ఆత్మీయ ‘ఉత్తరం’ ఇప్పుడెక్కడ?

పోస్టు కార్డు, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్… ఒకప్పుడు భారత దేశ వ్యాపితంగా మనుషులను, మనసులను కలిపింది ఈ మూడే. నిత్యం లక్షలాది చేతి రాత ఉత్తరాలు రైళ్లల్లో, బస్సుల్లో తూనీగల్లా దూసుకు వెళ్ళేవి. వీధి వీధినా, సందు సందునా సైకిళ్లపై పడుతూ లేస్తూ పోయే పోస్ట్ మేన్ గారి ‘పోస్ట్’ అన్న కేకతో గడప గడపలో చురుకు పుట్టేది. ప్రయాణించేది రైళ్లలో, బస్సుల్లోనే అయినా ఉత్తరం రాశామన్న సంతృప్తి నుండి, ఉత్తరం రావాలన్న ఎదురు చూపుల వరకూ…

2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు

2011 జనాభా లెక్కల వివరాలు దశలవారీగా వెల్లడవుతున్నాయి. దేశంలో మొత్తం 24.67 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 16.78 కోట్ల కుటుంబాలు గ్రామాల్లోనూ, 7.88 కోట్ల కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నారని ఈ లెక్కల్లో వెల్లయింది. ఆమ్టే 68.03 శాతం మంది గ్రామాల్లో నివశిస్తుంటే, 31.97 శాతం మంది పట్నాల్లో నివసిస్తున్నారన్నమాట. భారత దేశానికి ఇంకా పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. భారత దేశంలో అత్యధికులకి కనీస సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని కూడా ఈ…

సెల్ ఫోన్‌తో కేన్సర్ -ప్రపంచ ఆరోగ్య సంస్ధ

ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (World Health Organisation – WHO) హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి…

ఒక్క నెలలో 32 లక్షల సెల్ ఫోన్ల అమ్మకం

  అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ఎ.డి.ఎ.జి – అడాగ్) కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఒక్క జనవరి నెలలోనే 3.2 మిలియన్ ల (32 లక్షలు) మొబైల్ ఫోన్లు అమ్మినట్లుగా శుక్రవారం తెలిపింది.  జనవరి నెలలో అమ్మిన ఫోనలతో కలిపి రిలయన్స్ కాం కంపెనీ ఇప్పటికి మొత్తం ఇండియాలో 128.9 మిలియన్ల (12.89 కోట్లు) సెల్ ఫోన్లు అమ్మినట్లుగా ఆ కంపెనీ తెలిపింది. అంటే జనవరి ఆఖరుకల్లా భారతీయుల చేతుల్లో కేవలం రిలయన్స్ కంపెనీ…