స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

ప్రశ్న: బోసుపై నెహ్రూ గూఢచర్యం; నేతాజీ మరణించారా?

ప్రశ్న (రవిచంద్ర): నేతాజీ మరణం నిజమేనా? ఆయన కుటుంబంపై మన ప్రభుత్వమే గూఢచర్యం నిర్వహించడం ఎందుకు? ఆయన దేశ భక్తుడు కారా? సమాధానం: యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద చేరిన పాలక వర్గ గ్రూపుల మధ్య వైరుధ్యం, వైరం కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడో స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నాటి గూఢచార కార్యకలాపాలను పనిగట్టుకుని మరీ ఇప్పుడు వెల్లడి చేయడం, అది కూడా ఎంచుకున్నవి మాత్రమే వెల్లడి చేయడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఇండియా…

WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి. హీరోషిమా, నాగసాకి నగరాలపై…

నాజీ హత్యాక్షేత్రం ‘ఆష్విజ్’ విముక్తికి 70 యేళ్ళు -ఫోటోలు

జనవరి 26 తేదీ మనకి రిపబ్లిక్ దినంగా తెలుసు. ఆ తేదీకి ప్రపంచం గుర్తుంచుకునే ప్రాముఖ్యత కూడా మరొకటి ఉన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. నాజీ సైన్యం దెబ్బకి మహా ఘనత వహించిన ఐరోపా రాజ్యాలన్నీ తోకముడిచి పారిపోవడమో, చేతులెత్తి లొంగిపోవడమో చేస్తున్న దశలో ఆ హంతక సైన్యానికి ఎదురొడ్డి పోరాడి నిలిచిన ఒకే ఒక్క దేశం  సోవియెట్ రష్యా. బోల్శివిక్ సైన్యం ధాటికి నాజీ సైన్యమే కకావికలై పరుగులు తీస్తుంటే వారిని వెన్నంటి…

ఒబామా మోడీల అణు కౌగిలి -కార్టూన్

రిపబ్లిక్ డే రోజున భారత సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆ ముందు రోజున భారత ప్రధాని మోడితో మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం 2008లో కుదుర్చుకున్న ‘పౌర అణు ఒప్పందాన్ని’ ఆపరేషనలైజ్ చేసేందుకు తాము ఒక అంగీకారానికి వచ్చామని ఇరువురు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇంతవరకు జనానికి చెప్పలేదు. అమెరికా అధికారులకు తెలిసిన ఒప్పందం వివరాలు భారత ప్రజలకు ఎందుకు తెలియకూడదు? భారత ప్రజలకు చెప్పకూడని…

చైనా-ఇండియాల కోసం సుష్మా షడ్సూత్రాలు

మూడు రోజుల చైనా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఇరు దేశాల స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి ‘పంచశీల’ సూత్రాల తరహాలో ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ‘షడ్శీల పధకం’ అనవచ్చో లేదో ఇంకా తెలియదు. బీజింగ్ లో భారత విదేశీ మంత్రి ఆవిష్కరించిన ఆరు సూత్రాలు 1 నుండి 6 వరకు కాకుండా A నుండి F వరకు ఉండడం విశేషం. విదేశీ మంత్రి సుష్మా ప్రకటించిన ఆరు సూత్రాలు ఇలా ఉన్నాయి. A –…

మోడి: ఇక ఛలో చైనా!

అమెరికా వెళ్ళి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడి త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడి చైనా సందర్శనకు తగిన దౌత్య ఏర్పాట్లు చేయడం కోసం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత తీవ్రం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుష్మా పేర్కొనడం విశేషం. ఇందుకోసం ఇరు దేశాల మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ తో పాటు చైనా దౌత్యవేత్తలు సైతం…

రాజపక్సే: నిలువునా కూలిన మర్రిమాను -కార్టూన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన! వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల…

నేను మార్క్సిస్టుని! -దలైలామా

కమ్యూనిజానికి కాలం చెల్లిందని నమ్ముతున్నవారికిది దుర్వార్త! హిందూ మతోన్మాదాన్ని పీకలదాకా ఎక్కించుకుని, బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకుని, చైనామీద వ్యతిరేకతతో దలైలామా పైన ప్రేమ పెంచుకున్న జీవులకు, బహుశా డిప్రెషన్ లోకి నెట్టివేసే విషాద వార్త! దలైలామా సైతం ‘నేను మార్క్సిస్టుని’ అని చాటుకోవడం కంటే మించిన విషాదకర దుర్వార్త ఉండగలదా? “సామాజికార్ధిక సిద్ధాంతానికి సంబంధించినంతవరకు నేను ఇంకా మార్క్సిస్టునే” అని దలైలామా ప్రకటించారు. “నేను ఇంకా” అనడం ద్వారా తాను పూర్వాశ్రమంలో ‘మార్క్సిస్టుని’ అని దలైలామా…

శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…

ప్యారిస్ దాడి సామ్రాజ్యవాద అణచివేతను చట్టబద్ధం చేస్తుంది -2

మొదటి భాగం తరువాత……………….. ప్యారిస్ పత్రికపై జరిగిన దాడిలో పాల్గొన్నవారు అసలు ఉగ్రవాదులే కాదని, ఫ్రాన్స్ గూఢచార సంస్ధల ప్రోద్బలంతో వారి ఏజెంట్లుగానే దాడి చేశారు తప్ప ఉగ్రవాదులుగా దాడి చేయలేదని అనుకోవలసిన అవసరం లేదు. ఫ్రాన్స్ లో పాలకవర్గాలు పనిగట్టుకుని వ్యాపింపజేసిన ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ల వల్ల, ఫ్రాన్స్ సమాజంలోనూ ప్రభుత్వాల నుండి ఎదురవుతున్న వివక్ష వల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయినందునే ఆ ముగ్గురు ముస్లిం పౌరులు ఉగ్రవాద దాడికి తెగబడి ఉండవచ్చు కూడా. ఫ్రాన్స్…

ప్యారిస్ దాడి: ఉగ్రవాదులను సాయుధం చేసింది ఫ్రాన్సే

జనవరి 7వ తారీఖున, కొత్త సంవత్సరం మత్తు ఇంకా వదలని ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి మత్తు విదిల్చుకుని అప్రమత్తం అయింది. రెండు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన సాయుధ దాడి నగరంపై జరిగిందన్న వార్త ప్యారిస్ పౌరులకు కలవరం కలిగించింది. ముసుగులు ధరించిన దుండగులు కొందరు ప్రఖ్యాత వ్యంగ్య పత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ తో పాటు 12 మందిని కాల్చి చంపారని ఆ వార్త వారికి తెలియజేసింది. ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు ముగియకుండానే ‘ఇది…

ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని…

చైనాలో జీమెయిల్ బంద్!

అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు…