అమెరికాను డిఫాల్ట్‌నుండి రక్షించిన బడ్జెట్ కంట్రోల్ ఒప్పందం, ముఖ్య అంశాలు

ద్వైపాక్షిక పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష భవనం లు ఆగస్టు 1 తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ద్వారా ఒబామా కోరినట్లుగా అమెరికా రుణ పరిమితి పెంచడానికీ, రిపబ్లికన్లు కోరినట్లుగా బడ్జెట్ ఖర్చుల్ని తగ్గించి తద్వరా బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) తగ్గించడానికి మార్గం సుగమం చేసుకున్నారని పత్రికలు తెలిపాయి. ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు తెలుగు పాఠకుల కోసం ఇక్కడ. రిపబ్లికన్లు, డెమొక్రట్లు పరస్పర అంగీకారంతో ఒక…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -1

అమెరికా రుణ పరిమితి పెంపుదల, బడ్జెట్ లోటు తగ్గింపు లపై ఒప్పందం కుదిరి, ఆ మేరకు బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బిల్లుపై సంతకం చేసి చట్టంగా అమెరికా మీదికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదికి వదిలాడు. రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచడం ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అవుతుందన్న భయం తప్పింది. కొత్త అప్పులు చేసి పాత అప్పుల చెల్లింపులు చేయడానికి అవకాశం…

తిరుగుబాటులో చీలిక! లిబియా దాడిలో పట్టు కోల్పోతున్న నాటో?

లిబియాలో తిరుగుబాటుగా చెబుతున్న యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు వైమానిక దాడులతో మద్దతు, సహకారం ఇస్తున్నప్పటికీ లిబియా తిరుగుబాటుదారులు ముందంజ వేయడంలో విఫలమవుతుండం పశ్చిమ రాజ్యాలను నిరాశకు గురి చేస్తోంది. తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రారంభ దినాల్లొనే లిబియా తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయిన మిలటరీ కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్యతో లిబియా తిరుగుబాటుదారుల్లో ఉన్న విభేదాలు లోకానికి వెల్లడయ్యాయి. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న కమాండర్ ను వెనక్కి పిలిపించి మరీ హత్య చేయడతో…

కొనసా……..గుతున్న షేర్ల పతనం

ఈ వారం మూడవ రోజు కూడా బారత షేర్లు పతన బాటలో కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రధాన షేర్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టాలు చవిచూశాయి. అమెరికా రుణ పరిమితి పెంపు పైనా, బడ్జెట్ లోటు తగ్గింపు పైనా అక్కడి చట్ట సభలు, వైట్ హౌస్ లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ మార్కెట్లు లేదా మదుపుదారులు సంతృప్తి చెందలేదు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు లకు సంబంధించిన చర్చలు సుదీర్ఘ కాలంపాటు…

ప్రపంచంలో అతి పొడవైన పది వంతెనలు -ఫోటోలు

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనిషి సుసాధ్యం చేసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మ పరికరాలనుండి అతి పెద్ద ఆకాశ హర్మ్యాల వరకూ మనిషి తన జీవన సౌకర్యాల కోసం అభివృద్ధి చేసుకున్నాడు. పెద్ద పెద్ద డ్యాం లు కట్టి నీటిని నియంత్రణలోకి తెచ్చుకున్న మనిషి తనకు అవసరమైన చోటికి నీటిని తీసుకెళ్ళగలగడం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తెచ్చి పెట్టింది. యేసు క్రీస్తు నీటి మీద నడవడం నిజమో…

అదే సచిన్ అయితే పెద్ద గొడవై ఉండేది -ఇంగ్లండ్ క్రికెట్ కోచ్

ఇంగ్లండు క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ  జింబాబ్వే ఆటగాడు ఆండి ఫ్లవర్, సచిన్‌ టెండూల్కర్‌ను ఒకసారి తలచుకున్నాడు. రెండవ టెస్టు మ్యూచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ రనౌట్‌ను తిరిగి పరిశీలించాలని భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్ళి కోరడాన్ని ఆయన సమర్ధించుకుంటూ తన నిర్ణయంలో సచిన్‌ని ప్రతిక్షేపించుకున్నాడు. “ఇయాన్ బెల్ లాగే సచిన్ అవుటై ఉన్నట్లయితే క్రికెట్ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఉండేది” అని చెబుతూ తమ చర్యను సమర్ధించుకున్నాడు.…

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.…

యెడ్యూరప్ప అవినీతి విచారణకు కర్ణాటక గవర్నర్ అనుమతి మంజూరు

మరి కొద్ది గంటల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారనున్న యెడ్యూరప్పపై మరొక దెబ్బ పడింది. ఆయనపై లోకాయుక్త కనుగొన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి కర్ణాటక గవర్నర్ ‘హంసరాజ్ భరద్వాజ్’ లోకాయుక్త పోలీసులకు అనుమతి మంజూరు చేశాడు. అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీలతో కుమ్మక్కయ్యాడని లోకాయుక్త చేసిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేశాడు. దీనితో యెడ్యూరప్పకు కష్టాలు మరిన్ని పెరిగాయి. కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య జరుగుతున్న ఈ నాటకటకం ఎంతవరకూ దారి తీస్తుందో చూడవలసి…

సైబర్ చరిత్రలోనే అతి పెద్ద హ్యాకింగ్ దాడులు, చైనాపై అనుమానాలు

ఇంటర్నెట్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ చరిత్రలో మున్నెన్నడూ ఎరగనంత పెద్ద స్ధాయిలో సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ హ్యాకింగ్ దాడులను గుర్తించిన మెకేఫీ (McAfee)సంస్ధ ఈ దాడుల వెనుక ఒక దేశ ప్రభుత్వం ఉందని చెబుతూ, ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వాలు, కంపెనీలతో సహా 72 సంస్ధల నెట్ వర్క్‌లు సైబర్ దాడులకు గురయినట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కి పాల్పడింది ఎవరో చెప్పడానికి మేకేఫీ నిరాకరించినప్పటికీ, ఈ వార్తను పత్రికలకు తెలిపిన సెక్యూరిటీ…

సర్వేలో ‘జన లోక్‌పాల్’కు 80% మద్దతు, ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ సవాల్

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ నియోజక వర్గం ‘చాందినీ చౌక్’ పార్లమెంటరీ నియోజక వర్గంలో అన్నా హజారే బృందం లోక్ పాల్ డ్రాఫ్టులపై సర్వే నిర్వహించిన సంగతి విదితమే. సర్వేలో ప్రభుత్వ డ్రాఫ్టు ‘లోక్ పాల్’ బిల్లు, అన్నా బృందం రూపొందించిన ‘జన్ లోక్‌పాల్’ బిల్లులు వివిధ ప్రధాన అంశాలపై ఏమేం ప్రతిపాదిస్తున్నదీ ఉదహరిస్తూ, అందులో ఏ అంశాలకు తాము మద్దతు ఇస్తున్నదీ గుర్తించవలసిందిగా కోరారు. మొత్తం 4 లక్షల కుటుంబాలలో అన్నా…

కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

అబ్బే, నేనసలు ల్యాప్ టాపే మొయ్యను, పగిలిందెప్పుడు? -వెంకయ్య నాయుడు

ఆగ్రహంతో ఉన్న యెడ్యూరప్ప తన ల్యాప్ టాప్ ను లాక్కొని విసిరేసి పగలకొట్టాడని మీడియాలో వచ్చిన వార్తను వెంకయ్య నాయుడు ఖండించాడు. తానసలు లాప్ ట్యాప్ ని మోసే పనిని పెట్టుకోననీ ఇక మరొకరు లాక్కొని పగలగొట్టే పరిస్ధితే తలెత్తదనీ వెంకయ్య నాయుడు అన్నాడు. తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలో సంతకం పెట్టడానికి నిరాకరించడంతో అగ్రహంతో వెంకయ్య నాయుడు చేతిలోని ల్యాప్ టాప్ లాక్కొని నేలకేసి విసిరి కొట్టినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టు…

ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు…

అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం

ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన…

ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…