కేంద్రం రెండో చెంపా వాయించిన సుప్రీం కోర్టు

ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని…

బ్రెగ్జిట్ వ్యతిరేకి చేతుల్లో బ్రెగ్జిట్!

యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ కింద శిక్షలేమికి ముగింపు -ద హిందూ ఎడిట్..

[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] “జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో  “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ…

ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం -యూ‌కే మాజీ ఉప ప్రధాని

ఇరాక్ యుద్ధానికి దారి తీసిన పరిస్ధితులను విచారించటానికి గత బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్, తన నివేదికను వెలువరించిన దరిమిలా బ్రిటన్ మాజీ నేతల ఒప్పుకోళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి. 2009లో అప్పటి ప్రధాని గార్డన్ బ్రౌన్, లార్డ్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్ కొద్ది రోజుల క్రితం విచారణ నివేదికను విడుదల చేసింది. ఆనాటి ప్రధాని టోని బ్లెయిర్ సరైన కారణాలు లేకుండా బ్రిటిష్ యువ సైనికుల ప్రాణాలను బలి పెడుతూ దేశాన్ని…

పౌల్ట్రీ తగాదా: ఇండియాపై ఆంక్షలు కోరుతున్న అమెరికా

‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అంటుంటారు పెద్దలు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయటంలో అమెరికాని మించిన వారు ఉండబోరు. “ఇండియా అంతకంతకూ అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా మారుతోంది” అని వివిధ వేదికల పైన చెబుతున్న అమెరికా కోడిగుడ్ల వాణిజ్యం విషయంలో ఇండియాపై పగబట్టి వ్యవహరిస్తోంది. అమెరికా నుండి వచ్చే కోడి గుడ్లు, కోడి మాంసం, పందుల దిగుమతులపై ఇండియా ఎప్పటి నుండో పలు ఆంక్షలు విధించింది. పౌల్ట్రీ దిగుమతుల ద్వారా అమెరికా నుండి బర్డ్ ఫ్లూ ప్రమాదం…

మోడి కేబినెట్ విస్తరణకు అర్ధమేమి? -కార్టూన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. ఇది యధావిధిగా మోడి మార్కు విస్తరణగానే ఉన్నదని పత్రికలు, ఛానెళ్లు వ్యాఖ్యానించగా, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని అభివృద్ధి లక్ష్యంగా కొన్ని సర్దుబాట్లు జరిగాయని బి‌జే‌పి ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానించారు. బి‌జే‌పి నేతలు ఏమి చెప్పినా, ఏ కారణము లేకుండా, ఏ ఫలితమూ ఆశించకుండా ప్రధాన మంత్రి తన కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారంటే నమ్మటానికి వీలు లేదు. “కేబినెట్…

గిరిజన విద్యకు గుజరాత్ వరస్ట్ రాష్ట్రం -బి‌జే‌పి నేత

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాక అసమ్మతి స్వరాలు మెల్లగా బయలు దేరుతున్నా యి. అయితే ఆ అసమ్మతి పదవి పేరుతో కాకుండా పార్టీ పనితనం పేరుతో వ్యక్తం కావటం విశేషం. ‘కాంగ్రెస్ కంటే మాది భిన్నమైన పార్టీ’ అని బి‌జే‌పి నేతలు చెబుతుంటారు. అసమ్మతిలో కూడా భిన్నం అన్నమాట! కేంద్ర మంత్రివర్గంలో మన్సుఖ్ వాసవ నిన్నటి వరకు గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. బి‌జే‌పి/మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన మే 2014 నుండి…

స్వాతిని నేను చంపలేదు -మలుపు?

స్వాతి హత్య కేసు విషయంలో పోలీసుల కథనం ఆరంభం లోనే సంధి కొట్టింది. వారం రోజుల వేట అనంతరం పట్టేశామని ప్రకటించిన నిందితుడు, తాను అసలు నిందితుడునే కాననీ, తనకు సంబంధం లేని కేసులో తనను పోలీసులు ఇరికించారనీ పోలీసులు అరెస్టు చేసిన రాం కుమార్ చెబుతున్నాడు. అయితే గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ వలసిన అగత్యం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు అతని వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. “నేనసలు ఆత్మహత్యకు పాల్పపడ లేదు” అని…

వెంటాడేదెవరో గమనించండి! -ది హిందు ఎడిట్..

యువ ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఎస్ స్వాతిని చెన్నై లోని నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో పట్ట పగలు క్రూరంగా నరికి చంపిన ఘటన నగరంలో ప్రజా భద్రతపై కఠినమైన వెలుగును ప్రసరింపజేసింది. అనుకున్నట్లుగానే ఈ హత్య అబధ్రతా భావాన్ని రేకెత్తించింది. ఆమెను చంపాడని భావిస్తున్న అనుమానితుదిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభావంతంగా కృషి చేసిన చెన్నై పోలీసులు, పాలనా యంత్రాంగం, పౌర సమాజంతో చర్చించి, ఉనికిలో ఉన్న తనిఖీలను సమీక్షించి మెరుగు పరచడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.…

దచైస: సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలి -చైనా పత్రిక లు

అవసరం ఐతే దక్షిణ చైనా సముద్రం విషయంలో సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ పిలుపు ఇచ్చింది. చైనా జాతీయ ప్రయోజనాలను నిక్కచ్చిగా ప్రతిబింబిస్తుందని, కఠినంగా వెల్లడిస్తుందని పేరున్న గ్లోబల్ టైమ్స్ తాజాగా ఇచ్చిన పిలుపుతో పశ్చిమ పత్రికలు, పరిశీలకులు అప్రమత్తం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో -బహుశా జులై 12 తేదీన- హేగ్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో ఫిలిప్పీన్స్ ఇచ్చిన…

క్రికెట్ లో కోహ్లీ, బాలీవుడ్ లో అమీర్ ఖాన్… భళా!

బాలీవుడ్ హీరోలు కూడా నేల మీద నిలబడవచ్చనీ/గలరనీ, ప్రజల సమస్యల పైన స్పందించవచ్చని/గలరనీ నిరూపించిన, నిరూపిస్తున్న హీరోల్లో ఒకరు అమీర్ ఖాన్! అమీర్ ఖాన్ కాకుండా జనానికి సంబంధించిన రోజువారీ సమస్యలపైన సానుకూలంగా, ప్రగతిశీలకరంగా స్పందించగల ఖరీదైన సెలబ్రిటీలు ఇండియాలో దాదాపు ఇంకెవరూ లేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోలలో అమీర్ ఖాన్ కాస్త వినమ్రంగా ఉంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తారు. పెద్దగా బడాయిలకు పోకుండా దేశం కోసం ఆడుతున్నట్లు, ప్రేక్షకులు లేకపోతే…

మధ్య ప్రాచ్యంలో పదివేల చైనా సైన్యం!

భౌగోళిక రాజకీయాలలో ఆర్ధిక చర్యల వరకే పరిమితం అయిందని భావిస్తున్న చైనా సైనిక చర్యలకు సైతం సిద్ధపడుతోంది. ఇసిస్ బలగాల వల్ల దక్షిణ ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, చైనా పొరుగు ప్రాంతం అభధ్రతకు గురవుతున్నాయని భావిస్తున్న చైనా పెద్ద సంఖ్యలో ఆఫ్రికా, ఆసియాలకు సైనికులను తరలిస్తోంది. సైనిక బలగాల నియోగానికి కారణంగాపైకి చెప్పటానికి ఇసిస్ టెర్రరిస్టు చర్యలు కారణంగా చైనా చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది భౌగోళిక రాజకీయాలలో చైనా సైనిక ప్రవేశంగా భావించవలసి ఉంటుంది. ఇసిస్…

చెన్నై: స్వాతి హంతకుడు దొరికాడు

వారం రోజులుగా చెన్నై పోలీసులకు ‘కొరకరాని కొయ్య’గా మారిన చెన్నై టెకీ స్వాతి హత్య మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తాను పని చేసే ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళేందుకు నుంగంబక్కం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్న స్వాతిని కొడవలితో నరికి చంపిన హంతకుడి ఆచూకీని ప్రజల సాయంతో పోలీసులు పట్టుకోగలిగారు. తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యల నేపధ్యంలో పోలీసుల పైనా, ప్రభుత్వం పైనా తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో చెన్నై పోలీసులు భారీ ఎత్తున బలగాలను…

వృద్ధికి, బహుశా ద్రవ్యోల్బణానికీ ప్రేరణ -ద హిందూ ఎడిట్..

[“A fillip to growth, and maybe inflation” శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ********* 7వ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా కోటికి పైగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు మరియు పింఛన్లు పెంచాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినియోగ డిమాండ్, ఆర్థిక వృద్ధి లకు ఆదరువు కాగలదు. బలిష్టమైన ప్రైవేటు వినియోగమే ప్రస్తుత ఆర్థిక కదలికకు కీలకమైన శక్తిగా పని చేస్తున్నదని ఇటీవల కేంద్ర…

ఓర్లాండో షూటింగ్: నిమిషంలో 49 మందిని చంపేశాడా?

ఒర్లాండో షూటింగ్ గుర్తుందాండి? జూన్ 12 తేదీ ఆదివారం రాత్రి (తెల్లవారు ఝామున) 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పల్స్ నైట్ క్లబ్ లో తుపాకులతో కాల్చి 49 మందిని చంపేశాడని, మరో 53 మందిని గాయపరిచాడని పత్రికలు మనకు చెప్పిన సంఘటన! ఇలాంటి షూటింగ్ లను, తద్వారా జరుగుతున్న రక్తపాతాన్ని ‘లోన్ వోల్ఫ్ ఆటాక్స్’ గా అమెరికా భద్రతా సంస్ధలు చెబుతున్నాయని, వారి కధలను, కధనాలను భారత పత్రికలు అంది పుచ్చుకుని…