హింసనచణ ధ్వంస రచన… -ఫోటోలు
ఇజ్రాయెల్ ధ్వంస రచనకు 26 రోజులు పూర్తయ్యాయి. వందలాది మంది పాలస్తీనీయులు మర ఫిరంగుల తాకిడికి పుట్టలు పుట్టలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఉమ్మడిగా తుడిచివేయబడుతున్నాయి. భవనాలకు భవనాలే ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. అక్కడ పిట్టలు ఎగరడం ఎప్పుడో మానేశాయి. విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి. రాత్రయితే ఇప్పుడక్కడ నీడలు కదలవు. యంత్ర భూతాల ఫిరంగి గొట్టాలు, ఇనుప రెక్కల డేగలు విరామమెరుగక విరజిమ్ముతున్న పేలుడు మంటల్లో మానవత్వం శలభంలా మాడి మసవుతోంది. ఇజ్రాయెల్ నుండి…


