గ్వాంగ్జూ హత్యాకాండ నిర్మాతకు రాయబార హోదా, కొరియా చీకటిగాధ మరోసారి

దక్షిణ కొరియా ప్రజలు భయోత్పాతంతో గుర్తుకు తెచ్చుకునే గ్వాంగ్జూ సామూహిక హత్యాకాండ బాధ్యుడు ప్రభుత్వం ఇచ్చిన డిప్లొమేటిక్ ట్రావెల్ పాస్ పోర్ట్ తో దర్జాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రజాస్వామిక ఉద్యమకారులను చంపినందుకు కొరియా ప్రభుత్వం చేత మరణ శిక్ష కూడా విధించబడిన మాజీ కరకు నియంత ‘చున్ దూ-హ్వాన్’ ఇపుడు ప్రభుత్వ మర్యాదలు అనుభవిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నియంతృత్వ పాలన అంతం కావడానికి కారణమయిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని చున్ రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. అమెరికా రాయబారి ప్రత్యక్ష…

రాహుల్ గాంధీ ఎందుకు కేంద్ర మంత్రి కాలేడు? -కార్టూన్

రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం ఇవ్వాలనీ, ఆయనకి ప్రభుత్వంలో కూడా నాయకత్వ పదవి అప్పజెప్పాలనీ కాంగ్రెస్ లో అనేకమంది చాలా కాలంగా శతపోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడల్లా ఈసారి రాహుల్ కి సముచిత పదవి తధ్యమని కాంగ్రెస్ పెద్దలతో పాటు, పత్రికలు కూడా ఊహాగానాలు చేయడం ఒక రొటీన్ గా ఉంటూ వచ్చింది. 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తాజా విస్తరణలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో స్ధానం పొందలేదు. ఎప్పటికప్పుడు…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) 2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం…

2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి

2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిత అమాయకత్వం ఒట్టి నటనే అన్న సంగతి అనూహ్య రీతిలో వెల్లడయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో సి.పి.ఐ సభ్యుడు గురుదాస్ దాస్ దాస్ గుప్తా తరచి తరచి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మాజీ కేబినెట్ కార్యదర్శి అసలు సంగతి కక్కడంతో ప్రధాని దాపరికం గుట్టు రట్టయ్యింది. 2జి స్పెక్ట్రమ్ ఎంట్రీ ఫీజు అప్పటి మార్కెట్ ధరల ప్రకారం 36,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని తాను…

సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ…

అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అవినీతి నిర్మూలనకి చట్టం తెమ్మంటే అలా అడిగినవాడికి అవినీతిని అంటగడతారు. లోక్ పాల్ చట్టం తెమ్మంటే ప్రభుత్వాన్ని ప్రవేటు సంస్ధలు బ్లాక్ మెయిల్ చేయడాన్ని సహించనంటూ లక్షలాది కోట్ల అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడు. పాలకుల, కంపెనీల అవినీతిని కొద్దో గొప్పో వెల్లడిస్తున్న సమాచార హక్కు చట్టం వల్ల ప్రవేటు వ్యక్తుల ప్రైవసీ హక్కులకి భంగం కనుక సవరిస్తానని హుంకరిస్తున్నాడు. సమాచార…

కమలమే హస్తమా? -కార్టూన్

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో…

డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్

సోనియా గాంధీ అల్లుడి గిల్లుడి పై దృష్టి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన స్వరాన్ని మరింత పెంచాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించకుండా స్ధిరాస్తి కంపెనీ ‘ఢిల్లీ లాండ్ అండ్ ఫైనాన్స్’ (డి.ఎల్.ఎఫ్) కి దళారీగా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భారత దేశానికి అనధికారిక ప్రధమ కుటుంబంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అభివర్ణించే సోనియా కుటుంబ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అయాచిత లబ్ది చేకూర్చిన డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా రాష్ట్ర…

చైనా కంపెనీలతో దేశ భద్రతకి ప్రమాదం, అమెరికా కమిటీ హెచ్చరిక

చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలతో జాతీయ భద్రతకి ప్రమాదం కలగవచ్చని అమెరికా కమిటీ ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా ప్రఖ్యాత టెలీ కంపెనీలయిన హువి, జెడ్.టి.ఇ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. అమెరికా కంపెనీల స్వాధీనం, విలీనాల నుండి ఈ రెండు కంపెనీలను నిషేధించాలని సిఫారసు చేసింది. కాగా, తమ సిఫారసుకు కమిటీ చూపిన కారణం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. చైనా ప్రభుత్వంతోనూ, మిలటరీతోనూ తమకు సంబంధం లేదని రుజువు…

కేంద్ర మంత్రి జైస్వాల్ కి ముసలి భార్యపై మోజు తగ్గిందట!

కేంద్ర బొగ్గు మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తానింకా ప్రాచీన యుగాల్లోనే మగ్గుతున్నానని చెప్పుకున్నాడు. వివాహ బంధాన్ని క్రికెట్ మ్యాచ్ తోనూ, భార్యలని కాలక్రమేణా మోజు తగ్గిపోయే విజయాలతోనూ పోల్చి తన ఫ్యూడల్ బుద్ధి చాటుకున్నాడు. వయసు పెరిగిన భార్యలపై మోజు కోల్పోయే పురుష పుంగవుల వక్రబుద్ధికి ఆమోద ముద్ర వేసేశాడు. భార్య అంటే మనసు, మెదడు, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ కాదనీ, కేవలం మగ శరీరాలకి సుఖాల్ని పంచే మాంసపు ముద్దలేననీ ‘మనసులో మాట’ బయట పెట్టాడు.…

తెలంగాణ ఎక్కడ? -కార్టూన్

“తెలంగాణా! అదెక్కడుంది?” కేంద్ర సచివుడు వయలార్ రవి కొద్ది రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇది. కేంద్రంలో తిష్టవేసి, ఆంధ్ర దొరల డబ్బు కట్టలు మేస్తూ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షలను చెద పురుగుల్లా కొరికేస్తున్న అవినీతి కీటకాలు ఇలాంటి గుడ్డితనాన్ని ఇప్పటికి చాలా సార్లు ప్రదర్శించాయి. వీరి అంధత్వాన్ని గేలి చేస్తూ తెలంగాణ ప్రజలు పదే పదే ఆందోళనలు నిర్వహించి తెలంగాణ ఎక్కడుందో చాచికొట్టినట్లు చెప్పినా కళ్ళు తెరవడానికి వీరు నిరాకరిస్తున్నారు. పోలీసులు, పారా మిలటరీ…

ప్రజాస్వామ్యం నవ్వులపాలు, సాగరహారం వర్షం పాలు

‘తెలంగాణ మార్చ్’ మరో సీరియస్ ఉద్యమంగా మారకుండా వర్షం అడ్డుపడడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బతికిపోయింది. మార్చ్ కి అనుమతించినట్లే అనుమతించి పోలీసులతో ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగించడం ద్వారా మార్చ్ ని విఫలం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించడంతో రాజకీయ ఐకాస నాయకత్వం ఆగ్రహించింది. ప్రభుత్వం, పోలీసుల మోసానికి ప్రతిగా సాయంత్రం 7 గంటల లోపు మార్చ్ ముగిస్తామన్న హామీని రద్దు చేసుకుని, రాత్రంతా కొనసాగించనున్నట్లు ఐ.కా.స నాయకులు ప్రకటించారు. వర్షం వస్తున్నప్పటికీ మార్చ్ కొనసాగిస్తామని…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…

కాంగ్రెస్ పడవ మునిగేదే, మరి బి.జె.పి పడవ? -కార్టూన్

‘కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం మునిగిపోతున్న పడవ’ అని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఉవాచ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని కూడా గడ్కారీ ప్రకటించాడు.  బి.జె.పి జాతీయ కార్యవర్గంలో మాట్లాడుతూ గడ్కారీ చెప్పిన ఈ మాటలు వాస్తవంలో నిజం కాదని పత్రికల ఏకాభిప్రాయం. బి.జె.పి నిజంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ వరుస ప్రజావ్యతిరేక సంస్కరణలతో బరితెగించేదేనా అన్నది పత్రికల వాదన. ఆ మాట కొంత నిజమే అయినా సంస్కరణల పట్ల బి.జె.పి…