తలతిక్కవాదంతో ఎఫ్.డి.ఐ బిల్లుని గెలిపించిన ఎస్.పి, బి.ఎస్.పి

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

హమాస్ x ఫతా మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1

ప్రపంచ పోలీసు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ ల బెదిరింపులను చీత్కరిస్తూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో చారిత్రాత్మక తీర్పును ప్రకటించాయి. పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక రాజ్యం (non-member observer state) గా గుర్తింపునిస్తూ ఐరాస సాధారణ సభ (General Assembly) భారీ మెజారిటీతో నిర్ణయించింది. ఐరాసకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధిస్తామనీ, పాలస్తీనాకు ఇస్తున్న సహాయాన్ని కూడా ఆపేస్తామనీ అమెరికా అత్యున్నత స్ధాయిలో తీవ్రంగా సాగించిన బెదిరింపులను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి. ప్రపంచ…

ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…

చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం

చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇంతకాలం చెబుతూ వచ్చిన మమత బెనర్జీ తన ఉద్దేశాలు వేరే ఉన్నాయని వెల్లడి చేసుకుంది. పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే, సాధ్యంకాని అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి భంగపాటుకు గురయినట్లు దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక సమయంలో వెన్ను చూపుతోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించే బిల్లుపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, ఓటింగ్ అవసరం లేకుండా చేసే కుట్రలో కాంగ్రెస్ కు సహకారం…

గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు

ఛార్మినార్ కట్టడానికి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ కట్టడం గుట్టుని ‘ది హిందూ’ పత్రిక రట్టు చేసింది. హిందూ సంస్ధలు, గ్రూపులు చెబుతున్నట్లుగా భాగ్యలక్ష్మి ఆలయం ఛార్మినార్ కట్టడమంత పాతదేమీ కాదనీ, అది కేవలం 50 సంవత్సరాల క్రితం నాటిదేననీ తెలియజేసింది. బాగ్యలక్ష్మి ఆలయం కట్టడానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేని ఫోటోను పత్రిక బుధవారం ప్రచురించింది. ఫోటో పైన తేదీ ఏమీ లేనప్పటికీ ఫోటోలో ఉన్న కార్లను బట్టి అది ఆరు శతాబ్దాల క్రితం తీసిన…

అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు

26/11 గా ప్రస్తావించే ముంబై మారణహోమంలో పాల్గొన్న అజ్మల్ కసబ్ ను ఉరి తీశారని పత్రికలు తెలిపాయి. కసబ్ ఉరితీతను మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ధృవీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. మారణ హోమానికి నాలుగు సంవత్సరాలు నిండడానికి ఐదు రోజులకు ముందు అజ్మల్ కసబ్ ఉరికంబం పై శిక్ష అనుభవించాడు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 8 తేదీన తిరస్కరించడంతో కసబ్ ని ఉరి తీయడానికి ఉన్న…

బాల్ ధాకరే అస్తమయం -కార్టూన్

బహుశా, ఈ కార్టూన్ కి ప్రత్యేక వివరణ అవసరం లేదేమో. స్వయంగా కార్టూనిస్టు అయిన బాల్ ధాకరేకు మరో ప్రఖ్యాత కార్టూనిస్టు కేశవ్ (ది హిందూ) ఇచ్చిన నివాళి ఇది.     –

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…

నేనెందుకు ధాకరేకు నివాళులు అర్పించలేను? -జస్టిస్ కట్జు

(జస్టిస్ మార్కండేయ కట్జు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడాయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్. తన అభిప్రాయాలను జస్టిస్ కట్జు నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాడని పేరు. దానివలన ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులూ దాదాపు అంతమంది ఉన్నారు. ముద్రణా మీడియాపై నియంత్రణ ఉన్నట్లే దృశ్య, శ్రవణ మీడియా పై కూడా పరిమిత నియంత్రణ ఉండాలని వాదించడం వలన ఆయనకి మీడియాలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. రెండు రోజుల…

కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG – కాగ్) రాజ్యాంగ బద్ధ సంస్ధ. ఎకౌంటింగ్ లెక్కలతో పాటు ప్రభుత్వ విధానాల ఫలితాలను కూడా ఆడిట్ చేసే హక్కు (దీనినే పెర్ఫార్మెన్స్ ఆడిట్ అని పిలుస్తున్నారు) కూడా కాగ్ కి ఉంది. గత రెండు మూడేళ్లుగా కోర్టులతో పాటు కాగ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దానితో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల అవినీతి ఘనకార్యాలు పచ్చిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల అవినీతితో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల అసలు స్వరూపం కూడా…

యెడ్యూరప్ప కొత్త పార్టీకి బి.జె.పి ఆక్సిజన్ -కార్టూన్

అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన కర్ణాటక బి.జె.పి నాయకుడు యెడ్యూరప్ప కొత్త ప్రాంతీయ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించినప్పటికీ ఆయనను బహిష్కరించలేని పరిస్ధితి బి.జె.పిది. బి.జె.పి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదని యెడ్యూరప్ప ప్రకటించినందుకే బి.జె.పి ఆయన పట్ల కృతజ్ఞతతో పడి ఉంటోంది. అలా కాదని ధైర్యం చేసి బెహిష్కరిస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. దానితో యెడ్యూరప్ప పార్టీలో ఉంటూనే కొత్త పార్టీ పనులను చక్కబెట్టుకునే అపూర్వ అవకాశం యెడ్యూరప్పకి…

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ దిశ ఎటు? -కార్టూన్

అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.…

రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…

నితిన్ గడ్కారీ భవితవ్యం ఎటు వైపు? -కార్టూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు.…