హోం మంత్రి చిదంబరం కు ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వనున్న బి.జె.పి

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. లాయరు వృత్తిలో ఉన్నపుడు తన క్లయింటు పై దాఖలైన ఒక హోటల్ యజమానిపైన ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఎత్తివేయాలని చిదంబరం సిఫారసు చేసాడని వెల్లడి కావడంతో చిదంబరం పై విచారణ జరపాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్య సభల్లో ప్రతిపక్షాలు ఒక పక్క ఆందోళన చేస్తుండగా చిదంబరం ఆ…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో శోక సంద్రంలో ఉ.కొరియా ప్రజలు -ఫొటోలు

ఉత్తర కొరియాను పోలీసు రాజ్యంగా పశ్చిమ దేశాలు, అక్కడి పత్రికలు అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియాను ‘కిమ్ జోంగ్-ఇల్’ ఉక్కు గోడల మధ్య పాలిస్తున్నాడనీ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడనీ ఆరోపిస్తాయి. ప్రజలను కఠినంగా అణిచివేస్తాడని ఆడిపోసుకుంటాయి. కాని కిమ్ మరణంతో ఉత్తర కొరియా ప్రజానికం మూకుమ్మడిగా విలపిస్తున్న దృశ్యాలు ఆ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతున్నాయి. – –

చైనాకి భయాన్ని మిగిల్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడి మరణం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ మరణం చైనాకు ఒకింత భయాన్ని మిగిల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్-ఇల్ మరణంతో తాము ‘ఆందోళనకూ, అసౌకర్యానికీ’ గురయినట్లుగా చైనా ప్రభుత్వం తెలిపింది. దీనిని నిజానికి ‘షాక్ కి గురయ్యామని’ చైనా చెప్పినట్లుగా భావించవచ్చని రాయిటర్స్ భాష్యం చెప్పింది. కొరియా ప్రాంతంలో చైనా ప్రభావానికి ఉత్తర కొరియా వాహకంగా ఉంటూ వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ ఎంతగా చైనాను విసిగించినప్పటికీ, చైనా ఎంత విసిగినప్పటికీ ఆసియాలో, ఆ…

ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణం, అప్రమత్తతలో పశ్చిమ దేశాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రభుత్వం సోమవారం ప్రకటించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అరవై తొమ్మిదేళ్ళ కిమ్ జోంగ్-ఇల్ శనివారమే మరణించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ‘ఫీల్డ్ గైడెన్స్’ ఇస్తుండగా అదనపు శారీరక, మానసిక శ్రమ వలన అలసటకు గురవడంతో కిమ్ మరణించాడని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు మరణించడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న ఉత్తర…

ఫోన్లు, ఈ-మెయిళ్ళు ట్యాప్ చెయ్యడానికి అనుమతి పొందిన ‘రా’

పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఉన్నట్లే, ఇండియాకి కూడా ఓ గూఢచార సంస్ధ ఉంది. దాని పేరు ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’. దీన్ని సంక్షిప్తంగా ఆర్.ఎ.డబ్ల్యు లేదా ‘రా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా పాకిస్ధాన్, చైనా విషయాల్లో చురుకుగా పని చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు భారతీయులు చేసే ఫోన్ కాల్స్, ఈ-మెయిళ్ళు, ఇంకా ఇతరేతర డేటా కమ్యూనికేషన్లు అన్నింటినీ దొంగచాటుగా వినే అధికారం చట్టపరంగా దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం…

బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి

విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలన్న డిమాండ్ తో బాబా రాందేవ్ ప్రారంభించిన నిరాహార దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి చేసిన దాడికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం బాధ్యుడని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ నిర్ధారించాడు. రాందేవ్ నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్న వార్తలు పత్రికలలో రావడంతో సుప్రీం కోర్టు తనంతట తానే ఈ కేసును చేపట్టింది. అనంతరం కేసు విచారణలో తనకు సాయపడాలని కోరుతూ సుప్రీం కోర్టు, సీనియర్…

‘పాపులిస్టు ముసుగు’ చించుకుని బైటికి వచ్చిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని బైట పెట్టుకున్నాడు. తాను ఇస్తున్న పాపులిస్టు నినాదాలు నిజానికి తన ముసుగు మాత్రమేననీ, వాస్తవంలో తన ఆలోచనలు ప్రజానుకూలం కాదని రుజువు చేసుకున్నాడు. దాదాపు నాలుగు కోట్ల కుటుంబాలను రోడ్లపాలు చేసే ‘రిటైల్ రంగంలో విదేశీ సూపర్ మార్కెట్ల’ నిర్ణయానికి బహిరంగంగా తన మద్దతు తెలిపాడు. రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే రైతులకే లాభం అని నచ్చ జెప్పడానికి కూడా సిద్ధపడ్దాడు. బహిరంగంగా ప్రజలకు అబద్ధాలు చెప్పే రాజకీయ…

చైనా, ఇండియాపై దాడి చేస్తుందని ప్రభుత్వం భావించడం లేదు -ప్రధాని

భారత దేశంపై దాడి చేయడానికి చైనా పధకం వేస్తోందన్న వాదనను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చెప్పాడు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఇరు దేశాల అభిప్రాయం అని ఆయన అన్నాడు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఇండియా, చైనా సరిహద్దులు మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నాయని లోక్ సభ సభ్యులకు తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది. “చైనా, ఇండియాపై దాడి చేయడానికి పధకం వేస్తోందన్న భావనను ఇండియా అంగీకరించడం లేదు” అని…

హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే

హిందూ మహా సముద్రంలో మొట్టమొదటి మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. విదేశాలలో తన మొదటి మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చైనా సోమవారం ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఉన్న ‘సీ షెల్స్’ దేశంలో తన నౌకా దళాలకు మధ్యంతర సరఫరాల కోసం మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. ‘సీ షెల్స్’ లో ఉన్న హార్మర్లలో తగిన దాన్ని ఎంచుకుని అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తానని చైనా అధికారులు తెలిపారు.…

రష్యా ఎన్నికల నిరసనల వెనుక అమెరికా హస్తం -పుతిన్

రష్యాలో ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా అక్కడ తలెత్తిన నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా ప్రధాని వ్లాదిమిరి పుతిన్ విమర్శించాడు. అమెరికా విదేశాంగ మంత్రి రష్యాలో కొద్దిమంది ప్రతిపక్ష కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చిందని పుతిన్ విమర్శించాడు. “ఆమె వారికి ఓ సిగ్నల్ ఇచ్చింది. వారు ఆ సిగ్నల్ విన్నారు. విని తమ పనిని ప్రారంభించారు” అని పుతిన్ విమర్శించాడు. రష్యా ఎన్నికలు సక్రమంగా జరగలేదని అంతర్జాతీయ పరిశీలకులు, రష్యా ప్రతిపక్ష పార్టీలు…

పాకిస్ధాన్ లో నిశ్శబ్ద (సైనిక) కుట్ర?

పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ గుండె నొప్పి తో దుబాయ్ ఆసుపత్రిలో చేరడంతో పాకిస్ధాన్ లో నిశ్శబ్ద కుట్ర జరుగుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘మెమో గేట్’ కుంభకోణం దరిమిలా పౌర ప్రభుత్వానికీ, సైన్యానికి మధ్య విభేధాలు తీవ్రమైనాయన్న వార్తల నేపధ్యంలో తాజా కుట్ర వార్తలు బలం సంపాదించుకున్నాయి. సైన్యం ఒత్తిడి మేరకు పదవి నుండి రాజీనామా చేయడం కోసమే దుబాయ్ ఆసుపత్రిలో జర్దారీ చేరాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జర్దారీ ప్రతినిధులు మాత్రం కుట్ర…

కోదండరాం నోట ‘2014’ పాట

టి.ఆర్.ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యిందని కోదండరాం గాని ప్రకటన ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అంతేకాదు. కోదండరాం గారు టి.ఆర్.ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ప్రకటన స్పష్టం చేసింది. “2014 సంవత్సరం లోపల తెలంగాణ సాధించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని ప్రొఫెసర్ కోదండరాం గారు మంగళవారం ప్రకటించారు. ఆయన ఇంటెగ్రిటీ పట్ల ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నవారికి ఈ ప్రకటన కళ్ళు తెరిపించినట్లయ్యింది. ‘2014 లోపల తెలంగాణ సాధిద్దాం’ అని…

సిరియా పై అమెరికా ఆశ, అడ్డుపడుతున్న రష్యా -కార్టూన్

– లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.

రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ కి ఎదురుదెబ్బ, సాధారణ మెజారిటీతో సరిపుచ్చిన ఓటర్లు

గత దశాబ్దం పైగా రష్యాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్ కు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఎదురు లేకుండా తమకు అవసరమైన ‘రాజ్యాంగం సవరణలు’ చేసుకుంటూ పాలించిన పుతిన్ పార్టీకి ఈసారి రష్యా ప్రజలు కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే కట్టబెట్టారు. అంటే ఇక పుతిన్ పార్టీ ‘రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునే’ వెసులుబాటును కోల్పోయిందన్నమాట. రాజ్యాంగానికి ఏమన్నా మార్పులు చేయదలుచుకుంటే ఇతర పార్టీలపై ఆధారపడవలసిందే.…