పాఠశాల హత్యలు: కెమెరా ముందు ఏడ్చేసిన ఐరాస ప్రతినిధి

గాజాలో ఐరాస తరపున శరణార్ధి శిబిరాలను నిర్వహిస్తున్న UNRWA ప్రతినిధి తమ పాఠశాలపై దాడిని వివరిస్తూ కెమెరా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అమానుషాన్ని కళ్ళారా చూసిన ఆయన జరిగిన ఘోరాన్ని తిరిగి గుర్తు చేసుకుంటుండగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నోట మాట రాకపోయినా బలవంతంగా మాటలు కూడబలుక్కుని వివరిస్తూ తలవంచుకుని ఏడ్చేశారు. పాఠశాలలో తలదాచుకుంటున్న వారు నిద్రలోనే చనిపోయారని UNRWA ప్రతినిధి క్రిస్ గన్నెస్ ఆల్ జజీరా టి.వి ఛానెల్ కు చెబుతూ దుఃఖించారు. జబాలియా…

గాజా వార్: ఐరాస స్కూళ్ళు, శిబిరాలపై దాడులు

ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and…