జైట్లీకి కీర్తి ఆజాద్ 52 ప్రశ్నలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైట్లీ అవినీతిపై 5 ప్రశ్నలతో సరిపెడితే బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఏకంగా 52 ప్రశ్నలను సంధించారు. సోమవారం మాజీ టెస్ట్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కీర్తి ఆజాద్, ఒక వ్యక్తిపై ఎక్కుపెట్టిన దాడి కాదని చెబుతూనే జైట్లీకి 52 ప్రశ్నాస్త్రాలను సంధించాడు. ప్రశ్నలను సంధించడంతోనే కీర్తి ఆజాద్ సరిపెట్టుకోలేదు. Wikileaks4India అనే వెబ్ సైట్, సన్ స్టార్ అనే పత్రికా విడుదల…

రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…

పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు

[డిసెంబర్ 21, 2015 తేదీన ది హిందు “Justice that is rehabilitative” శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ******* పరిపక్వ సమాజం జనం పెడబొబ్బలకు లొంగి తన న్యాయ వ్యవస్ధకు ఆధారభూతమైన పటుతర న్యాయ సూత్రాలను, సామాజిక నియమాలను తలకిందులు చేయదు. ప్రత్యేక శిక్షణా గృహంలో 3 సంవత్సరాల పాటు గడపాలని విధించిన శిక్ష ముగిశాక డిసెంబర్ 2012 నాటి ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని బాల నేరస్ధుడిని విడుదల చేసిన విషయంలో పెల్లుబుకిన…

దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ

నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుగురిలో ఒకరైన బాల నేరస్ధుడిని విడుదల చేసినందుకు ప్రస్తుతం దేశ్యవ్యాపితంగా అనేకమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిలో నిర్భయ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది బాల నేరస్ధుడే అన్న అభిప్రాయం మొదటి నుండీ వ్యాపించి ఉండడంతో అతన్ని వదిలిపెట్టడం పట్ల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు బాల నేరస్ధుడు విడుదల కానున్నాడన్న నిజాన్ని తట్టుకోలేక నిద్ర లేని రాత్రులు గడుపుతూ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని…

మెనూ స్మృతి -కత్తిరింపు

అక్టోబర్ 29 తేదీన ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం ఇది. భారత దేశ పేద ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూత్వ ప్రారంభించి సాగిస్తున్న సాంస్కృతిక దాడిని సమర్ధవంతంగా ససాక్షారంగా తిప్పి కొట్టిన ఈ వ్యాసం మల్లంపల్లి సాంబశివరావుగారి విరచితం. ఇలాంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రచురించడం ఆంధ్ర జ్యోతి పత్రికకు మాత్రమే సాధ్యం అనుకుంటాను. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరప తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను కోర్టులే నిషేధించడం అప్రజాస్వామిక పరిణామం. బీఫ్ మాంసాన్ని…

అనిశ్చితిని ముగించిన ఫెడ్ రేటు పెంపు -ది హిందు

[మొన్న అనగా డిసెంబర్ 16, 2015 తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంకు -ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్- వడ్డీ రేటు 0.25 శాతం పెంచింది. ఇప్పుడు అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు 0.5 శాతం. డిసెంబర్ 2008లో ద్రవ్య సంక్షోభం చుట్టుముట్టడంతో కంపెనీలు తమ డబ్బు సంపదను ఎక్కడికక్కడ బిగదీసుకున్న నేపధ్యంలో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోయిన దరిమిలా కదలిక తేవడానికి ప్రభుత్వమే మార్కెట్ లో డబ్బు కుమ్మరించడం మొదలు పెట్టింది. అలా కుమ్మరించడానికి వీలుగా వడ్డీ రేటును…

చూడు చూడు నీడలు.. మూసాహార్ వాడలు -ఫోటోలు

వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది. ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక  వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ)…

జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…

ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ…

నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…

హాంగ్ కాంగ్ గొడుగు ఉద్యమం ఏడాది తర్వాత.. -ఫోటోలు

గత సంవత్సరం సెప్టెంబర్ లో హాంగ్ కాంగ్ లో విద్యార్ధులు, యువకులు ఒక ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమానికి ‘ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఉద్యమం’గా పశ్చిమ పత్రికలు చెప్పుకుని సంతోషిస్తుంటాయి. పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన అరబ్ వసంతం లిబియాను కుక్కలు చింపిన విస్తరి చేసినట్లే, ఈజిప్టును తిరిగి మిలట్రీ చీకటి కొట్టంలోకి విసిరి కొట్టినట్టే, సిరియాను అల్లకల్లోలం కావించి ముక్కలు ముక్కలుగా విడదీయడానికి ఉద్దేశించినట్లే… హాంగ్ కాంగ్ లో జరిగిన సొ కాల్డ్ ‘ప్రజాస్వామిక ఉద్యమం’…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…