రష్యా సేనలు వెనక్కి! అమెరికా జోస్యం తుస్సు?

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేయబోతోందంటూ దాదాపు రెండు నెలల నుండి కాకి గోల చేస్తున్న అమెరికా జోస్యం చివరికి తుస్సుమంటోందా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అని తాజా పరిణామం స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యన్ మిలట్రీ డిస్ట్రిక్ట్ లలో ఉన్న రష్యన్ సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళుతున్నాయి. ఈ వార్తను బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. వార్షిక మిలట్రీ డ్రిల్ కోసం అక్కడికి వచ్చిన సైన్యాలు డ్రిల్లు…

రష్యా దాడి చేస్తుందని మేం అనుకోవటం లేదు -ఉక్రెయిన్

ఓ పక్క అమెరికా యుద్ధం గ్యారంటీ అని అరుస్తూనే ఉంది. రష్యా దాడికి తేదీలు కూడా ప్రకటిస్తోంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం అమెరికా హెచ్చరికలను, జోస్యాన్ని నమ్ముతున్న సూచనలు ఏమీ లేవు. “ఫిబ్రవరి 16 తేదీన దాడి జరుగుతుందని వాళ్ళు చెబుతున్నారు. ఆ రోజుని మేము ‘ఐక్యతా దినం’గా సెలబ్రేట్ చేసుకుంటాం” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. సోమవారం వీడియోలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఈ మాటలన్నాడు. (రాయిటర్స్, 14…

మిన్స్క్ ఒప్పందాన్ని ఖాతరు చేయని ఉక్రెయిన్ -3

ఫిబ్రవరి 13 తేదికల్లా మరొవార్త. అమెరికా, రష్యా అధ్యక్షులు గంట పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఆ వార్త సారాంశం. బైడెన్ మళ్ళీ అదే పాట. “ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే అమెరికా మరిన్ని అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తుంది” అని. “రష్యా దాడి చేస్తే పశ్చిమ రాజ్యాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి” అనీను. పుతిన్ సమాధానం “రష్యా ఆందోళనలను పరిగణించడంలో అమెరికా విఫలం అవుతోంది” అని. “నాటో విస్తరణ పైనా, ఉక్రెయిన్ లో…

ఉక్రెయిన్: గ్యాస్ రాజకీయాలతో రష్యాకు హాని! -2

పైప్ లైన్ రాజకీయాలు ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు రష్యా బాల్టిక్ సముద్రం గుండా పైపు లైన్ ను రష్యా నిర్మించింది. ఈ పైపు లైన్ నిర్మాణ దశలోనే అమెరికా అనేక ఆటంకాలు కల్పించినప్పటికి నిర్మాణాన్ని రష్యా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పైపు లైన్ పేరు నార్డ్ స్ట్రీమ్ – 2. నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ను 2011లోనే రష్యా పూర్తి చేసింది. ఇది కూడా బాల్టిక్ సముద్రం గుండా రష్యా నుండి…

ఆధిపత్యం నిలుపుకునే ఆరాటంలో అమెరికా, బలిపశువు ఉక్రెయిన్!

కొన్ని నెలలుగా ఉక్రెయిన్ కేంద్రంగా అమెరికా రకరకాల యుద్ధ ప్రకటనలు చేస్తున్నది. రష్యా త్వరలో ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నట్లు గానూ, రష్యా దురాక్రమణ దాడి నుండి ఉక్రెయిన్ ను రక్షించడానికి తన నేతృత్వం లోని నాటో యుద్ధ కూటమి సిద్ధంగా ఉన్నట్లుగానూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఆయనతో పాటు ఇతర అమెరికా అధికారులు కూడా అనుబంధ ప్రకటనలు గుప్పిస్తూ రష్యాను ఒక రాక్షస దేశంగా, ఉక్రెయిన్ ఆ రాక్షసిని చూసి గజ…

ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై…

బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు

బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022). “ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి.…

Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు…

అమ్మాయి 18, అబ్బాయి 21 బుల్లి బాయ్ ఆప్ ముద్దాయిలు!

యువత ఎటు ప్రయాణిస్తోంది? ఇప్పుడే ఇంటర్ దాటిన ఓ టీనేజి అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న ఓ నూనూగు యువకుడు ఇంతటి ద్వేషాన్ని తమ మెదళ్లలోకి ఎలా ఎక్కించుకున్నారు? ఎలాంటి వ్యక్తిగత కారణం లేకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా, ఏ విధంగానూ సంబంధం లేకుండా అంత చిన్న వయసులో ముస్లిం స్త్రీలను ఆన్ లైన్ లో వేలానికి పెట్టే టంతటి విద్వేషం వారికి ఎందుకు పుట్టింది? ఇది ఆట అనుకున్నారా? ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల నుండి ఆయా…

క్లైమెట్ ఛేంజ్: పశ్చిమ దేశాల హిపోక్రసీ (గొప్ప వీడియో)

వాతావరణ మార్పులపై పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మూడో ప్రపంచ దేశాలకు తెగ బోధనలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనాలు బొగ్గు వినియోగంతో అత్యంత అధికంగా భూమండలాన్ని కాలుష్యం లో ముంచుతున్నాయని అవి తరచుగా లెక్కలు చెబుతాయి. ఈ లెక్కలు ఎంత వాస్తవమో ఈ వీడియో చక్కగా వివరిస్తుంది. తప్పకుండా చూడండి. (ఫేస్ బుక్ నుండి) https://www.facebook.com/1439656221/videos/224755656490178/

అణు యుద్ధానికి పాల్పడం! -P5 దేశాలు

P5 అంటే ‘పర్మినెంట్ 5’ అని అర్ధం. ఐరాస భద్రతా సమితి (Security Council) లో 5 శాశ్వత సభ్య దేశాలను షార్ట్ కట్ లో P5 అని సంభోధిస్తారు. రష్యా, బ్రిటన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్… ఈ 5 దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు. ఈ దేశాలకు భద్రతా సమితిలో ఏ నిర్ణయాన్నైనా వీటో చేసే హక్కు ఉంటుంది. అనగా ఏ నిర్ణయమైనా ఈ 5 దేశాలు ఆమోదిస్తేనే జరుగుతుంది.…

ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’

ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా…

హిందూత్వ ముఠాలు ఉపరాష్ట్రపతి మాటలు వినాలి!

ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు. కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బి‌జే‌పి ఎం‌పి…