ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా

[జీ న్యూస్ విలేఖరి విశ్వ దీపక్ చానెల్ కు రాజీనామా చేస్తూ చానెల్ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖనే ఆయన రాజీనామా లేఖగా వెలువరించారు. లేఖ ఆంగ్ల అనువాదాన్ని ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఇతర పత్రికలు కూడా ప్రచురించి ఉండవచ్చు. విశ్వ దీపక్ రాజీనామా లేఖ అనువాదమే ఈ టపా. ఈ అనువాదాన్ని బ్లాగ్ పాఠకుడు సందీప్ ఎస్‌పి గారు వ్యాఖ్య ద్వారా అందించారు. నవ తెలంగాణ పత్రికలో మొదట అచ్చయిన ఈ…

జాట్ ఉద్యమం: ది హిందు సంపాదకీయంపై విమర్శ

[ఈ టపాకు ముందరి ఆర్టికల్ లో ది హిందూ సంపాదకీయం అనువాదం ఇచ్చాను. సంపాదకీయం చేసిన విశ్లేషణపై విమర్శ కూడా ఇచ్చాను. విమర్శను పాఠకుల దృష్టికి తేవాలంటే ఆ భాగాన్ని ప్రత్యేకంగా ఇవ్వాలని భావిస్తూ మరో టపాగా పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) ********* పటిదార్ లు, జాట్ ల నుండి రిజర్వేషన్ డిమాండ్లు తలెట్టడానికి పై సంపాదకీయం చూపిన కారణం నిజానికి ఇరుకైనది. ఇది పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాతల నుండి తండ్రులకు, తండ్రుల…

వివేకరహిత (రిజర్వేషన్) డిమాండ్లు -ది హిందు ఎడిట్

(Unreasonable demands శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* గత యేడు గుజరాత్ పటిదార్లు గానీ, ఈ యేడు హర్యానా జాట్ లు గానీ… సాపేక్షికంగా సంపన్న కులాల నేతృత్వంలో రిజర్వేషన్ కోసం హింసాత్మక నిరసనల ద్వారా పదే పదే పునరావృతం అవుతున్న డిమాండ్లు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హర్యానాలో జాట్లు సాపేక్షికంగా భూములు కలిగి ఉన్న సంపన్నులు. ఈ ప్రాంతంలో సామాజిక నిచ్చెనపైన అందరికంటే ఎత్తున ఉన్నవారిగా పరిగణించబడుతున్నారు. రాష్ట్రంలో…

చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు

“The Emperor’s new nationalism” శీర్షికతో ఫిబ్రవరి 20 వ తేదీ ది హిందూ సంపాదకీయానికి యధాతధ అనువాదం. ********* హైదారాబాద్ నుండి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకూ, రోహిత్ వేముల మరణం నుండి కన్హైయా కుమార్ అరెస్టు వరకు పాలక భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రాజకీయ ఎజెండాను స్పష్టంగా గుర్తించవచ్చు. మొదటి ఊపులో ఇది అత్యున్నత నాయకత్వం అంతా -యూనియన్ కేబినెట్ మంత్రులతో సహా- విద్యార్ధి నాయకులతో తగువు పెట్టుకోవడానికీ సంఘ్ విద్యార్ధి…

ఫేస్ బుక్ నుండి బలవంతపు అదృశ్యం -కార్టూన్

కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది. ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు…

అఫ్జల్ గురు కార్టూన్ తొలగించిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ ఒక కంపెనీ. లాభార్జనే ఫేస్ బుక్ కంపెనీ ధ్యేయం. కానీ ఒక వ్యాపార కంపెనీయే రాజ్యం అవతారం ఎత్తితే?! అఫ్జల్ గురు కి వేసిన ఉరిశిక్ష సాక్షాలు బలంగా ఉండి నేరం రుజువు కావడం వల్ల కాదు. సాక్షాలు బలంగా లేకపోయినా న్యాయ స్ధానం సాక్షిగా ఉరితీయడం ద్వారా కాశ్మీర్ ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలని భారత రాజ్యం భావించినందుకు! భావాలకు సంకెళ్లు వేయగలరా ఎవరైనా? ‘రాముడు ఆ బాబ్రీ మసీదు కట్టిన చోటనే…

కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…

పాటియాలా హౌస్ కోర్ట్: సంఘటనల క్రమం

ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు కన్హైయా కుమార్ ని పోలీసులు హాజరు పరచవలసి ఉంది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగవలసి ఉండగా హిందూత్వ లాయర్ల వీరంగం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు కోర్టు సజావుగా నడవడానికి సుప్రీం కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు విలేఖరులు, ఇద్దరు కన్హైయా మద్దతుదారులు మాత్రమే హాజరు కావాలని చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం నుండి పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన…

ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!

నిన్నటి సుప్రీం కోర్టు గాండ్రింపులు పిల్లి కూతల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. హిందూత్వ లాయర్ల వీరంగం ముందు భారత పార్లమెంటు, భారత న్యాయ చట్టాలు, పోలీసు వ్యవస్ధ… చేష్టలుడిగి నిలబడిపోయాయి. కన్హైయా కుమార్ ను హాజరుపరచవలసిన పాటియాలా కోర్టు ఆవరణలోకి చొచ్చుకు వచ్చిన హిందూత్వ గూండాలు -వారిలో కొందరు లాయర్లూ ఉండవచ్చు- జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరుల మీద మంగళవారం దాడి…

అసలు సమస్యలను తప్పించిన JNU-అఫ్జల్ రగడ!

ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి? నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా? మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి. సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం…

పాక్ అనుకూల నినాదాలు చేసింది ఏ‌బి‌వి‌పి? -వీడియో

జవహర్ లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జే‌ఎన్‌యూ‌ఎస్‌యూ) అధ్యక్షుడు కనహైయా కుమార్ పై ‘దేశ ద్రోహం’ కేసు మోపి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడీ వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది. అఫ్జల్ గురును ఉరి తీసి 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 తేదీన జే‌ఎన్‌యూ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం అధ్యక్షులు, మరి కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర…

ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…

న్యాయం కావాలి -రాధిక వేముల

అర్ధంతరంగా చనిపోయిన తన కుమారుడి మరణం వృధా కాకూడదని రాధిక వేముల ఆక్రోశిస్తోంది. తన కుమారుడి మరణానికి సంబంధించి తనకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేవరకు తాను పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తమను ఓదార్చడానికి ఢిల్లీ నుండి రెండుసార్లు వచ్చారని కానీ ప్రధాన మంత్రి నుండి ఇంతవరకూ ఎలాంటి స్పందన ఎందుకు లేదని రోహిత్ తల్లి రాధిక వేముల ప్రశ్నించారు. తన కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ…

మోడి పాస్ పోర్ట్: యశోదాబెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన భార్యగా ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న శ్రీమతి యశోదా బెన్ కు తమ పెళ్లి నిజంగానే జరిగిందని రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది. శ్రీమతి యశోదా బెన్ ను తన భార్యగా ప్రధాన మంత్రి పేర్కొన్న సంగతి పత్రికల ద్వారా తెలియడమే. అంతే తప్ప వాస్తవంగా పెళ్ళి జరిగిందని రుజువు చేసే రికార్డులు శ్రీమతి యశోదా బెన్ వద్ద లేవని ఆమెకు ఎదురయిన తాజా పరిస్ధితి ద్వారా అర్ధం అవుతున్నది.…

ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ.  ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు. ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన…