కాంగ్రెస్ ఎం.పిల గైర్హాజరుతో లోక్‌పాల్ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి

కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు గణనీయ సంఖ్యలో పార్లమెంటుకు హాజరు కాకపోవడంతో లోక్ పాల్ బిల్లుకి రాజ్యాంగ హోదా కల్పించే ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ ఓటమికి గురయింది. గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యుల జాబితా ఇవ్వాలని సోనియా గాంధి కోరడంతో గైర్హాజరైన సభ్యులపై కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. మూజు వాణీ ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు బుధవారం రాజ్య సభలో ఓటింగ్ కి రానున్న నేపధ్యంలో రాజ్యసభలో మెజారిటీ సంపాదించడానికి…

ఇంగ్లండులో భారతీయ విద్యార్ధి హత్య, రేసిజమే కారణం?

విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా, లేదా అని చెప్పడానికి వారు…

బూతు బొమ్మలు, మత సంస్ధలు

(గమనిక: గురు గోల్వాల్కర్ వ్యక్తం చేసిన భావాలపైన నేను రాసిన పోస్టుకి ఇది మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్య. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడినందున పోస్టుగా మలిచాను. చర్చలో పాల్గొనవలసిందిగా ఇతర మిత్రులను ఆహ్వానిస్తున్నాను. ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మలని కేవలం బూతు బొమ్మలుగానూ, ఆడవాళ్ళని చెత్తగా చూపించడంగానూ ప్రవీణ్ పేర్కొన్నాడు. కళాకారులు చాలామంది అలా భావించరు. అలాగే మత విశ్వాసాలు గాయపడ్డాయని భావించబడినప్పుడు వివిధ మతస్ధులలో వచ్చిన ప్రతిస్పందనలలో తేడాలను ప్రవీణ్ ప్రస్తావించాడు. ఈ తేడాల ద్వారా…

నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి…

సామాజిక గెంటివేత -వీధి శిల్పకళ(?) ఫొటోలు

స్వీడన్ లోని గోతెన్ బర్గ్ పట్టణంలో తీసిన ఫొటోలివి. మేగ్నస్ వాల్ స్ట్రామ్ అనే ఫొటోగ్రాఫర్ పంపిన ఫోటోలుగా ‘స్ట్రీట్ ఆర్ట్ యుటోపియా” తెలిపింది.   – –

సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక

ఏడేళ్ళ క్రితం బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలలో సంభవించిన సునామి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఇండోనేషియా ద్వీపకల్పానికి దగ్గరగా సముద్రం లోపల 9.1 రీడింగ్ తో సంభవించిన శక్తివంతమైన భూకంపంతో ఈ రెండు సముద్రాలలో సునామి ఏర్పడి మొత్తం ఏడు దేశాలలో విలయం సృష్టించించిన సంగతి విదితమే. మొత్తం రెండు లక్షల ముప్ఫై వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఈ సునామి ప్రభావం ప్రజలపై ఇంకా చూపుతుండడమే విషాధం. ఏడేళ్ళక్రితం, ఎనిమిదేళ్ళ వయసులో…

అమోఘం, అద్భుతం, అసంభవం -వీధి చిత్రం ఫొటో

మై గుడ్ నెస్! ఈ వీధి చిత్ర కళాకారుల ప్రతిభకు అంతం లేనట్లుంది. వీధి చిత్రంగా భావించడానికి కూడా అసాధ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని గీసింది మాయా క్లిల్, ఇమూమ్ కోలి అని తెలుస్తోంది. వారీ ఊరు తెలియలేదు. ఫేస్ బుక్ పేజీ ఉన్నా అందులో వివరాలు లేవు. – –

ఫేస్ బుక్, గూగుల్ తదితర ఐ.టి సంస్ధలపై ఫిర్యాదులు స్వీకరించిన భారత కోర్టులు

అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి చెందిన ఐ.టి సంస్ధలకు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, యాహూ, గూగుల్ లాంటి పందొమ్మిది ఐ.టి సంస్ధలు కోర్టునుండి నోటీసులు అందుకున్న సంస్ధల జాబితాలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రెండు కోర్టులు మతపరంగా ప్రజలను గాయపరిచేవిగా ఉన్న సమాచారాన్ని వెంటనే తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలోని ఒక కోర్టు,…

‘నితిన్ గార్గ్’ హంతకుడికి 13 సం.ల శిక్ష వేసిన ఆస్ట్రేలియా కోర్టు

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో హత్యకు గురయిన భారతీయుడు ‘నితిన్ గార్గ్’ హంతకుడికి ఆస్ట్రేలియా పదమూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో జాతి వివక్ష ఏమీ లేదని కోర్టు నిర్ధారించింది. కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగినట్లుగా కోర్టు తేల్చివేసింది. హత్య చేసే ఉద్దేశ్యం హంతకుడికి లేదనీ, అసలు తాను కత్తితో నితిన్ గార్గ్ ను పొడిచిందీ లేనిదీ కూడా హంతకుడికి తెలియదనీ, అంతా ఒక నిమిష లోపలే జరిగిపోయిందనీ కోర్టు నిర్ధారించింది. నితిన్…

‘భగవద్గీత’ పై నిషేధం, ఇస్కాన్ కార్యక్రమాల పరిమితికై రష్యన్ చర్చి ప్రయత్నాలు

రష్యాలోని సైబీరియా లో గల టామ్‌స్క్ నగరంలో ‘భగవద్గీత’ పై నిషేధం విధించడానికి కోర్టులో కేసు దాఖలు చేయడం వెనుక రష్యన్ ఆర్ధడాక్స్ చర్చి హస్తం ఉందని తెలుస్తోంది. ‘హరే కృష్ణ’ ఉద్యమం కార్యకలాపాలపైన పరిమితి విధించాలని రష్యన్ చర్చి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నదనీ, అందులో భాగంగానే ‘భగవద్గీత’ పుస్తకాన్ని నిషేధించాలంటూ కోర్టులో కేసు దాఖలయిందనీ ‘ది హిందూ’ పత్రిక వెల్లడించింది. ‘హరే కృష్ణ’ ఉద్యమం నియంతృత్వ స్వభావం గల సెక్ట్ గా చర్చి అభివర్ణించిందని ఆ…

శివసేన గూండాయిజంపై మహారాష్ట్ర ఉపాధ్యాయుల ఐక్య పోరాటం

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అక్కడ ‘సేన’ అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తమకు తామే సంస్కృతీ పరిరక్షకులుగా ప్రకటించుకుంటూ ఇరు ‘సేన’ లు, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్), స్కూళ్ళలో అక్రమాలను అరికడతాంటూ బయలుదేరి టీచర్లపై భౌతిక దాడులు చేస్తుండడంతో అవి పాఠశాలల ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారాయి. నేరాలు వారే నిర్ధారిస్తూ, శిక్షలు కూడా వారే వేస్తుండడంతో ఉపాధ్యాయులకు పరిస్ధితి దిన దిన గండంగా మారింది. దానితో సేన ల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అగత్యం…

చీప్ లిక్కర్ మృతుల కుటుంబాల్లో అంతులేని విషాధం -ఫొటోలు

పశ్చిమ బెంగాల్, సంగ్రామ్ పూర్ గ్రామంలో విషపూరితమైన చీప్ లిక్కర్ తాగి మృతి చెందినవారి సంఖ్య 167 కి పెరిగింది. మృతులందరూ రిక్షా కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజు కూలీలే. వీరి మరణంతో వీరి సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు భవిష్యత్ ఎలా అని తల్లడిల్లుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనిక రోగులు చేరే ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం,…

131 మందిని చంపేసిన చీప్ లిక్కర్

ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయి రోజులైనా గడవక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ప్రాణాంతక (ప్రమాదం లాంటి) సంఘటనే జరిగింది. చట్ట విరుద్ధంగా తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి 131 మంది జనం చనిపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సంగ్రామ్ పూర్ గ్రామం చుట్టు పక్కల జరిగిన ఈ ఘటనలో ఇంకా అనేకమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి చీప్ లిక్కర్ సేవించిగా బుధవారం తెల్లవారు ఝాము…