టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. టర్కీ విమానం కూల్చివేతను అడ్డు…

ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం…

లిబియా తిరుగుబాటు ప్రతినిధితో హిల్లరీ సమావేశం, నో-ఫ్లై జోన్ ఆమోదం?

నాటో కూటమి లిబియా గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ లో జి-8 గ్రూపు దేశాల మంత్రుల సమావేశం జరిగింది. లిబియా భూభాగంపై ఉన్న గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే విషయాన్ని చర్చించడం కోసం జి-8 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధి “మహమ్మద్ జెబ్రిల్” హిల్లరీ క్లింటన్ ను కలిశాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం వివరాలు ఏవీ తెలియలేదు. జి-8…

బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది. బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు. ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

బహ్రెయిన్ హింస పై ఇంగ్లండ్ ఆందోళన

  బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు. బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న…

ముగ్గురు ‘గాజా’ పౌరులను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైనికులు

కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా…

బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం

  మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…

ఈజిప్టు తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా?

దాదాపు ముప్ఫై మంది వరకు అమరులై పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిన ఈజిప్టు ప్రజల నియంతృత్వ వ్యతిరేక తిరుగుబాటు విజయవంతం అయినట్లేనా అన్న అనుమానం ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలకులతో పాటు ఈజిప్టు ప్రజలను సైతం పట్టి పీడిస్తోంది. తిరుగుబాటు లేవనెత్తిన ప్రధాన డిమాండు ప్రజాస్వామ్య పరిపాలన రావాలని. పార్టీలు ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసుకొనే స్వేచ్ఛ, సంఘాలు నిర్మించుకొనే స్వేచ్ఛ కావాలని తిరుగుబాటుదారులు మనసారా కోరుకున్నారు. ఆ డిమాండ్లు నెరవేరుతాయా లేదా అన్న అనుమానాలు…

లిబియాలో ఫిబ్రవరి 17 న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన కోసం పధకం

యెమెన్, బహ్రెయిన్, ఇరాన్ ల అనంతరం ఇప్పుడు లిబియాలో ప్రభుత్వ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలకు పిలుపినిచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శకులు ప్రధానంగా ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ లిబియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసే బలం ప్రభుత్వ వ్యతిరేకులకు లేదని పరిశీలకుల అభిప్రాయం. గురువారం, ఫిబ్రవరి 17న “ఆగ్రహ దినం” జరపాలని నిరసనకారులు నిర్ణయించుకోగా దానికి ఒక రోజు ముందే లిబియాలోని ఓడరేవు పట్టణమయిన బెంఘాజి లో లిబియా నాయకుడు “మహమ్మద్ గఢాఫి” వ్యతిరేక, అనుకూలుర మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొద్ది…

సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…