కాంగ్రెస్ ఎం.పిల గైర్హాజరుతో లోక్పాల్ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి
కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు గణనీయ సంఖ్యలో పార్లమెంటుకు హాజరు కాకపోవడంతో లోక్ పాల్ బిల్లుకి రాజ్యాంగ హోదా కల్పించే ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ ఓటమికి గురయింది. గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యుల జాబితా ఇవ్వాలని సోనియా గాంధి కోరడంతో గైర్హాజరైన సభ్యులపై కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. మూజు వాణీ ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు బుధవారం రాజ్య సభలో ఓటింగ్ కి రానున్న నేపధ్యంలో రాజ్యసభలో మెజారిటీ సంపాదించడానికి…