మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు

బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.) మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ…

లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…

లడ్డు: భక్తుల మనోభావాలతో ప్రభుత్వమే ఆడుకుంది -సుప్రీం కోర్టు

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు…

సనాతన ధర్మం అంటే?

అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. క్రింద కవిత రూపంలో ఉన్న భాగం లేదా ప్రశ్న జవాబు రూపంలో ఉన్న భాగం వరకు మెసేజ్ గా వచ్చింది. సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక, కులాల కాలకూట విషంతో నిండిన, సమాజాన్ని పునరిద్ధరించాలని…

లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?

తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా…

ఆడవారికి రక్షణ లేని కర్మభూమి!

ఒక్క ఆగస్టు 17, 18 తేదీలలో మాత్రమే ఎన్.డి.టి.వి అనే ఒక వార్తా పత్రిక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరిగిన ఆరు అత్యాచారాల గురించి రిపోర్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలిస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బిజెపి పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ప్రభుత్వ వైఫల్యం గురించి బిజెపి నేతలు విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్…

కేంద్రం ఐ.టి రూల్స్ సవరణపై బొంబే హై కోర్టు మొనగాడి తీర్పు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షాల నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ఐ.టి రూల్స్ 2021 చట్టానికి 2023లో తలపెట్టిన సవరణలు రాజ్యాంగ విరుద్ధం అని బొంబే హై కోర్టు నియమించిన ‘టై బ్రేకర్’ జడ్జి జస్టిస్ అతుల్ చందూర్కర్ తీర్పు ఇచ్చారు. తాజా తీర్పుతో జనవరి 2024లో ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచిలోని ఇద్దరు జడ్జిలు ఇచ్చిన విభిన్నమైన చెరొక తీర్పు (split verdict) ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మారింది. ఐ.టి…

భారత్ ఆయుధాలు ఉక్రెయిన్ లో ప్రత్యక్షం, రష్యా అసంతృప్తి!

155mm Shells భారత దేశ ప్రభుత్వ ఆయుధ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలను ఉక్రెయిన్, రష్యాపై యుద్ధంలో ప్రయోగిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడి చేసింది. భారత ప్రభుత్వ కంపెనీల తయారీ ఆయుధాలు తమపై ప్రయోగించేందుకు ఇండియా అనుమతి ఇవ్వడం పట్ల రష్యా ఇప్పటికే రెండు సార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఇండియా నేరుగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం లేదు. వివిధ ట్యాంకులు, మర ఫిరంగులు ఉపయోగించే మందుగుండు సామాగ్రిని ఇండియా…

డాలర్ కి వేగంగా తూట్లు పొడుస్తున్న చైనా!

మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది. చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు…

ఆర్ జి కార్ డాక్టర్ల ఆందోళనకు పరిష్కారం ఎప్పుడు?

అటు సుప్రీం కోర్టు, ఇటు కోల్ కతా ప్రభుత్వం, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ & ఆసుపత్రి లో అత్యాచారం, హత్య కు గురైన బాధిత మెడికో కు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, దేశ వ్యాపితంగా ఆందోళన చేస్తున్న…

సాక్షాలు నాశనం చేశారు: కోల్కతా సీనియర్ డాక్టర్లు

ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెపెంబర్ 16 తేదీన, సోమవారం మరోసారి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు ఈ రోజు (16 సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా గం 6:30 ని.లకు ప్రారంభం అయినట్లు తెలుస్తున్నది. కాగా అత్యాచారం…

పుటిన్ హెచ్చరిక, బైడెన్ వెనకడుగు!

Joe Biden with Kier Starmer రష్యా లోలోపలి నగరాల పైన, వివిధ టార్గెట్ ల పైన పశ్చిమ దేశాలు సరఫరా చేసే లాంగ్-రేంజ్ మిసైళ్లతో దాడి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అనేక రోజులుగా అమెరికా, యుకె, ఇయు లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. బ్రిటన్ సరఫరా చేసే స్టార్మ్ షాడో మిసైళ్ళు, అమెరికా సరఫరా చేసే ఎం‌జి‌ఎం-140 ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ATACMS) మిసైళ్ళు లాంగ్ రేంజ్ మిసైళ్ళ…

కేజ్రీవాల్ కి బెయిల్

ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా…

స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…

అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…