మంగళవారం కూడా పతనమైన భారత షేర్ మార్కెట్లు, తొలగని అనిశ్చితి

భారత షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. అమెరికా రుణ సంక్షోభం దరిమిలా ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో సోమవారం ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయీన సంగతి తెలిసిందే. మంగళవారం భారత షేర్లు విపరీతమయిన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. దాదాపు 1600 పాయింట్ల మేరకు గత ఐదు రోజులుగా ఉత్ధాన పతనాలకు గురైన భారత షేర్లు ప్రారంభంలో సోమవారం నాటి ధోరణిని కొనసాగిస్తూ భారిగా పతనమైన సూచిలు మధ్యాహ్నానికి కోలుకుని లాభాల బాట…

ఎన్ని ఆశల పతనానికీ, ఎవరి సుఖ భోగాలకీ మార్కెట్ల పతనం?

అమెరికా షేర్ మార్కెట్లు సోమవారం నాడు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన షేర్ సూచిలు దారుణంగా పతనం అయ్యాయి. అమెరికా రుణ పరిమితి పెంపుదల కోసం, బడ్జెట్ లోటు తగ్గింపు కొసం రిపబ్లికన్లు, డెమొక్రట్ల మధ్య గత శుక్రవారం కుదిరిన ఒప్పందం అమెరికా రుణ సంక్షోభాన్ని ఏమాత్రం శాంతపరచబోదని మదుపుదారులు భావించడంతో మదుపుదారులు ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాలకు పరుగులెత్తారు. అమెరికా షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికీ లోనై అత్యధిక స్ధాయిలో పతనం అయ్యాయి. పై…

తగలబడుతున్న కాగితం డబ్బు, రెక్కలిప్పిన బంగారం ధర -కార్టూన్

అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా రుణ సంక్షోభం…

అమెరికా రేటింగ్ తగ్గింపుతో నిలువునా కూలుతున్న అమెరికా, యూరప్ షేర్ మార్కెట్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో ప్రపంచంలోని అన్ని దేశాల షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. జపాన్‌ని భూకంపం, సునామీలు తాకిన రీతిలో ఎస్&పి అమెరికా రేటింగ్ తగ్గింపు, ప్రపంచ షేర్ మార్కెట్లను తాకింది. సోమవారం ఇండియా షేర్ మార్కెట్లను దాదాపు రెండు శాతం పైగా లోయలోకి తోసేసిన ఈ పరిణామం యూరప్ షేర్ మార్కెట్లను రెండు నుండి నాలుగు శాతం వరకూ పతనం చేసింది. ఇక అమెరికా షేర్ మార్కెట్లు సైతం రెండున్నర నుండి మూడున్నర శాతం…

కుప్ప కూలిన షేర్ మార్కెట్లు, వణికిస్తున్న అమెరికా, యూరప్ సంక్షోభాలు

శుక్రవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 383.31 పాయింట్లు (2.19 శాతం) నష్టపోయి 17305.87 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి 120.55 పాయింట్లు (2.26 శాతం) నష్టపోయి 5211.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ మానసిక స్ధాయి17000 పాయింట్లకు తక్కువగా 16990.91 వరకూ పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ కూడా ఓ దశలో 5200 పాయింట్లకు తక్కువగా 5116.45 వరకూ పడిపోయి అనంతరం కోలుకుంది. అమెరికా రుణ సంక్షోభం, యూరప్ సావరిన్ అప్పు…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…

కొనసా……..గుతున్న షేర్ల పతనం

ఈ వారం మూడవ రోజు కూడా బారత షేర్లు పతన బాటలో కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రధాన షేర్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టాలు చవిచూశాయి. అమెరికా రుణ పరిమితి పెంపు పైనా, బడ్జెట్ లోటు తగ్గింపు పైనా అక్కడి చట్ట సభలు, వైట్ హౌస్ లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ మార్కెట్లు లేదా మదుపుదారులు సంతృప్తి చెందలేదు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు లకు సంబంధించిన చర్చలు సుదీర్ఘ కాలంపాటు…

కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…

మారిషస్, ఐ.టి రేటింగ్ లతో నాలుగు నెలల కనిష్ట స్ధాయికి చేరిన ఇండియా షేర్ మార్కెట్లు

సోమవారం ఇండియా షేర్ మార్కెట్లు రెండు శాతం పైగా పతనమైనాయి. మారిషస్‌తొ పన్నుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సమీక్షనున్నదన్న భయాలు, ఇండియా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రేటింగ్‌ని తగ్గించడం షేర్ల పతనానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని కూడా వీరు భావిస్తున్నారు. సోమవారం పతనంతో భారత్ షేర్ మార్కెట్లు కొన్నాళ్ళపాటు కోలుకోవడం కష్టమనీ, సెంటిమెంట్ బలహీనపడ్డం వలన మరింత పతనం చవిచూడనున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు సోమవారం నాటి భారీ పతనాన్ని…

షేర్ మార్కెట్లకు ఈ వారం కూడా నష్టాలే!

ఈ వారం షేర్ మార్కెట్లూ నష్టాల్లోనే… భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 మాత్రమే (ఏప్రిల్ 2010 లో ఇది 13.1 శాతం) పెరుగుదలను నమోదు చేయడంతో శుక్రవారం షేర్ మార్కెట్లు నష్టాల్ని చవి చూశాయి. వారం మొత్తం చూసినా షేర్లు నస్టాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 116.36 పాయింట్లు (0.63 శాతం) 18,268.54 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 35.25 పాయింట్లు (0.64 శాతం) 5,485.8 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…

యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్‌మార్కెట్లు

యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…

వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయిన ఇండియా షేర్ మార్కెట్

భారత ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాలను చవి చూశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచడం, వడ్డీ రేట్ల పెంపుదల లాభాల తగ్గుదలకు దారీతీస్తుందన్న భయాలూ, వీటితో పాటు ఆయిల ధరలు అన్నీ కలిసి ఇండియా మార్కెట్లలొ షేర్ల అమ్మకాల వత్తిడి పెరగడానికి దారి తీశాయి. ద్రవ్య సంస్ధలు, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్యపోయాయి. ఎయిర్ టెల్ షేరు 3.2 శాతం నష్టపోయింది. ఎయిర్ టెల్ కి చెందిన…

ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…