కరప్షన్ వెల్త్ గేమ్స్ – 2010 -కార్టూన్

కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కూడా ఆరోపణలు చేసింది. సరిగా దర్యాప్తు చేయడం లేదని ఢిల్లీ హై కోర్టు మరోవైపు ఢిల్లీ పోలీసులను చెండాడుతోంది. అసలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధిపతిగా సురేష్ కల్మాడిని నియమించింది ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ చల్లగా చెప్పడంతో బి.జె.పి పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అప్పటికే సురేష్ కల్మాడిపై అనేక ఫిర్యాదులు…

అమెరికా రుణ సంక్షోభానికి తాత్కాలిక మాట్లు -కార్టూన్

అమెరికా రుణ పరిమితిని $2.1 పెంచడానికీ, బడ్జెట్ లోటు $2.1 ట్రిలియన్ తగ్గించడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు కుదుర్చుకున్న ఒప్పందం సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు తాత్కాలికంగా మాట్లు వేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దానివలన రాదు. అమెరికా ప్రజల మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, బడా కంపెనీల దోపిడి, వేతనాల స్తంభన… మొదలైన సమస్యలను పరిష్కరించకుండా,ఆర్ధిక వ్యవస్ధలొని వివిధ ప్రధాన అంగాల్లో తాత్కాలికంగా మాట్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించడం అవివేకం. అది…

లిబియా తిరుగుబాటుదారుల్లో వెల్లివిరుస్తున్న ఐకమత్యం -కార్టూన్

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్‌ లో పాల్గొంటున్న కమేండర్‌ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని…

తాలిబాన్ రాకెట్ దాడిలో 38 మంది అమెరికా సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లోని సెంట్రల్ మైదాన్ వార్డాక్ రాష్ట్రంలోని సైదాబాద్ లో తాలిబాన్ ఫైటర్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) తో 38 మంది సైనికులున్న ఛినూక్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లుగా తాలిబాన్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఛినూక్ హెలికాప్టర్ కూలిపోయిందనీ, కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో 31 మంది అమెరికా సైనికులు కాగా 7గురు ఆఫ్ఘన్ కమేండర్లనీ తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం మొదలయ్యాక ఒకే సంఘటనలో…

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గుదల తీవ్రమైన విషయమే -ఆర్ధిక మంత్రి ప్రణబ్

భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా క్రెడిట్ రేటింగ్ ని ఎస్ & పి రేటింగ్ సంస్ధ తగ్గించడంపై శనివారం స్పందించాడు. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం “తీవ్రమైన విషయమే” అని అభివర్ణించాడు. అయితే విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందనీ, అది సరైంది కాదనీ ఆయన వ్యాఖ్యానించాడు. “అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని డౌన్ గ్రేడ్ చేసిన చర్యని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. దానికి కొంత సమయం కావాలి. విషయాలు పూర్తిగా…

అసలు ఎస్ & పి విశ్వసనీయత ఎంత? తనదాకా వచ్చాక అడుగుతున్న అమెరికా

తనదాకా వస్తేగాని అర్ధం కాలేదు అమెరికాకి. ఒక దేశానికి చెందిన క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే ఏమిటో అమెరికా అధికారులకి, కాంగ్రెస్ సభ్యులకీ, సెనేట్ నాయకులకీ ఇప్పుడు అర్ధం అవుతోంది. అది కూడా పాక్షికంగానే. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించాక మాత్రమే ఎస్ & పి కి ఉన్న విశ్వసనీయతపైన అమెరికాకి అనుమానాలు వస్తున్నాయి. యూరప్, ఆసియా లకు చెందిన అనేక బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలతో పాటు దేశాల సావరిన్ అప్పులకు కూడా రేటింగ్ లను…

రుణ సంక్షోభంపై అమెరికాని లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన చైనా

రుణ సంక్షోభాన్ని అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న పద్దతిపై చైనా మొదటిసారిగా స్పందించింది. సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుని తీవ్రంగా ఎండగట్టింది. కనీసం కామన్ సెన్స్ కూడా లేదని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. డాలర్ ఆధిపత్యం వహించే రోజులు పోయాయని హెచ్చరించింది. ఇలాగే ఉంటే మరో కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా ఎన్నుకోవాల్సి ఉంటుందని క్లాస్ పీకింది. ఆర్దిక వ్యవస్ధని అప్పులపై ఆధారపడి నడపడాన్ని ఎద్దేవా చేసింది. అమెరికా రుణ సంక్షోభం నుండి బైటపడడానికి రాజకీయ పక్షాలు జరిపిన చర్చలు…

టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా

భయపడిందే జరిగింది. నెలల పాటు రుణ పరిమితి పెంపు కోసం, బడ్జెట్ లోటు తగ్గంపు కోసం సిగపట్లు పట్టుకుని చివరిదాకా తేల్చలేకపోయినందుకు అమెరికా ట్రెజరి జారీ చేసే రుణ బాండ్ల (సావరిన్ డెట్ బాండ్లు) రేటింగ్‌ను స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ తగ్గించింది. అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు తగ్గించింది. ప్రపంచ దేశాలు జారీ చేసే ట్రెజరీ బాండ్లలో అమెరికా బాండ్లకే అత్యధిక రేటింగ్ ఉంది. ట్రెజరీ బాండ్లు…

అబ్బే, అమెరికా కాంగ్రెస్ పనితీరు సరిగా లేదు -అమెరికా ప్రజలు

అమెరికా ప్రజలు అమెరికా కాంగ్రెస్ (House of Representatives or Congress) పనితీరుని అత్యధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంత అధిక స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని రిపబ్లికన్ సభ్యులు, డెమొక్రట్ సభ్యులు రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచాలనీ, బడ్జెట్ లోటుని 2.1 ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనీ ఒప్పందం కుదుర్చుకుని చట్టాన్ని ఆమోదించాక జరిపిన సర్వేలో అమెరికా ప్రజల్లో 82 శాతం మంది కాంగ్రెస్ పనితీరు బాగాలేదని తేల్చారు. న్యూయార్క్…

కుప్ప కూలిన షేర్ మార్కెట్లు, వణికిస్తున్న అమెరికా, యూరప్ సంక్షోభాలు

శుక్రవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 383.31 పాయింట్లు (2.19 శాతం) నష్టపోయి 17305.87 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి 120.55 పాయింట్లు (2.26 శాతం) నష్టపోయి 5211.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ మానసిక స్ధాయి17000 పాయింట్లకు తక్కువగా 16990.91 వరకూ పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ కూడా ఓ దశలో 5200 పాయింట్లకు తక్కువగా 5116.45 వరకూ పడిపోయి అనంతరం కోలుకుంది. అమెరికా రుణ సంక్షోభం, యూరప్ సావరిన్ అప్పు…

ఒక్క వారంలో $2.5 ట్రిలియన్లు నష్టపోయిన ప్రపంచ షేర్ మార్కెట్లు

ఈ ఒక్క వారంలోనే ప్రపంచ షేర్ మార్కెట్లు మొత్తం 2.5 ట్రిలియన్లు నష్టపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఇది రు.1.125 కోట్ల కోట్లకు లేదా రు.1,12,50,000 కోట్లకు సమానం. ఫ్రాన్సు వార్ధిక స్ధూల జాతీయోత్పత్తి కూడా సరిగ్గా ఇంతే ఉంటుంది. ఒక ప్రధాన అభివృద్ధి చెందిన దేశ జిడిపితో సమానంగా ప్రపంచ షేర్ మార్కెట్లు ఈ ఒక్క వారంలోనే (ఆగస్టు 1 నుండి 5 వరకు) నష్టపోయాయన్నమాట! ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ “డబుల్ డిప్” వైపుకి మరొక “ది…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…

దేశంలోని టెర్రరిస్టులే ముంబై పేలుళ్ళకు బాధ్యులు కావొచ్చు -హోం మంత్రి

జులై13 తేదీన ముంబైలో చోటు చేసుకున్న మూడు వరుస పేలుళ్ల వెనక దేశంలోపలి టెర్రరిస్టు మాడ్యూల్సే బాధ్యులు అయి ఉండవచ్చని కేంద్ర మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంటుకు తెలిపాడు. ముంబైలో మూడు చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత దేశంలో తలెత్తిన టెర్రరిస్టు మాడ్యూళ్ళు ఈ పేలుళ్లకు బాధ్యులని చెప్పడానికి సూచనలు వెల్లడయ్యాయని తెలిపాడు. “ఇంకా…

ఒళ్ళు జలదరించే భయానక ఆఫ్రికా కరువు దృశ్యం -ఫోటోలు

ఆఫ్రికా కరువు గాధలకు అంతే ఉండదు. అంతులేని కధల సమాహారమే అఫ్రికా కరువు గాధ. కరువు, దుర్భిక్షం, యుద్ధం… ఇవి మూడూ అఫ్రికా దేశాలకు శనిలా దాపురించాయి. కనుచూపు మేరలో పరిష్కారం కనపడక శనిపై నెపం నెట్టేయడమే కాని ఆఫ్రికా కరువు మానవ నిర్మితం. లాభాల దాహం తప్ప మానవత్వం జాడలు లేని బహుళజాతి కంపెనీలు ఒకనాటి చీకటి ఖండంపై రుద్దిన బలవంతపు యుద్ధాలే ఈ అంతులేని కరువుకి మాతృకలు. లాభాల దాహం దోపిడికి తెగబడితే దాన్ని…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2

(ఒకటవ భాగం తరువాయి) ఇండియాలాగే చైనా కూడా. చైనా, పైకి తన కంపెనీలను ప్రవేటీకరణ చేసినట్లు చూపుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ఈక్విటీ కంపెనీలుగా మారడానికి ఆ దేశం అనుమతించింది. కొన్ని ఈక్విటీలను స్వదేశీ, విదేశీ ప్రవేటు మదుపుదారుల చేతుల్లో పెట్టింది. ఇది పైకి పూర్తిగా ప్రవేటీకరణ జరిగినట్లుగా కనిపించింది. వాస్తవానికి చైనాలొని అన్ని రంగాల కంపెనీల్లో చైనా ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుని ప్రవేటీకరణ కావించిన కంపెనీలపై కూడా తన పట్టు పోకుండా జాగ్రత్త…