ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…
