గాజా విధ్వంసం ఖరీదు $8 బిలియన్లు

40 రోజుల గాజా విధ్వంసం ఖరీదు 8 బిలియన్ డాలర్లు. అనగా 48,000 కోట్ల రూపాయలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ ఆదాయంలో ఇది 2/3 వంతుతో సమానం. కానీ ఉమ్మడి ఏ.పి జనాభా 10 కోట్లు కాగా గాజా జనాభా కేవలం 18 లక్షలు మాత్రమే. “గాజా భూభాగం సర్వ నాశనం అయిపోయింది. అనేక సంస్ధలు ఉమ్మడిగా పూనుకుంటే తప్ప పునర్నిర్మాణం సాధ్యం కాదు” అని గాజా గృహ నిర్మాణం మరియు ప్రజా పనుల…

ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాజావైపు చూపండి! -ఫోటోలు

ప్రకృతి శక్తులకు మాత్రమే సాధ్యమైన ఉన్మత్త విధ్వంసం ఇది. ఆధునిక సాంకేతికాభివృద్ధి శక్తులను కూరి పసిప్రాణాల్ని పేల్చేస్తున్న చమురు దాహపు వినాశనమిది. నెలరోజుల నిర్విరామ డాలర్ల దాడుల్లో మిగిలిన మానవత్వపు శిధిలాలివి. అత్యంత ప్రాచీన పాలస్తీనా జాతి గుండె కోత ఇది.  చెట్టూ-పుట్టా, గుడిసే-మేడా  తేడా లేకుండా దివిసీమనంతటినీ ముంచేసిన ప్రళయ భీకర పెను తుఫానును చూసి గుండెలు బాదుకున్నాం. ఉప్పు సముద్రాలన్నీ తెచ్చి కుమ్మరించిన హిందూ మహా సముద్రపు సునామీలో వేలమందిని కోల్పోయాం. కట్టుదిట్టమైన ఫుకుషిమా…

లండన్: ఇజ్రాయెల్ వ్యతిరేక భారీ ప్రదర్శనలు

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెత. ఈ సామెత తమ విషయంలో నిజం కాదని లండనర్లు నిరూపిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటిష్ పత్రికలు అంతా కట్టగట్టుకుని ఇజ్రాయెల్ స్వయం రక్షణ హక్కు కోసం పాటు పడుతుంటే, ఇజ్రాయెల్ అమానవీయ దాడులు జరిపే హక్కులను నిలదీస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లండనర్ల నిరసనలను లండన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ‘పాలస్తీనియన్ సాలిడారిటీ కాంపెయిన్’, ‘స్టాప్…

హింసనచణ ధ్వంస రచన… -ఫోటోలు

ఇజ్రాయెల్ ధ్వంస రచనకు 26 రోజులు పూర్తయ్యాయి. వందలాది మంది పాలస్తీనీయులు మర ఫిరంగుల తాకిడికి పుట్టలు పుట్టలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఉమ్మడిగా తుడిచివేయబడుతున్నాయి. భవనాలకు భవనాలే ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. అక్కడ పిట్టలు ఎగరడం ఎప్పుడో మానేశాయి. విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి. రాత్రయితే ఇప్పుడక్కడ నీడలు కదలవు. యంత్ర భూతాల ఫిరంగి గొట్టాలు, ఇనుప రెక్కల డేగలు విరామమెరుగక విరజిమ్ముతున్న పేలుడు మంటల్లో మానవత్వం శలభంలా మాడి మసవుతోంది. ఇజ్రాయెల్ నుండి…

పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి

గాజాలో ఐరాస తరపున శరణార్ధి శిబిరాలను నిర్వహిస్తున్న UNRWA ప్రతినిధి తమ పాఠశాలపై దాడిని వివరిస్తూ కెమెరా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అమానుషాన్ని కళ్ళారా చూసిన ఆయన జరిగిన ఘోరాన్ని తిరిగి గుర్తు చేసుకుంటుండగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నోట మాట రాకపోయినా బలవంతంగా మాటలు కూడబలుక్కుని వివరిస్తూ తలవంచుకుని ఏడ్చేశారు. పాఠశాలలో తలదాచుకుంటున్న వారు నిద్రలోనే చనిపోయారని UNRWA ప్రతినిధి క్రిస్ గన్నెస్ ఆల్ జజీరా టి.వి ఛానెల్ కు చెబుతూ దుఃఖించారు. జబాలియా…

ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

‘మొనగాడు’ అందామా! గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా! మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా! ‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా? గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…

ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….

పొన్నం శ్రీనివాస్: పాలస్తీనా సమస్య ఉగ్రవాద సమస్యే తప్పా… జాతుల అంతం లాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావం ఎలా జరిగింది. అక్కడున్న వాళ్లంత ఎక్కడికి వలస వెళ్లారు. మళ్లి వాళ్ల స్వస్థలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా… సమాధానం: శ్రీనివాస్ గారూ, ఇదే తరహా ప్రశ్నను గతంలో మరో మిత్రుడు అడిగారు. సమాధానం ఇచ్చాను. సమాధానంతో పాటు పాలస్తీనా సమస్యపై రాసిన కొన్ని ఆర్టికల్స్ కు లింక్ లు…

ఇజ్రాయెల్ దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యాలు -ఫోటోలు

మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న…

ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు. ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి. ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు…

ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర

సౌదీ అరేబియా, కతార్, టర్కీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ద్వారా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు సిరియాలో రెచ్చగొట్టి కొనసాగిస్తున్న కిరాయి తిరుగుబాటులో ఐ.ఎస్.ఐ.ఎల్/ఐ.ఎస్.ఐ.ఎస్ పాత్ర రహస్యం ఏమీ కాదు. వారిని మోడరేట్ ఉగ్రవాదులుగా పేర్కొంటూ కొన్నిసార్లు బహిరంగంగానే ఆయుధ, ధన, గూఢచార సహాయం అందజేసింది అమెరికా. తాజాగా బహిరంగంగానే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని ఒబామా ప్రకటించాడు. టర్కీ, జోర్డాన్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సి.ఐ.ఏ సైనిక శిక్షణ…

ఇసిస్ మెరుపు పురోగమనం: ఇరాక్, సిరియాల విచ్ఛిన్న కుట్రలో భాగం

ఇరాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా జూన్ మూడో వారం నుండి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒక్కసారిగా వార్తలు గుప్పించడం మొదలు పెట్టాయి. ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆల్-షామ్ (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంత్ (ISIL)’ అనే ముస్లిం టెర్రరిస్టు సంస్ధ మెరుపు వేగంతో ఇరాక్ లో దూసుకు వెళ్తోందని, అమెరికా శిక్షణ గరిపిన సుశిక్షిత…

షియా ఇరాన్ సందర్శనలో సున్నీ కువైట్ అమీర్

మధ్య ప్రాచ్యంలో మరో పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు పక్కా మిత్ర దేశం కువైట్ అమీర్ ఒకరు ఆదివారం నుండి తన ఇరాన్ సందర్శన ప్రారంభించాడు. షియా ఇరాన్ ప్రభావం మధ్య ప్రాచ్యంలో పెరిగడానికి దారి తీసే ప్రతి పరిణామాన్ని ఆటంకపరిచే సున్నీ సౌదీ అరేబియా పాత్ర ప్రస్తుత పరిణామంలో ఎంత ఉందన్నది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. గత సంవత్సరం అధికారం చేపట్టిన రౌహాని ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాలతో పాటు ప్రాంతీయ ప్రత్యర్ధి…

ఈజిప్టులో 3,500 సం.ల నాటి వాతావరణ నివేదిక

వాతావరణ మార్పుల గురించి ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలిసి ఇటీవల కాలానిదే. కానీ ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా అలాంటి పరిజ్ఞానం ఒకటుండేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. 3,500 సంవత్సరాల క్రితం నాటి కాల్సైట్ (కాల్షియం కార్బొనేట్) రాతి పలక పైన వాతావరణ మార్పుల గురించిన నివేదికను అమెరికాలోని పరిశోధకులు కనుగొన్నారు. 6 అడుగుల ఎత్తున ఉన్న ఈ కాల్సైట్ పలక పైన ఉన్న 40 లైన్ల పాఠ్యాన్ని ఇటీవలే చదవగలిగారని ఫ్రీ ప్రెస్…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…