టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం

సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా…

సిరియాపై ఆయుధ నిషేధం ఎత్తివేసిన ఐరోపా

తాను చెప్పిన నీతిని తానే అడ్డంగా ఉల్లంఘించింది యూరోపియన్ యూనియన్. రెండేళ్ల క్రితం సిరియాలో హింస చెలరేగినందున ఆయుధ సరఫరా మరింత హింసను ప్రేరేపిస్తుందన్న కారణం చెబుతూ సిరియాపై ఆయుధ నిషేధాన్ని (arms embargo) యూరోపియన్ యూనియన్ విధించుకుంది. ఇపుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎత్తివేతతో సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు యధేచ్ఛగా, బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేసుకునే అవకాశం ఐరోపా దేశాలకు వస్తుంది. ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు పెంచి, వెంటిలేషన్ పై ఉన్న…

టెర్రరిస్టులకు మద్దతుగా ఇజ్రాయెల్ ట్యాంకు, ధ్వంసం చేసిన సిరియా

పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన…

సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస…

సిరియా: ఐరాసలో అమెరికాకు పడిపోతున్న మద్దతు

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.…

ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో

ఆ కనిపించే గోడ ఇజ్రాయెల్ తన ప్రాంతాల చుట్టూ నిర్మించిన కట్టడం. కోట కోడను తలపించే ఇలాంటి ఎత్తైన గోడలు ఇజ్రాయెల్ నిండా దర్శనమిస్తాయి. అవి ఇజ్రాయేలీయులు (యూదులు), పాలస్తీనీయులు నివసించే ప్రాంతాలను వేరు చేస్తాయి. పనులకు వచ్చే పాలస్తీనీయులను శల్య పరీక్ష చేయడానికి కూడా చెక్ పోస్టుల వద్ద ఇలాంటి ఎత్తైన గోడలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇలాంటి చెక్ పోస్టుల వద్ద ‘క్యూ’లలో ఇజ్రాయెల్ సైనికుల చేత నఖశిఖ పర్యంతం చెకింగ్ అయ్యాకనే పాలస్తీనీయులకు ఆ…

ఇజ్రాయల్ అకడమిక్ బాయ్ కాట్ లో చేరిన స్టీఫెన్ హాకింగ్

ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బహుశా తన జీవితంలో మొదటిసారిగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయల్ ను అకడమిక్ బాయ్ కాట్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమాన్ పెరెజ్ ఆతిధ్యం ఇవ్వనున్న అత్యున్నత స్ధాయి కాన్ఫరెన్స్ కు హాజరు కాకూడదని ఆయన నిర్ణయించాడు. తద్వారా ఇజ్రాయెల్ ను అకడమిక్ గా బాయ్ కాట్ చేస్తున్న బ్రిటిష్ ప్రముఖుల్లో ఆయన కూడా…

అనూహ్య పరిణామం: సిరియాపై వెనక్కి తగ్గిన అమెరికా

నిత్యం పెనం మీద కాలుతుండే మధ్యప్రాచ్యం (Middle-East) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఊహించని రీతిలో సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు చర్చలు జరగడానికి అంగీకరించాడు. అధ్యక్షుడు బషర్ అస్సద్ గద్దె దిగితే తప్ప చర్చలు సాధ్యం కాదని హుంకరిస్తూ వచ్చిన అమెరికా, చర్చలకు అంగీకరించడం ప్రపంచంలో బలా బలాలు మారుతున్నాయనడానికి మరో ప్రబల సంకేతం. అమెరికా, ఐరోపాల ప్రాభవ క్షీణతలో మరో అధ్యాయానికి…

సౌదీ కార్మిక చట్టంతో 18 వేల భారతీయులు ఇంటికి

సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశీయుల నిరుద్యోగం తగ్గించడానికి నూతన కార్మిక చట్టం ‘నితాకాత్’ ప్రవేశ పెట్టడంతో వేలాది మంది భారతీయులు ఇండియాకు తిరుగుముఖం పడుతున్నారు. కొత్త చట్టం వలన తమ ఉద్యోగాలు ఎలాగూ పోతాయన్న ఆలోచనతో ఉన్న అనేకమంది ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ కోసం భారత రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు పాస్ పోర్టులను ఎంప్లాయర్స్ తీసేసుకుంటారు. దానితో ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ అవసరం ఏర్పడింది. సౌదీ అరేబియాలో 20 లక్షల  మందికి పైగా భారతీయులు…

ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -11 భాగాలు

ఈనాడు దిన పత్రికలో ప్రతి సోమవారం ప్రచురించే చదువు పేజీలో ‘జాతీయ అంటార్జాతీయ పరిస్ధుతులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపర వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలను కొత్తగా చూసినవారు పాత భాగాల కోసం అడుగుతున్నారు. కొంతమంది ‘కటింగ్ తీసి పెట్టారా’ అని అడుగుతుంటే, ఇంకొందరు ‘అన్నీ కలిపి బుక్ వేస్తారా’ అని అడుగుతున్నారు. నేను కటింగ్స్ తీసి పెట్టలేదు. బ్లాగ్ లో ఉన్నాయి గనుక ఆ జాగ్రత్త తీసుకోలేదు. బుక్ వేయదలిస్తే ఈనాడు వాళ్ళు వేయాలనుకుంటా.…

ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా’ వ్యాస పరంపరలో 11 వ భాగం ఈ రోజు ప్రచురించబడింది. వివిధ దేశాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న అంశానికి కొనసాగింపు ఈ వ్యాసం. 10వ ఆర్టికల్ లో అమెరికా యూరప్ ల గురించి చర్చించుకున్నాం. ఈసారి మిగిలిన ప్రాంతంలో మరి కొన్నింటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చర్చిస్తాము. ఈనాడు చదువు పేజీలో ఈ వ్యాసం చూడవచ్చు. వ్యాసాన్ని ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్ పైన…

విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…