లలిత్ గేట్: మోడి అవినీతి పాలనకు సాక్ష్యం -1

నరేంద్ర మోడి నీతిమంతమైన పాలనలో మొదటి ‘గేట్’ తెరుచుకుంది. ‘నా యేడాది పాలనలో ఒక్క కుంభకోణం అయినా జరిగిందా? నాయకుల పిల్లలు, అల్లుళ్ళకు అయాచిత లబ్ది ఒనగూరిందా? గత యేడాదిలో ప్రజలకు మంచి రోజులు వస్తే దేశాన్ని దోచుకునేవారికి చెడ్డ రోజులు వచ్చాయి” అని తమ ప్రభుత్వ వార్షిక దినాన మోడి ప్రకటించిన కొద్ది రోజులకే ‘లలిత్ గేట్’ బట్టబయలయింది. నరేంద్ర మోడి ఎడతెగకుండా చేస్తున్న ‘నీతిమంతమైన పాలన’ చప్పుళ్లను అపహాస్యం చేస్తూ లలిత్ మోడి పాస్…

క్రికెట్: బడా బాబుల కేకు పంపకం -కార్టూన్

  ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది. ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే. కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం…

ఇంతకీ మోడి యోగా చేస్తారా? -పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రావలసిన సందేహమే వచ్చింది. ఎవరి ప్రయత్నము, ప్రోత్సాహము లేకుండానే సానుకూల గుణాల వల్ల ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన యోగాను సైతం రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో పడిపోయిన బి.జె.పి, నరేంద్ర మోడీలు బహుశా ఈ ప్రశ్నను ముందే ఊహించి ఉండవచ్చు. అయితే పుతిన్ నుండి ఈ ప్రశ్న వస్తుందని మాత్రం ఊహించి ఉండరు. అంతర్జాతీయ విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఐ.ఏ.ఎన్.ఎస్ (ఇండియా అబ్రాడ్ న్యూస్ సర్వీస్) వార్తా సంస్ధ విలేఖరి…

యోగా: ఇందుగల దందులేదని… -ఫోటోలు

“ఇందుగలదందులేదని సందేహంబు వలదు యోగా సర్వోపగతుందెందెందు వెదకి చూచిన అందెందే గలదు” అని చదువుకోవచ్చని ఖాయంగా అనిపిస్తుంది కింది ఫోటోలు చూస్తే! ‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు గానీ, నిజానికి యోగా ఎన్నడో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉంది. 1982 లోనే అమెరికా పౌరులు యోగా, ధ్యానం లను అభ్యసించడమే కాకుండా కొందరు దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారని కూడా ఈ బ్లాగర్ కి తెలుసు. ఎలాగంటే ఆ సంవత్సరంలో ప్రఖ్యాత…

ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్…

నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్

ఏప్రిల్ 25, 2015 తేదీన నేపాల్ ప్రజల్ని కొద్ది సెకన్ల కాలంలోనే భారీ వినాశనంలోకి నెట్టివేసిన భూకంపం అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ప్రభావితం చేయకుండా వదల్లేదు. భూకంప లేఖిని (రిక్టర్ స్కేల్) పై 7.9 పరిమాణాన్ని నమోదు చేసిన నేపాల్ భూకంపం వల్ల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశగా, అనగా ఇండియా వైపుకి 3 సెంటీ మీటర్ల మేరకు కదిలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు. నేపాల్ భూకంపం వల్ల…

ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం -ది హిందు ఎడిట్..

ఇరాక్ లోని ప్రధాన నగరం మోసుల్ ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాత, పశ్చిమ ఆసియాలో ఒక బలీయమైన శక్తిగా ఇస్లామిక్ స్టేట్ కొనసాగుతూనే ఉంది. అమెరికా నేతృత్వంలో సాగుతున్న బాంబింగ్ దాని ఊపును అడ్డుకుంటున్న జాడ లేదు. కుర్దిష్ మరియు షియా మిలీషియాల చేతుల్లో ఎదురైన కొన్ని ఓటములు తప్పితే, గత సంవత్సర కాలంలో ఐ.ఎస్ తన ప్రభావ ప్రాంతాన్ని సిరాక్ (Syraq = Syria + Iraq) లోని తన (ప్రధాన) స్ధావరం కంటే…

విచిత్ర అసాధారణ గృహాలు -ఫోటోలు

వెనకటికో పెద్దాయన పని లేక పిల్లి తల గొరగడం మొదలు పెట్టాట్ట. పని లేని పెద్దలు తల పైన జుట్టుని, మొఖం మీద వెంట్రుకల్ని విచిత్రమైన షేపులతో కత్తిరించే ఫ్యాషన్ ని కనిపెట్టారేమో ఎవరన్నా పరిశోధించి కనిపెట్టాలి. పనే లేదో, తెలివి ప్రదర్శనకు మరో మార్గమే దొరక లేదో తెలియదు గానీ కొందరు తాము నివసించే ఇళ్లను సైతం వినూత్నంగా నిర్మించి ప్రదర్శిస్తున్నారు. వారూ వీరని కాకుండా ఈ బాపతు మేధావులు లేదా కళా కారులు ప్రపంచం…

ఢిల్లీలో కేజ్రీ-జంగాసన -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినం (International Day of Yoga) గా జరపనున్నారు. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస యోగా దినం ప్రకటించింది. సొంత ప్రచారానికి, జబ్బలు చరుచుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలని బి.జె.పి, నరేంద్ర మోడిలు ఐ.డి.వై ప్రకటనను కూడా తమ విజయంగా చాటుతున్నారు. ఐ.డి.వై నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి కార్యక్రమాలు రూపొందించారు. జూన్ 21…

యోగాపై అమితాసక్తి -ది హిందు ఎడిటోరియల్

శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదం చేసే ప్రయోజక శాస్త్రంగా ప్రపంచవ్యాపితంగా యోగా అంతకంతకూ అధిక గుర్తింపు పొందుతున్న సమయంలోనే, ఈ భారతీయ ప్రాచీన పద్ధతి, ప్రధానంగా నరేంద్ర మోడి ప్రభుత్వం యొక్క దూకుడుమారి ప్రోత్సాహం కారణంగా, అనవసర వివాదంలో చిక్కుకోవడం విచారకరం. (యోగా అమలుపై) ప్రభుత్వం అతిశయాత్మక ఆసక్తి చూపుతోందనీ తన ఉద్యోగులు మరియు సంస్ధలను తన సొంత దృక్పధంతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు వినియోగించే ధోరణిలో ఉన్నదన్న భావనలు కలగకుండా ఉండడం చాలా…

నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి. శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి…

ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…

రెండు రాష్ట్రాలు, ఒక సవాలు -ది హిందు ఎడిట్

[Two states, one challenge శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ********************* తాము ఏర్పడిన ఏడాది తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు శక్తి, నీరు ఇతర ఆస్తులు లాంటి వనరుల పంపకం సమస్యలతో సతమతం అవడం కొనసాగుతూనే ఉంది. అవిభాజ్య రాష్ట్ర ఆదాయంలో 22 శాతం వాటా కలిగి ఉన్న హైద్రాబాద్ నుండి రెవిన్యూ ప్రవాహం లేకపోవడంతో, గత యు.పి.ఏ ప్రభుత్వం…

సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!

శాస్త్ర బద్ధ అంశాలకు మతాన్ని జోడిస్తే వచ్చే దుష్ఫలితం ఇది! మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా దోహదం చేసే ‘యోగా’, ‘సూర్య నమాస్కారాలు’ ఇస్లాం కి వ్యతిరేకం కాబట్టి వాటిని పాఠశాలల్లో బోధించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేస్తోంది. తద్వారా బ్రూనోను తగలబెట్టిన క్రైస్తవాన్ని, వేదాలు వినకుండా పంచముల చెవుల్లో సీసం పోసిన మనువాదాన్ని ముస్లిం బోర్డు స్ఫురణకు తెస్తోంది. రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని బి.జె.పి ప్రభుత్వాలు ఇటీవల తమ పాఠశాలల్లో…

పరీక్షలకు 19 కోట్లు, ప్రకటనలకు 445 కోట్లు

క్వాలిటీకి తాము అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని నెస్లే గ్లోబల్ సి.ఇ.ఓ చెప్పిన మాట! కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని కంపెనీ వార్షిక నివేదికలు (బ్యాలన్స్ షీట్) వెల్లడిస్తున్నాయి. నెస్లే ఇండియా కంపెనీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన మొత్తంలో 5 శాతం కంటే తక్కువే క్వాలిటీ పరీక్షల కోసం ఖర్చు పెడుతోంది. 2014 సంవత్సరంలో నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రకటనల కోసం 445 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ…