బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా తమ పని తాము చేసుకుపోయే బుకీలు అయి ఉండాలి. లేదా గురునాధ్ మీయప్పన్, విందూ ధారా సింగ్ లాంటి పందెం గాళ్ళు అయి ఉండాలి. లేదా క్రికెట్ ఆటను ఫక్తు వ్యాపార సరుకుగా మార్చి వేసిన వీరందరితో కూడిన వ్యవస్ధ అయి ఉండాలి.
సుప్రీం కోర్టు చొరవ వల్ల బెట్టింగ్ వ్యవస్ధ (గుర్రం) వణికిపోతున్నట్లు కూడా కార్టూనిస్టు సూచిస్తున్నారు. మొత్తం మీద ఆట ఆటగా మిగలకుండా ఈ విధంగా కార్టూనిస్టుల చేతుల్లో పజిల్ గా మారిపోయింది.
