చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?

భారత దేశంలో అతి పొడవైన మార్గంలో బులెట్ ట్రైన్ రైలు, ట్రాక్ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ జపాన్ ఇస్తున్న పోటీ వల్ల చైనా ఇవ్వజూపుతున్న సహాయం వెనక్కి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ చొరబడడంతో మెక్సికోలో బిడ్డింగ్ పూర్తయిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు సైతం చైనా చేజారడంతో ఇండియాలోనూ అదే జరగవచ్చని చైనా అనుమానిస్తోంది. ఇండియా మాత్రం అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకుని చైనా అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇండియాకు చెందిన ‘హై స్పీడ్ రైల్…

వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

ప్రభుత్వమే ఖర్చు పెంచాలి -ఆర్ధిక సలహాదారు

మోడి ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు పెట్టుబడులు ఎంతకీ ముందుకు రావడం లేదు. ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదం కాస్తా హుళక్కి అయిపోయింది. బి.జె.పి/మోడి రాక వల్లనే మొదటి త్రైమాసికంలో జి.డి.పి 5.7 శాతం వృద్ధి చెందిందని తమ జబ్బలు తామే చరుచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మెల్లిగా ‘అబ్బే, ప్రభుత్వమే ఖర్చు పెంచక తప్పదు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ అంటూ ప్రభుత్వ ఖర్చును తగ్గించి తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలని ప్రబోధించిన…

అస్సాం మారణకాండ -ది హిందు ఎడిటోరియల్

(ది హిందు, 25.12.2014 నాటి Carnage in Assam ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు…

అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర…

2014 నేషనల్ జాగ్రఫిక్ ఫోటో పోటీ విజేతలు -ఫోటోలు

నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ 2014 సంవత్సరానికి గాను ఫోటో పోటీ విజేతలను ప్రకటించింది. ఎప్పటిలాగానే జనం (People), ప్రకృతి (Nature), స్ధలం (Places) అనే మూడు విభాగాల్లో పోటీ నిర్వహించబడింది. అత్యున్నతమైన గ్రాండ్ బహుమతిని పీపుల్ విభాగం విజేతకు దక్కింది. హాంగ్ కాంగ్ లో చీకటి ఆలుకుని ఉన్న ఒక రైలు పెట్టెను ఒక యువతి చేతిలోని మొబైల్ ఫోన్ ప్రకాశింపజేస్తున్న దృశ్యాన్ని బ్రియాన్ యెన్ చిత్రీకరించగా అది గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంది. మొబైల్ ఫోన్…

గాడ్సేకు బదులు మూడు కోతుల విగ్రహం బెటర్! -కార్టూన్

“దానికి బదులు మనం మూడు కోతులకు విగ్రహం కట్టాలి” ********* బి.జె.పి పాలన ప్రారంభం అయింది లగాయితు గాంధీ హంతకుడు నాధూరామ్ గాడ్సే ను ప్రశంసించేవారు ఎక్కువయ్యారు. సాక్ష్యాత్తు బి.జె.పి ఎం.పి లే బహిరంగంగా గాడ్సేను పొగిడి తమ భావజాలం నిజ స్వరూపం ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా గాడ్సేకు దేశ రాజధానిలోనే విగ్రహం కట్టాలని అఖిల భారత హిందూ మహా సభ డిమాండ్ చేస్తోంది. మహాత్మా గాంధీ నిజంగా మహాత్ముడా కాదా అన్నది తర్వాత సంగతి.…

హెచ్చరిక సంకేతాలు -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 22 తేదీ ప్రచురించిన ఎడిటోరియల్ Cautionary signals కు ఇది యధాతధ అనువాదం.) ********* 2014-15 కు సంబంధించిన మధ్య సంవత్సర ఆర్ధిక సమీక్ష, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 5.5 శాతం ఉంటుందని వాస్తవికంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్ధి యొక్క ఉరవడి ఇంకా బలహీనంగానే ఉన్నదనీ, ఆర్ధిక వ్యవస్ధ స్ధిరగతిని ఇంకా అందుకోవలసే ఉన్నదనీ… పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంలపై గత వారం విడుదల అయిన ఆర్ధిక గణాంకాలు స్పష్టంగా…

సమాన దూరం అయింది, ఇజ్రాయెల్ కౌగిలి మిగిలింది

గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన…

నేపాల్: ప్రకృతి, జీవితం -ఫోటోలు

హిమాలయ రాజ్యమైన నేపాల్ సహజంగానే ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇటీవలి వరకు ఫ్యూడల్ రాచరికంలో మగ్గిన ఫలితంగా అక్కడ దరిద్రానికి కొదవ లేదు. ఒక పక్క రాచరికం మిగిల్చిన సంపన్న భవనాలు, మరో పక్క ఆ మూడు రోజుల కోసం స్త్రీలను బందిఖానా చేసే చౌపడి గుడిసెలు! ప్రకృతి ఒడిలో నిండా మునిగినట్లుండే నేపాల్ జనజీవనానికి ప్రతిబింబాలు ఈ కింది ఫోటోలు. నేపాల్ ని ‘ప్రపంచపు పైకప్పు’ (roof of the world) అని కూడా పిలుస్తారట!…

ప్రపంచ అసమానతల్లో పెరుగుదల -ది హిందు ఎడిట్

నిజ వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐ.ఎల్.ఓ) తాజాగా వెలువరించిన నివేదిక కనుగొన్న అంశాలు వివిధ సందర్భాలలోని క్రియాశీల చొరవలను, విధానపరమైన పక్షవాతాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచ నిజ వేతనాలు పడిపోతుండడం కొనసాగుతుండడం వల్లా, జాతి మరియు లింగ ఆధారిత వివక్షాపూరిత వేతన తేడాల వల్లా కుటుంబాల ఆదాయాలలో అసమానతలు తీవ్రం అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న అంశం, అభివృద్ధి చెందిన దేశాలలో 1999-2013 సంవత్సరాల మధ్య కాలంలో కార్మిక ఉత్పాదకత పెరుగుదల వారి…

చిన్న శవపేటికలను పూడ్చడమూ కష్టమే!

“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు. “చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా…

ఉగ్రవాదానికి పాక్ విరుగుడు మరణ శిక్షలు! -కార్టూన్

పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…” ********* పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు! ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి…

బొగ్గు, భీమా ప్రైవేటీకరణ: ఆర్డినెన్స్ ఆలోచనలో కేంద్రం?

వచ్చే మంగళవారంతో శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ముగింపుకు రానున్నాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశం అయ్యేది బడ్జెట్ కే. భీమా ప్రయివేటీకరణ, బొగ్గు గనుల ప్రయివేటీకరణ బిల్లులను శీతాకాలం సమావేశాల్లోనే మోడి ఆమోదింపజేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. కానీ సమావేశాలు ముగింపుకు వస్తున్నా బిల్లుల అతీగతీ లేదని కంపెనీలు బెంగ పెట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం నుండి కంపెనీల ఆశలను ఈడేర్చే శుభవార్త అందింది. పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా…

అతి చిన్న శవ పేటికలు అత్యంత బరువైనవి -ఫోటోలు

“SMALLEST COFFINS ARE THE HEAVIEST” పెషావర్ పాఠశాలపై తాలిబాన్ జరిపిన పైశాచిక మృత్యు క్రీడకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో ఒక యువతి పట్టుకున్న ప్లకార్డ్ పై రాసి ఉన్న ప్రకటన ఇది. “అతి చిన్న శవపేటికలు, అత్యంత బరువైనవి” ఈ ఐదు పదాల ప్రకటనకు ఎంత లోతైన అర్ధం! మానవ మాత్రుల సామాన్య దృష్టికి అందని లోతు అది. బహుశా మానవుడి సాధారణ భావోద్వేగానికి కూడా అందని లోతు కావచ్చు. ప్లకార్డు పట్టుకున్న ఆ యువతికి…