ఒమిక్రాన్ వైరస్ మిస్టరీ!

శాస్త్రవేత్తలకు ఒమిక్రాన్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది. దానికి కారణం గత కోవిడ్ రకాలతో పోల్చితే దీని లక్షణాలు కాస్త భిన్నంగా ఉండడం. డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండడం ఇప్పటికీ ఊరటగా ఉంది. కానీ లక్షణాలు తేలికగా ఉన్నాయని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయడం తగదని WHO గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నా ముందు ముందు అది ఎలాంటి లక్షణాలు సంతరించు కుంటుందో…

త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు…

ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ

తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తోంది. మరోపక్క అమెరికాలో, జర్మనీ,…

పీఎం కేర్స్ ఫండ్ లోగో లో ప్రధాని బొమ్మ తీసెయ్యండి -పిటిషన్

బాంబే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. PM CARES ఫండ్ ఎంబ్లమ్ లో నుండి ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ, జాతీయ జెండా బొమ్మ వెంటనే తొలగించాలని ఈ పిటిషన్ సారాంశం. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. విచారణ క్రిస్మస్ సెలవుల తర్వాత తేదికి వాయిదా వేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు. “ఇది ముఖ్యమైన పిటిషన్ మిస్టర్…

వ్యాక్సిన్: ప్రజల కంపెనీల్ని మూలకు తోసి ప్రైవేటుని మేపుతున్నారు!

ప్రజల కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అని. వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం పేరెన్నిక గన్నది. ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీ కంపెనీలను స్ధాపించి నిర్వహించడంలో భారత దేశానికి పెద్ద చరిత్రే ఉన్నది. ఎల్‌పి‌జి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను చేపట్టిన ఫలితంగా ఈ ప్రజల/ప్రభుత్వ కంపెనీలను ఒక్కటొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. దానితో వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత దేశం ఇప్పుడు పరాధీన దేశంగా మారిపోయింది. విదేశీ ప్రైవేటు…

కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల…

జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

గుజరాత్ హైకోర్టు: జనం ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?

ప్రజల ఆహార అలవాట్లపై నిర్బంధం విధించాలని ప్రయత్నిస్తున్న హిందూత్వ పాలకులకు గుజరాత్ హై కోర్టు కాస్త గడ్డి పెట్టింది. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మాంసాహారం అమ్ముతున్న తోపుడు బండ్ల ను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రజలు ఏ ఆహారం తినాలో నిర్ణయించే అధికారం పాలకులకు లేదని తేల్చి చెప్పింది. స్వాధీనం చేసుకున్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. “మీరు మాంసాహారం భుజించరు. అది మీ దృక్పధం. కానీ జనం ఏమి…

నాగాలాండ్ కూలీల హత్య: పార్లమెంటును తప్పుదారి పట్టించిన హోం మంత్రి?

14 మంది నాగాలాండ్ కూలీలను భారత భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయంలో హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కూలీలు వారు ప్రయాణిస్తున్న వాహనంలో భద్రతా బలగాల సంకేతాలను లెక్క చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనే సైనికులు కాల్పులు జరపవలసి వచ్చిందని మంత్రి రాజ్య సభలో చెప్పారు. దుర్ఘటనలో ప్రాణాలతో బైటపడిన కూలీలు చెబుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి…

రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

ఇండియా రష్యా 2+2 డైలాగ్: ఏ‌కే-203 ఒప్పందం ఒకే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య 2+2 ఫార్మాట్ లో ఈ రోజు చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు రష్యా తరపున పాల్గొనగా, ఇండియా తరపున రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశం ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో…

మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…