ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా’ వ్యాస పరంపరలో 11 వ భాగం ఈ రోజు ప్రచురించబడింది. వివిధ దేశాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న అంశానికి కొనసాగింపు ఈ వ్యాసం. 10వ ఆర్టికల్ లో అమెరికా యూరప్ ల గురించి చర్చించుకున్నాం. ఈసారి మిగిలిన ప్రాంతంలో మరి కొన్నింటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చర్చిస్తాము. ఈనాడు చదువు పేజీలో ఈ వ్యాసం చూడవచ్చు. వ్యాసాన్ని ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్ పైన…

విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

మావో మూడు ప్రపంచాలు -ఈనాడు ఆర్టికల్ 5వ భాగం

ఈ రోజు ఈనాడు చదువు పేజిలో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ ఐదవ భాగం వచ్చింది. ఇందులో మధ్య ప్రాచ్యం, బ్రిక్స్, బేసిక్, మూడు ప్రపంచాల సిద్ధాంతం తదితర అంశాలను చర్చించబడింది. ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్  క్లిక్ చేస్తే ఆ పేజికి వెళ్లొచ్చు. కింద బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చదివచ్చు.

ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి. కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు…

బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో

అమెరికా అనే సామ్రాజ్యవాద మత్త గజాన్ని తెలిసి తెలిసి ఢీకొన్న నేటి కాలపు హీరో బ్రాడ్లీ మేనింగ్. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాల్లో అమెరికా సైనికులు, అధికారులు పాల్పడిన అమానవీయ హత్యాకాండలు, సామాన్య పౌరులపై సాగించిన యుద్ధ నేరాలు తదితర సమాచారాన్ని ‘వికీ లీక్స్’ కి అందజేసి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న దారుణ కృత్యాలకు కేంద్రం అమెరికాయేనని ససాక్ష్యాలతో వెల్లడి చేశాడు బ్రాడ్లీ మేనింగ్. అత్యంత రహస్యంగా బ్రాడ్లీ మేనింగ్ ని విచారిస్తూ తాను నిత్యం వల్లించే…

భారత్ బెదిరింది; పాక్ సాధించింది

ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్…

సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…

ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -ఈనాడు

ఈనాడు దిన పత్రిక సోమవారం (18-02-2013) నాటి ‘చదువు’ పేజిలో ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ని ప్రచురించింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆర్టికల్ కాపీని కింద ఇస్తున్నాను. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులొ చూడగలరు.) మొదటి భాగం వరకు ఈ రోజు ప్రచురించారు. రెండో భాగాన్ని, తరువాత వచ్చే చదువు పేజిలో (వచ్చే సోమవారం) ప్రచురించనున్నట్లు పత్రిక తెలిపింది. గత సంవత్సరం ఏప్రిల్ 23 తేదీన ఈనాడు పత్రికే ఈ బ్లాగ్ ను తన…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఆపండి! ఒబామాకు అమెరికన్ల పిటిషన్

తిరుగుబాటు పేరుతో సిరియాలో మారణకాండకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు నిధులు ఇవ్వడం ఆపాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం నిర్వహించే వెబ్ సైట్ whitehouse.gov లో ఈ మేరకు వివిధ సెక్షన్ల ప్రజలు ఒక పిటిషన్ నమోదు చేశారు. ముస్లిం టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం పేర్కొన్న ఆల్-ఖైదా సంస్ధకు సిరియాలో తిరుగుబాటు నడుపుతున్న 29 సంస్ధలు విధేయతను ప్రకటించాయనీ, అలాంటి టెర్రరిస్టులకోసం అమెరికా ప్రభుత్వం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఖర్చు పెట్టడం గర్హనీయమని…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…

సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…