తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని…

స్వదేశీ విదేశీ అప్పులూ, సార్వభౌమ ఋణ పత్రాలూ… -ఈనాడు

“పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్” అంటాడు గిరీశం మహాకవి గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నాటకంలో. పొగ తాగడం అనివార్యం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆనక ఆ ప్రాతిపదికన తన అలవాటును గొప్పదిగా ఎస్టాబ్లిష్ చేయడానికి గిరీశం ఆ మాట చెప్పాడు. అప్పు సంగతి దాదాపు అలాంటిదే. పొగ అవసరం లేకపోయినా ఉందని గిరీశం ఎస్టాబ్లిష్ చెయ్యబోయాడు. అప్పు అవసరం మాత్రం నిజంగానే అనివార్యం. ఎందుకని అనివార్యం? నిజానికి ఎవరి శ్రమకు తగిన సంపాదన వారికి…

ఆసియా కోసం ఓ కొత్త బ్యాంకు -ది హిందు ఎడిటోరియల్

(బ్రెట్టన్ వుడ్ కవలలుగా అభివర్ణించబడే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మరో బ్యాంకు ఆసియా ఖండం కోసం ఆవిష్కృతం అయింది. ఇది కూడా చైనా చొరవతో, అత్యధిక చైనా నిధులతో, ఇండియా దన్నుతో రూపుదిద్దుకోవడం గమనార్హం. బీజింగ్ లో 21 దేశాల వ్యవస్ధాపక భాగస్వామ్యంతో ఆసియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు బీజింగ్ లో ప్రారంభం అయింది. బ్యాంకుకు పురిట్లోనే సంధి కొట్టడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించినా ఆటంకం అధిగమిస్తూ ఎ.ఐ.ఐ.బి…

ఒట్టావాలో టెర్రర్ -ది హిందు ఎడిటోరియల్

ఉగ్రవాదానికి కెనడా కొత్తది ఏమీ కాదు. ఆ దేశ పార్లమెంటుపై దాడి గతంలో ఎన్నడూ ఎరగనట్టిదిగా కనిపించవచ్చు గానీ -కెనడా అమాయకత్వపు ముగింపుగా కూడా దాడిని అభివర్ణించారు- ఉగ్రవాదంతో ఆ దేశానికి, మరే ఇతర పశ్చిమ దేశం కంటే ముందునుండీ, సుదీర్ఘ అనుభవమే ఉంది. 1970లో క్విబెక్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్.ఎల్.క్యూ) బ్రిటిష్ దౌత్యవేత్తను, కెనడియన్ కార్మిక మంత్రిని కిడ్నాప్ చేసి రెండున్నర నెలలపాటు తన అదుపులో ఉంచుకుంది. అప్పటి ప్రధాన మంత్రి పియర్రే ట్రుడ్యూ క్విబెక్…