చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?

“మీరు హరిజనులు. చదవడానికి, రాయడానికి మీకు హక్కు లేదు. బూట్లు, చెప్పులు కుట్టడమే మీ పని. మా ఇళ్ళలో మిమ్మల్ని దాసులుగా ఉంచుకుంటాం. మీ తాత ముత్తాతలు చేసిన పని అదే. మీరు హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లిపోండి. లేదా, ఇక్కడ రక్తపాతం తప్పదు.” ఏ మారు మూల పల్లెలోనో అహం మూర్తీభవించిన అగ్రకుల భూస్వాములు పలికిన మాటలు కావు యివి. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధుల ప్రేలాపనలు ఇవి. పాట్నా యూనివర్సిటీలో షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు నివసించే…

తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ‘ది హిందూ‘ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు దుర్మరణం చెందారు. పోలీసులు మరణించిన తమ సహచరుడి శవానికి ఇరవై అడుగుల దూరంలోనే నిలబడి శవాన్ని తేవడానికి గిరిజనులను పంపించడంతో పేలుడునుండి పోలీసులు తప్పించుకోగా గిరిజనులు చనిపోయారు. శవాన్ని తన భుజానికి ఎత్తుకుంటూ శవం…

ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…

దామిని స్మృతిలో…

దామిని, అమానత్, నిర్భయ పేరేదైతేనేం? ఆమె………………….. హింసోన్మత్త పశు వాంఛలు కాటువేసిన గాయం పెను నిద్దురలోని దేశ అంతరాత్మని తట్టి లేపిన స్పర్శ లాఠీలను గేలి చేసిన నినాదాలకు స్వరపేటిక నీటి ఫిరంగులకు ఎదురొడ్డిన కన్నీటి జలపాతం భారత మహిళ అదృశ్య కారాగార వాసానికి దేదీప్య కాంతుల వెలుగు నిచ్చిన సాహసి! పాలకుల ఉదాసీనత, పాలితుల కర్తవ్యాలు తర్కించి, నిగ్గు దేల్చిన బాధల పాటల పల్లవి! రెండు గంటల్లో వెయ్యి జీవితాల హింసాత్మక దాడిని ఎదుర్కొని, ప్రతిఘటించి,…

బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా…

అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?

(సోమా చౌధురి జనవరి 9 తేదీన తెహెల్కా పత్రికకు రాసిన వ్యాసం ఇది. తెహెల్కా పత్రికకు ఆమె మేనేజింగ్ ఎడిటర్. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రమ గారు తన వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలే దాదాపుగా ఇందులో వ్యక్తం అయ్యాయి. ప్రధాన స్రవంతి లోని పత్రికా రచయితలు దేశ సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ మాత్రం ప్రశ్నించడం ఒకింత సంతృప్తి కలిగించినా, ఆంగ్ల పత్రిక కనుక లక్ష్యిత సెక్షన్లను చేరదన్న తెలివిడి నిరాశను కలిగిస్తుంది. తెలుగు బ్లాగర్లకు…

నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా

(ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రితం, తనపై నలుగురు సంస్కృతీ కాపలాదారులు రెండు గంటలపాటు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన మూడు సంవత్సరాల తరవాత ‘సొహైలా అబ్దులాలి’ రాసిన వ్యాసం ఇది. దీనిని మహిళా పత్రిక ‘మానుషి’ ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ భారత సమాజంలో పితృస్వామిక విలువలు మారని వైనాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది. భారత పాలకులు అదే బూజుపట్టిన, స్త్రీలను చెరబట్టిన బురదలోనే దొర్లుతున్నారని ఈ వ్యాసంలోని అంశాలనూ, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారు వరదలా పారిస్తున్న…

ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

రచన: నాగరాజు ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…