అద్వానీ, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా? -కార్టూన్

బి.జె.పి అంతర్గత సంక్షోభం పై ది హిందూ పత్రిక స్ధిరంగా కేంద్రీకరించి కార్టూన్ లు ప్రచురిస్తోంది. గత పది రోజుల్లో ప్రచురించబడిన పది కార్టూన్ లలో ఆరు బి.జె.పి, ఆ పార్టీ నాయకులపైనే కావడం బట్టి ఈ సంగతి తెలుస్తోంది. ఈ ఆరింటిలో ఐదు కార్టూన్లు అంతర్గత సంక్షోభం పైన గీసినవే. పార్టీ పదవులకు రాజీనామా ద్వారా అద్వానీ ఏమి సాధించదలిచారు? పోనీ ఏమి సాధించారు? ఆవేశంతో రాజీనామా విసిరి కొట్టిన అద్వానీ తీరా ఆర్.ఎస్.ఎస్ ఆదేశాలతో…

రాజ్ నాధ్ సింగ్ బహుళ దిశల సవారి -కార్టూన్

బి.జె.పి అధ్యక్షుడి కర్తవ్య నిర్వహణ ఇప్పుడు కత్తి మీది సాము అయింది. కాదు, కాదు… కత్తి మీద సవారీ అయింది. ఆయన అటు ఎన్.డి.ఏ పక్షాలను దారికి తెచ్చుకోవాలి. ఇటు బి.జె.పి లోని నాయకులను ఒక దారిలో నడిచేట్లు చేయగలగాలి. అద్వానీ తిరుగుబాటుతో బి.జె.పి లోని చీలికలు స్పష్టంగా లోకానికి తెలిసి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊహాగానాలతో సాగుతూ, బి.జె.పి నాయకుల తిరస్కరణలతో కప్పి ఉంచబడిన బి.జె.పి లుకలుకలకు అద్వానీ తిరుగుబాటు అచ్చమైన జీవం పోసింది. ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో…

అద్వానీ కష్టే మోడి ఫలి! -కార్టూన్

‘కష్టే ఫలి’ అంటారు అద్వానీ లాంటి పెద్దలు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని కూడా చెబుతారు. భాజపా సీనియర్ నాయకుడు, భీష్మ పితామహుడుగా కొనియాడబడే లాల్ కృష్ణ అద్వానీ ‘ప్రధాని పదవి’ అనే ఫలితం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశారు. దానికోసం తీవ్రంగా శ్రమించారు. శిలాన్యాస్ కోసం ప్రతి ఊరి నుండి ఇటుక తెచ్చినట్లుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. రధ యాత్రలు చేశారు, మత కల్లోలలాను సృష్టించారు. 2 నుంది 80…

అస్త్ర సన్యాసియే అలిగిన నాడు… -కార్టూన్

తనచేత అస్త్ర సన్యాసం ఎలా చేయించాలో నేరుగా పాండవుల చెంతనే గుట్టు విప్పిన కురు పితామమహుడు భీష్ముడు. ఆ విధంగా ఆయన తన పాండవ పక్షపాతాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా చాటుకున్నాడు. అయితే అది వ్యక్తిగతమే. ఆయన యుద్ధం చేసినంతవరకు కౌరవుల తరపున చేలెరేగి పోరాడాడు. ఆయన యుద్ధ కౌశల విశ్వరూపానికి తట్టుకోలేకనే పాండవులు ఆయన్ని ఎలా కూల్చివేయాలో భీష్ముడినే సలహా కోరినట్లు మహా భారతం చెబుతోంది. కౌరవులకు భీష్ముడు ఎలాగో, బి.జె.పికి అద్వానీకి అలాంటివారు. ఆర్.ఎస్.ఎస్…

బి.జె.పి పదవులకు అద్వానీ రాజీనామా, ముదిరిన సంక్షోభం

ఈనాడు పత్రిక అంచనా తల్లకిందులయింది. ఆ పత్రిక విలేఖరి ఊహించినట్లు అద్వానీ కోసం ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. తన అభ్యంతరాలను పక్కకు నెట్టి, మోడీకి ఎన్నికల ప్రచార సారధ్య బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్ర చర్యకు దిగారు. పార్టీలోని అన్నీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. తన లేఖనే రాజీనామా పత్రంగా భావించాలని ఆయన కోరారు. అద్వానీ…

ప్లాన్-బి కోసం అద్వానీని పక్కన పెట్టారా? -కత్తిరింపు

ఈ రోజు (సోమవారం, 10.06.2013) ఈనాడు దినపత్రిక ఆరో పేజీలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రచురించారు. “ఏమో గుర్రం ఎగరా వచ్చు” శీర్షికన వచ్చిన ఈ విశ్లేషణ ప్రకారం అద్వానిని పక్కన పెట్టడం కూడా బి.జె.పి పధకరచనలో ఒక భాగమే. ప్లాన్-ఎ లో మోడి సారధ్యం వహించి పార్టీకి అత్యధిక సీట్లు రాబట్టాలి. ప్లాన్-ఎ విఫలం అయితే ప్లాన్-బి అమలులోకి వస్తుంది. ప్లాన్-బి ప్రకారం మోడి తగినన్ని సీట్లు కూడగట్టలేకపోతే గనక, మోడరేటర్ ముసుగు ధరించిన అద్వానీ…

అందినట్టే అంది ఎగిరిపోయిందా!… -కార్టూన్

పాపం అద్వానీ! ఎన్ని ఎత్తులు, ఎన్ని పై ఎత్తులు! ఎన్ని ఎదురు చూపులు, ఆ ప్రధాని కుర్చీకోసం? తనను మించిన సీనియర్ పార్టీలో లేకపోయినా, జనంలో బహుశా తనకు మించిన ఆమోదనీయత కూడా పార్టీలో ఎవరికీ లేకపోయినా ఆ ప్రధాని కుర్చీ మాత్రం అద్వానీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు గాను ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలను నరేంద్ర మోడీకి అపజెప్పడం ద్వారా బి.జె.పి జాతీయ కార్యవర్గం తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పినట్లేనని…

ఆర్టీఐ చట్టం? ఏం జోకా? -కార్టూన్

“ఏయ్! ఆర్టీఐ చట్టమా? ఏం జోకా – మీరు తెలుసుకోవాలని మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ సమాచారం అంతా ఇస్తూనే ఉన్నాం కదా…” ప్రజల్ని రాజకీయ పార్టీలు ఎలా పరిగణిస్తాయో ఈ కార్టూన్ చక్కగా చెబుతోంది. వారి దృష్టిలో ప్రజలు ఏమీ తెలియని దద్దమ్మలు. గొర్రెల కాపరి కాపలా కర్రని అనుసరించే గొర్రెల మంద. ఎక్కువ తెలుసుకుంటే గొంతెమ్మ కోర్కెలు కోరే వాజమ్మలు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియని నిరక్షర కుక్షులు. తమ ఓటు శక్తి…

బి.జె.పి కార్యవర్గం: కృత్రిమ ఎత్తులో మోడి? -కార్టూన్

రాజకీయ పార్టీల్లో నాయకులకు పదవి, హోదా, గౌరవం ఎలా రావాలి? మొదట వారికి ప్రజాదరణ ఉండాలి. అనంతరం ప్రజాదరణ ఉన్న నాయకుల ఆమోదం ఉండాలి. ఈ రెండు పక్షాలు కాస్త అటూ ఇటూ అయినా నష్టం లేదు. కనీసం ఒక పక్షం ఆదరణ పొందినా రెండో పక్షం ఆదరణ ఎదోలా పొందారనిపించుకోవచ్చు. కానీ రెండూ లేకపోతే కష్టమే. బి.జె.పి నాయకుడు నరేంద్ర మోడీకి ఈ రెండూ ఉన్నాయా? లేక రెండూ లేవా? లేక ఒకటి ఉండి మరొకటి…

సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది. నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం…

ధర్మపురి జంటను విడదీశారు

తమిళనాడులో కులాంతర వివాహాలపై విషం కక్కుతున్న స్వార్ధ శక్తులు ఒక ఆదర్శ వివాహ జంటను విడదీయడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితులపై విష ప్రచారానికి వెనుకాడని పట్టళి ముక్కల్ కచ్చి (పి.ఎం.కె) పార్టీ నాయకులు ఆ పాపం మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. వన్నియార్ కుల ప్రజలను దళితులపై విద్వేషపూరితంగా రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించడానికి అలవాటు పడిన పి.ఎం.కె నాయకుడు రాందాస్ అనేక సంవత్సరాలుగా కులాంతర వివాహాలను పచ్చిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరీ…

ఆహార భద్రతా బిల్లు: ఖోలో సెసేమ్! -కార్టూన్

ఎన్నికలలోపు ‘ఆహార భద్రతా బిల్లు’ (Food Security Bill) ను చట్టం రూపంలో తేవాలని యు.పి.ఏ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. బి.జె.పి సహాయ నిరాకరణ వలన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు. మైనారిటీలో ఉన్న యు.పి.ఏ-2 ప్రభుత్వం బి.జె.పి సహకారం లేకుండా చట్టం తేవడం అసంభవం. ఈ నేపధ్యంలో కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కి ఎందుకింత తొందర? ఆహార భద్రతా…

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇలా వస్తాయా? -కార్టూన్

“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!” సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని,…

అద్వానీ కల తీరిది! -కార్టూన్

అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు ఆయన పార్టీ చేత ‘ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అని పరోక్షంగా చెప్పిస్తున్నారు. మోడిని తీవ్ర స్ధాయిలో ప్రమోట్ చేయించడం ద్వారా ఆయనని విశ్రాంతి తీసుకొమ్మని ‘హింట్’ ఇప్పిస్తున్నారు. కానీ అద్వానీ శ్రీ మహా…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…