జగన్ కేసు: హోమ్ మంత్రి సబితను ఊరడించిన తోటి మంత్రులు!?

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం. మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి…

జార్జి ఫెర్నాండెజ్: పైకి అమెరికా వ్యతిరేకి, లోపల సి.ఐ.ఏ ఏజెంటు!

వికీలీక్స్ పత్రాలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. డబ్బుతో సంబంధం లేకుండా వికీలీక్స్ తో ఒప్పందం చేసుకున్న ది హిందు పత్రిక తాజాగా మరిన్ని ‘డిప్లొమేటిక్’ కేబుల్స్’ లోని అంశాలను సోమవారం నుండి ప్రచురిస్తోంది. ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ అంటే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ (విదేశాంగ శాఖ) కూ, వివిధ దేశాలలో అమెరికా నియమించుకున్న రాయబారులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. హెన్రీ కిసింజర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ మంత్రి) గా పని చేసిన కాలంలో…

అమెరికా విమాన దాడుల్లో 11 మంది ఆఫ్ఘన్ పిల్లల దుర్మరణం

అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో మరో మారణకాండను సృష్టించాయి. మిలిటెంట్లను చంపే పేరుతో పదకొండు మంది పసి పిల్లలను, ఒక మహిళను విమాన దాడుల్లో చంపేసింది. జరిగిన ఘోరానికి విచారం వ్యక్తం చేయకపోగా ‘పౌరులు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ ధృవపరచలేం’ అని నాటో ప్రతినిధి డాన్ ఈనెర్క్ వ్యాఖ్యానించినట్లు రష్యా టుడే, ది హిందు పత్రికలు తెలిపాయి. అమెరికా దళాలు అమాయక ఆఫ్ఘన్ పౌరులను “ఇబ్బంధుల పాలు చేస్తున్నాయి, హింసిస్తున్నాయి, చంపేస్తున్నాయి” అని…

అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -ఈనాడు ఆర్టికల్ 8వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాసాల పరంపరలో ఎనిమిదవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు, మిలిటెన్సీకి నేపధ్యాన్ని ఈ భాగం క్లుప్తంగా చర్చించింది. ఈ చర్చాంశాల ఆధారంగా అక్కడి పరిణామాలను పరిశీలిస్తే ఒక అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఓపెన్…

యుద్ధం రీత్యా ఎంబసీలు ఖాళీ చేయాల్సి రావచ్చు -ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అమెరికాలు పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ లో ఉన్న తమ సైనిక స్ధావారానికి అదనంగా రెండు క్షిపణి విచ్ఛేదక వ్యవస్ధలను అమెరికా గురువారం నాడు చేరవేసింది. దక్షిణ కొరియా ఆధునిక డిస్ట్రాయర్ యుద్ధ పరికరాలను ఉత్తర కొరియా సరిహద్దుకు శుక్రవారం తరలించింది. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియాలోని విదేశీ రాయబారులు తమ తమ ఎంబసీలను ఖాళీ చేయాల్సి రావచ్చని ఏప్రిల్ 10 తర్వాత వారికి రక్షణ ఇవ్వడం తమకు…

అసలు మైకు పట్టనేల, పట్టితిపో…… -కార్టూన్

అంత భారీ భావాలు వ్యక్తపరచనేల, ఇంత భారం మోయనేల? – రాహుల్ ఇప్పుడు మైకు భారాన్ని మోస్తున్నాడు. మొదటిసారి ‘కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) గురువారం జరిపిన సమావేశంలో మైకు పట్టిన రాహుల్ గాంధీ పేదలను, ముస్లింలను, దళితులను  పరాయీకరిస్తే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా దెబ్బ తింటుందని బోధించాడు. సామాన్య మానవుడికి సాధికారత అప్పగించే విధంగా వ్యవస్ధాగత మార్పులు తేవలసి ఉందని, అందుకోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చాడు. “వివిధ తరగతులను పరాయీకరించే రాజకీయాలతో ఆడుకుంటే…

ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ

సోనియా గాంధీ జామాత రాబర్ట్ వాద్రా పాల్పడిన అక్రమ భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన హర్యానా కేడర్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యాడు. వాద్రా భూ కుంభకోణం తుట్టె కదిలించినందుకు గత అక్టోబరు నెలలో బదిలీ అయిన ఖేమ్కా, విత్తనాభివృద్ధి సంస్ధ నుండి మళ్ళీ బదిలీ వేటు ఎదుర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి కారణం చెప్పలేదు. విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలతో హర్యానా పాలకవర్గాలు కన్నెర్ర చేయడమే…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

కాంగ్రెస్ వర్కింగ్ ఫార్ములా -కార్టూన్

కాంగ్రెస్ ప్రభుత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వ పని తీరుపై ‘ది హిందు’ పత్రిక మరో కార్టూన్ బాణం విసిరింది. అవినీతి స్కాముల మూటలు మోస్తూ, సోనియమ్మ చేతిలో కళ్ళెం పట్టుకుని అదపు చేస్తుంటే, ‘మిస్టర్ క్లీన్’ భారంగా బండి లాగుతున్న దృశ్యం, పరిస్ధితిని కళ్ళకు కడుతోంది. కానయితే స్కాములు ప్రధానికి నిజంగా భారమా లేక ఆయనకు తెలిసీ జరుగుతున్నాయా అన్నది చర్చాంశం. 2జి స్కాము మన్మోహన్ కి తెలిసే జరిగిందనీ, జరగబోతున్నది తెలిసినా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఇటీవల…

మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే…

మోడి ఢిల్లీ ప్రయాణానికి దారెటు? -కార్టూన్

ఒక దేశానికి ప్రధాన మంత్రి అవాలంటే దేశం మొత్తానికి కనీసంగా ఐనా తెలిసి ఉండాలి. ప్రజలకు ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేకపోయినా ప్రధాన మంత్రి అభ్యర్ధి అనగానే ప్రజల మనసుల్లో ఒక భావన మెదలాలి. బహుశా దానిని ‘మాస్ అప్పీల్’ అని (లూజ్ అర్ధంలో) అనవచ్చేమో. బి.జె.పి పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా అనేకమంది బి.జె.పి నాయకుల నోళ్లలో నానుతున్న నరేంద్ర మోడీకి అలాంటిది ఉన్నదా అని ఈ కార్టూన్ ప్రశ్నిస్తున్నట్లుంది. ‘మాస్ అప్పీల్’…

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ పై ఈనాడు ఆర్టికల్

“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం…

ఇండియా ప్రధాని సరే, బి.జె.పి ప్రధాని ఎవరు? -కార్టూన్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఇటీవల జరిగిన బి.జె.పి అత్యున్నత స్ధాయి సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందులో నరేంద్ర మోడి ఒకరని పత్రికలు తెలిపాయి. ఆరు సంవత్సరాల క్రితం బి.జె.పికి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నపుడే మోడిని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, అదే వ్యక్తి నేతృత్వంలో మోడిని మళ్ళీ బి.జె.పి తన పార్లమెంటరీ…

వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -ఈనాడు వ్యాసం 7వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?” వ్యాస పరంపరలొ ఏడవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. జాతీయ పరిస్ధితుల అవగాహనలో భాగంగా ఈశాన్య భారతాన్ని వేధిస్తున్న సరిహద్దు సమస్య గురించి ఈ భాగంలో చర్చించబడింది. ఈనాడు ఇంటర్నెట్ పేజిల్లో ఆర్టికల్ చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ఈనాడు ఇ-పేపర్ నుండి తీసుకున్న ఇమేజ్ ను కింద చూడవచ్చు. ఇమేజ్ పొడవుగా ఉన్నందున ఒకే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా మార్చడం కుదరలేదు. అందువలన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ల…

విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.…