‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!

కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో జరుగుతున్న కుల దురాచారంలో ఇక ఎంగిలాకులను ఉపయోగించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుండి ‘ఎవరూ ఆరగించని’ ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టి ఆరుబయట పరిస్తే ఆచారం పాటించదలిచినవారు వాటిపై పడి దొర్లొచ్చు. సుబ్రమణ్య ఆలయంలో కులాధిపత్య దురాచారాన్ని అడ్డుకోవాలని ఆలయంలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాన్ని ఆరగించే సౌకర్యాన్ని రద్దు చేయాలనీ హై కోర్టులో దాఖలయిన ఫిర్యాదుకు ఈ విధంగా పరిష్కారం లభించింది. పిటిషనర్లు కూడా సవరించిన దురాచారానికి ఆమోదం చెప్పడంతో వివాదాన్ని…

ఎంగిలాకులపై దొర్లే ‘మాదె స్నాన’ దళితులకే పరిమితమైన ఆచారం -ఫొటోలు

దక్షిణ కర్ణాటకలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఎంగిలాకులపై దొర్లే ఆచారంలో బ్రాహ్మణులు కూడా పాటిస్తారని ‘ది హిందూ’ పత్రిక రాసిన దానిలో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ఆచారం “మోలె కుడియా” అన్న గిరిజన తెగకు చెందినవారే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కుక్కె సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రభుత్వం అనుమతించింది. దీన్ని రద్దు చేయాలని కొన్ని సంవత్సరాలుగా దళిత, బి.సి సంఘాలు ఆందోళన…

కుల దురాచారంపై ఫిర్యాదు చేసిన బి.సి నాయకుడ్ని చితకబాదిన అగ్ర కులస్ధులు

కర్ణాటకలో కుక్కె సుబ్రమణ్య దేవాలయంలో ఇప్పటికీ అమలులో ఉన్న కుల దురాచారానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బి.సిల నాయకుడిని చావబాదిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ ఆయనకు చావు దెబ్బలు తప్పలేదు. ఆయన చేసిన పాపమల్లా ‘మాదె స్నాన’ అన్న పేరుతో సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న దురాచారాన్ని ఆపాలని కోరడమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుబ్రమణ్య గుడి మంగుళూరు దగ్గరలో ఉన్న సుల్యా తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల…