1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

నోట్ల రద్దు: వివరాలు చెబితే ప్రాణాలకు ముప్పు -ఉర్జిత్

పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.  నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను…

నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు

పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా…

అమెరికా, జపాన్ లతో మిలట్రీ డ్రిల్ కు ద.కొరియా నో!

ఆసియాలో, ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్ర తీరంలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఆసియాలో జపాన్ తర్వాత దక్షిణ కొరియాయే అమెరికాకు నమ్మిన బంటు. అమెరికాకు చెందిన అది పెద్ద సైనిక స్ధావరాలు జపాన్, దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. అయితే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని బెదిరించడానికి జపాన్, అమెరికాలు తలపెట్టిన సంయుక్త విన్యాసాలలో పాల్గొనడానికి దక్షిణ కొరియా నిరాకరించడమే ఆ విశేషం. ఉత్తర కొరియాకు చెందిన జలాంతర్గాములను లక్ష్యం చేసుకుని దక్షిణ కొరియాతో…

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! -సాక్షి

  ఇది సాక్షి దిన పత్రికలో ఈ రోజు, జనవరి 9, 2017 తేదీన ప్రచురితం అయిన కధనం. నిన్న ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కధనం ఉటంకించిన సోర్స్ నే సాక్షి కధనం కూడా ఉటంకించింది. కాబట్టి రెండు కధనాలలో విషయం దాదాపు ఒకటే. ఇలాంటి కధనాలు తెలుగు పత్రికల్లో రావడం అరుదు కనుక సాక్షి కధనాన్ని కూడా బ్లాగ్ లో ప్రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో దీనిని కూడా ప్రచురించడం జరుగుతోంది. ఇక్కడ క్లిక్ చేస్తే…

డీమానిటైజేషన్: అమెరికా చెప్పిందే మోడీ చేశారు!

[పై కత్తిరింపును పి‌డి‌ఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి] ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి. అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి…

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ 50 శాతం చైనా కైవశం

సంవత్సర కాలం లోనే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇండియాను తమ ఫోన్లతో నింపేసాయి. 2015 లో ఇండియాలో ప్రవేశించిన పలు చైనా కంపెనీలు సంవత్సర కాలం లోనే అత్యంత వేగంగా తమ ఉత్పత్తుల అమ్మకాన్ని పెంచుకోగలిగాయి. 2016 సంవత్సరంలో ఇండియాలో అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో సగానికి పైగా చైనా కంపెనీలు ఉత్పత్తి చేసినవేనని వాణిజ్య వార్త సంస్ధ రాయిటర్స్ తెలిపింది.    తమ ఉత్పత్తుల మార్కెటింగ్ లో ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించడం చైనా కంపెనీలు విజయవంతం…

Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల…

గాంధీ బొమ్మ లేని 2000 నోటు!

డీమానిటైజేషన్ / రీమానిటైజేషన్ లీలలు ఒకటీ, రెండూ కాదు.  ఆ మధ్య సంస్కృత అంకెలను తప్పు ముద్రించారు. ఆ తర్వాత ఆంగ్లం అంకెలని కూడా తప్పు ముద్రించారు. థ్రెడ్ లేకుండా కొన్ని నోట్లు పంచారు. ఓ చోట  బ్యాంకు రెండు వేల నోటు తెచ్చుకున్నాక కొన్ని గంటల లోపే ముక్కలు ముక్కలుగా దానంతట అదే విరిగిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. కొన్ని చోట్ల సగం మాత్రమే ప్రింట్ అయిన 500 నోట్లు ఎటిఎం లలో ప్రత్యక్షమై…

నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది.  PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల…

నోట్ల రద్దు నిరసన: లక్ష కి.గ్రాల కూరగాయలు ఫ్రీగా ఇచ్చేసిన రైతులు

“డీమానిటైజేషన్ వల్ల జనానికి కాస్త అసౌకర్యం కలిగించిన మాట నిజమే. కానీ ప్రజలందరూ డీమానిటైజేషన్ కు మద్దతు ఇస్తున్నారు. మోడీ మంచి చర్య తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారని మెచ్చుఁకుంటున్నారు. దేశంలో ఏ ఒక్కరూ నిరసన తెలియజేయక పోవటమే అందుకు నిదర్శనం. జనం ఎక్కడా వీధుల్లోకి రాకపోవడమే అందుకు సాక్షం.”  ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. డీమానిటైజేషన్ ఫలితంగా వందకు మందికి…

సుప్రీం ప్రక్షాళన: బి‌సి‌సి‌ఐ అధ్యక్షుని డిస్మిస్!

సుప్రీం కోర్టు పుణ్యాన భారత క్రికెట్ 2017 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతోంది. అవినీతి రాజకీయ నాయకులకు, ఆశ్రిత పక్షపాతానికి, వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన బి‌సి‌సి‌ఐ అధ్యక్షుడు కార్యదర్శి పదవుల నుండి అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే లను తొలగించింది. వారి స్ధానాలను భర్తీ చేసేందుకు క్రికెట్ ఆటతో సంబంధం ఉన్న నిష్కళంక దక్షులను వెతకాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులతో ద్వి సభ్య కమిటీ నియమించింది. అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ…

నోట్ల రద్దు: ఆర్‌టి‌ఐ కింద సమాచారం నిరాకరించిన ఆర్‌బి‌ఐ

“ప్రభుత్వ అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. పాలనలో పారదర్శకత పాటించాలి. అప్పుడే సుపరిపాలన అందించినట్లు” అని ప్రధాని మోడి గొప్ప గొప్ప నీతి బోధలు చేస్తారు. ఆయన నీతి బోధనలను ఆయన ప్రభుత్వమే పాటించదు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంల కోసం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ సంస్ధలే గౌరవించవు. కోట్లాది మంది ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి, రోడ్ల మీదికి నెట్టి, చివరికి రద్దు చేసిన నోట్లు కలిగి ఉన్నందుకు వారిని…

మంచి కోసం బలహీనుల బలిదానం తప్పదు!

రచన: డా. రమణ యడవల్లి (ఫేస్ బుక్ నుండి) ********* “ఏవిఁటీ! దేశప్రజలందరికీ ఒక్కరోజులో ఈత నేర్పేశారా! యెలా సాధ్యం?” “సింపుల్! రాత్రికిరాత్రే ఒక్కసారిగా ప్రజల్ని నీళ్ళల్లోకి తోసేశాం.” “వామ్మో!” “సరీగ్గా వాళ్ళూ ఇలాగే ఆర్తనాదాలు చేశారు.” “తర్వాత?” “వారిలో కొందరు ప్రాణభయంతో కాళ్ళూచేతుల్ని తపతపలాడిస్తూ ఈత నేర్చేసుకున్నారు.” “మిగిలివాళ్ళు?” “వాళ్ళు సోమరులు, నీళ్ళల్లో మునిగి చచ్చారు.” “ఈత నేర్పే పద్ధతి ఇది కాదేమో!” “ప్రజలకి మంచి చెయ్యాలనే మా స్పూర్తిని నువ్వు అభినందించాలి!” “కానీ బలహీనులు…

సిరియాలో శాంతికి ఒక అవకాశం -ద హిందూ..

(True transalation of The Hindu editorial “A Chance For Peace in Syria”, published on December 21, 2016.) ********* సిరియా సంక్షోభానికి దౌత్య పరిష్కారం కనుగొనటానికి రష్యా, టర్కీ, ఇరాన్ లు ఒక చోటికి చేరడం ఆహ్వానించదగిన పరిణామం. టర్కీలో రష్యా రాయబారి అందరి కార్లొవ్ హత్యకు గురయినప్పటికీ మాస్కోలో మంగళవారం జరగనున్న శిఖరాగ్ర సభను కొనసాగించడానికే నిర్ణయించడం బట్టి తాము అనుకున్న పంధాలో ముందుకు వెళ్ళడానికే తాము నిబద్ధులమై ఉన్నామని…