అమెరికా ఎన్.ఎం.డిని ఛేదించగల చైనా హైపర్ సోనిక్

అమెరికా అభివృద్ధి చేసుకున్న మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడును చైనా తాజాగా పరీక్షించింది. శబ్ద వేగానికి 10 రెట్ల వేగంతో ప్రయాణించగల హైపర్ సోనిక్ మిసైల్ అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధకు విరుగుడు కావడం దాని వేగం వల్లనే. దూసుకు వచ్చే మిసైళ్లను మధ్యలోనే కనిపెట్టి దానిని గాలిలోనే మరో మిసైల్ తో ఎదుర్కొని మట్టి కరిపించే వ్యవస్ధను అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇందులో దాడికి వచ్చే మిసైల్ వేగాన్ని కనిపెట్టి, నిర్దిష్ట సమయంలో ఏ పాయింట్…

ఇండియా-రష్యా సంబంధాలకు పరీక్షకాలం -ది హిందు ఎడిట్

(రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా వచ్చి వెళ్లారు. 20 ఒప్పందాలను ఆయన కుదుర్చుకుని మరీ వెళ్లారు. ఈ ఒప్పందాలను అమెరికా విమర్శించింది. ఈ అంశం గురించి ఈ రోజు ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ‘Testing times for India-Russia ties’ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ********* బిలియన్ల డాలర్ల విలువ కలిగిన 20 ఒప్పందాలపై ఒక్క రోజులో సంతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత సందర్శన ఒక ఉత్పాదక సందర్శన…

బ్రాహ్మణుల ఎంగిలాకులపై దొర్లే మాదే స్నానపై సుప్రీం స్టే

మాదే స్నాన! 500 యేళ్ళ నుండి కొనసాగుతున్న ఆచారం అని చెపుతూ అటు అగ్ర కులస్ధులు, ఇటు నిమ్న కులస్ధులు ఆచరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ఆచారం. వినడానికి, చదవడానికి జుగుప్స కలిగించే ఈ ఆచారాన్ని రద్దు చేయాలని బి.సి. సంఘాలు అనేక యేళ్లుగా పోరాడుతున్నా, ప్రభుత్వాల-కోర్టుల పరోక్ష మద్దతుతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తన చెంతకు వచ్చిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ‘ఆచారాన్ని కొనసాగించవచ్చన్న’ హై కోర్టు ఆదేశాలపై స్టే…

ఇండియాలో పుటిన్: చమురు, అణు ఒప్పందాలతో సందడి

రష్యా అధ్యక్షుడు పుటిన్ ఒక రోజు ఇండియా సందర్శన రష్యాకు ఫలప్రదంగా ముగిసింది. డజను అణు రియాక్టర్ల నిర్మాణం, చమురు సరఫరా ఒప్పందం, మిలట్రీ సరఫరా ఒప్పందాలతో పుటిన్ కడుపు నింపుకుని సంతృప్తిగా వెళ్లారు. అమెరికా తన షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తిని తీవ్రం చేయడం ద్వారా అంతర్జాతీయ రేట్లను కిందికి నెట్టడంతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కష్టాల్లో పడిన సందర్భంలో ఇండియాతో చేసుకున్న ఒప్పందాలు రష్యాకు మేలు చేస్తాయి. ఇండియాకు మాత్రం అనుత్పాదక వ్యయాన్ని పెంచుకోవడం…

వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు

ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్! పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్…

ఇండియాకున్నది ఒకే పుస్తకం -ది హిందు ఎడిటోరియల్

(కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులే కాదు, మోడి కొలువులోని సీనియర్ మంత్రులు సైతం హిందూత్వ భావజాలాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భగవద్గీత పుస్తకాన్ని ‘జాతీయ గ్రంధం’ గా ప్రకటించాలని సుష్మ వ్యక్తం చేసిన కోరిక ఏదో యధాలాపంగా చేసినది కాదు. నిర్దిష్ట లక్ష్యం తోనే ఆమె ఆ మాటలు చెప్పారు. ఈ అంశంపై ది హిందు, డిసెంబర్ 10, 2014 తేదీన వెలువరించిన సంపాదకీయం.…

కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి…

నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు. భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు…

భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు. రారాజులు,…

మహారాష్ట్ర: పులికి గంట కట్టిన బి.జె.పి -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు నాటకంలో చివరి అంకం పూర్తయింది. ఎన్నికలకు ముందు బి.జె.పి తో పొత్తును తెగతెంపులు చేసుకున్నది లగాయితు శివ సేన నేతలు, బి.జె.పి పై నిప్పులు చెరగని రోజంటూ లేదు. ఉత్తుత్తి పులి గాండ్రింపులు చేసి చేసి అలసిపోయిన శివసేన చివరికి పిల్లికంటే దిగజారి తమ ముందు ‘ఎలుక’గా అభివర్ణించిన బి.జె.పి చేతనే మెడలో గంట కట్టించుకుంది. మహారాష్ట్రలో ఎవరిది ఆధిపత్య హస్తం అన్నది నిర్ధారించుకోవడంలో పరస్పరం విభేదించుకున్న బి.జె.పి, శివసేనలు తమ విభేదం…

లాస్ ఏంజిలిస్: మహాగ్నికీలల్లో నివాస భవనాలు -ఫోటోలు

లాస్ ఏంజిలిస్ నగరంలో నిర్మాణంలో ఉన్న నివాస భవనాలు రెండు అగ్ని కీలలకు ఆహుతి అవుతున్నాయి. భవనాలను నిలువునా దహించివేస్తూ ఆకాశాన్ని తాకుతున్న మంటల టవర్ కు సంబంధించిన ఫోటోలను పలువురు పౌరులు సోషల్ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల రెండు ఫ్రీ వే లను మూసేసినట్లు పత్రికలు తెలిపాయి. 250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో ఇంతవరకు అంతుబట్టలేదని…

సిరియా టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ సాయం -ఐరాస

ఇప్పుడిక అనుమానం అనవసరం. ఇజ్రాయెల్ నిజ స్వరూపం ఏమిటో స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. న్యాయమైన పాలస్తీనా ప్రజల పోరాటాలను టెర్రరిజంగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నించే యూదు రాజ్యం తాను స్వయంగా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, వైద్య సహాయం అందజేస్తోందని ఐరాస నివేదికలు స్పష్టం చేశాయి. 1967 నాటి ఐరాస తీర్మానం అనుసారం సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగం గోలన్ హైట్స్ లో నెలకొల్పిన ఐరాస కార్యాలయం UNDOF సంస్ధ ఐరాస…

సృజనాత్మకతపై నిర్హేతుక కట్టుబాట్లు -ది హిందు ఎడిట్

(హిందూత్వ సంస్ధల రాజకీయ పలుకుబడి పెరిగిన ఫలితంగా వారి సంకుచిత సాంస్కృతిక భావజాలం సమాచార, ప్రసార శాఖలోకి చొరబడి సమాజ ఆలోచనా రీతిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని సూచించే ఈ సంపాదకీయం ఈ రోజు, డిసెంబర్ 8, ది హిందు పత్రికలో ప్రచురించబడింది. -విశేఖర్) ********* “అశ్లీల’ అంశాలను, ‘మహిళలను కించపరిచే” కార్యక్రమాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ‘కామెడీ సెంట్రల్’ టెలివిజన్ ఛానెల్ ప్రసారాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ…

నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…

బి.జె.పి పాత్రధారుల పరిణామక్రమం

బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి. ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు…