ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు,…

‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార ప్రకటనను రూపొందించింది బ్రిటన్ కంపెనీయేనని తెలియడంతో అసలు ఒలింపిక్స్ ని రాజకీయం చేస్తున్నది అర్జెంటీనా దేశమా లేక బ్రిటన్ దేశమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ కి వేల మైళ్ళ దూరంలో దూరంలోనూ,…

ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…

టెర్రరిజం సాకుతో ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేస్తున్నారు -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారనీ, ఆఫ్ఘన్ జాతీయులను తమ జైళ్ళలో అక్రమంగా నిర్భంధిస్తున్నారనీ అమెరికా తో పాటు దాని మిత్ర దేశాలు కూడా యధేచ్ఛగా దుర్మార్గాలు సాగిస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించాడు. 2014 తర్వాత కూడా మరో…

అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందే దాడులు చేస్తాం–రష్యా

యూరోప్ లో అమెరికా నెలకొల్పుతున్న మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందుగానే (pre-emptive) దాడులు చేయడానికి వెనకాడబోమని రష్యా మిలట్రీ అధికారులు హెచ్చరించారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న వివాదాస్పద ‘మిసైల్ షీల్డ్’ విషయంలో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో తమ ఖండాతర క్షిపణులు కాపాడుకోవడానికి, రష్యా ప్రయోజనాలు భంగం కలగకుండా ఉండడానికి ‘ప్రీ-ఎంప్ టివ్’ దాడులు తప్ప తమకు మరో మార్గం లేదని వారు అన్నారు. అయితే అమెరికా మిసైల్ షీల్డ్ కి రష్యా…

క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…

క్లుప్తంగా… 29.04.2012

జాతీయం ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన…

అమెరికా డ్రోన్ దాడుల్లో 2,800 పాక్ పౌరుల మరణం

గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు. “ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్”…

టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి త్వరగా వెళ్ళిపోండి -అధ్యక్షుడు కర్జాయ్

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులు త్వరగా వెళ్లిపోవడం మంచిదని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కోరాడు. అమెరికా సైన్యం ఎంత త్వరగా దేశం నుండి వెళ్ళిపోయి రక్షణ బాధ్యతలు ఆఫ్ఘన్లకు అప్పగిస్తే అంత మంచిదనీ, అమెరికా సైనికుల వల్ల ఆఫ్ఘన్లకు కలుగుతున్న అవమానాలు అంతం కావాలంటే అదే ఉత్తమ మార్గమనీ గురువారం ప్రకటించాడు. తాలిబాన్ మిలిటెంట్ల మృత శరీరాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలు పరమ చీదరగా, అసహ్యంగా ఉన్నాయనీ వ్యాఖ్యానించాడు. “ఇటువంటి బాధాకరమైన అనుభవాలు అంతం కావాలంటే…

ఆఫ్ఘన్ల శరీర భాగాలతో ఫోటోలు దిగిన అమెరికా సైనికులు

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికా సైనికుల నీచ ప్రవర్తనకి హద్దు లేకుండా పోతోంది. దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆత్మాహుతి బాంబర్ల విడి శరీర భాగాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలను ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక ప్రచురించింది. ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వర్తించిన సైనికుడే తమకు ఆ ఫోటోలు అందించచాడని ఆ పత్రిక తెలిపింది. ఫోటోలు ప్రచురించవద్దని అమెరికా మిలట్రీ కోరినప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల ప్రవర్తన ఎలా ఉన్నదీ అమెరికా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో…

పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్

అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ…

అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

ప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు…