ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు

ఛత్తీస్ ఘర్ పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ ల హత్యకు సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ క్షమాపణ చెప్పింది. తండ్రి కొడుకుల హత్య ద్వారా తమ కామ్రేడ్స్ భారీ తప్పిదం చేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నూతన కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తమకు తెలియదని కానీ ఏడు పేజీల ఇంటర్వ్యూ తమకు చేరిందని పత్రిక…

సుక్మా అడవుల్లో భారీ క్యాంపు ఎత్తివేసిన పోలీసులు

మావోయిస్టుల దాడి ఫలితంగా అడవుల్లోని తమ భారీ శిబిరాన్ని పోలీసులు ఎత్తివేసుకున్నారని ది హిందు తెలిపింది. దాడి జరిగిన 72 గంటల లోపే వ్యాహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా పోలీసులు చెప్పుకున్న శిబిరాన్ని ఎత్తివేయడం అడవుల్లోని పరిస్ధితికి ఒక సూచన కావచ్చు. పత్రిక ప్రకారం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతం లోపల ‘మినప’ లో పోలీసులు 15 రోజుల క్రితమే భారీ శిబిరాన్ని నెలకొల్పారు. మరో భారీ దాడి ఎదురవుతుందన్న భయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన రెండు…

అమాయకులు కాదు, కాంగీ నాయకులే లక్ష్యం -మావోయిస్టులు

మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి…

నిర్బంధానికి ఆహ్వానం (ఛత్తీస్ ఘర్ మావోయిస్టుల దాడి పై ‘ది హిందు’ సంపాదకీయం)

ఛత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్ లతో సహా 24 మందిని దారుణంగా చంపడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎదుర్కోనున్న విపరిణామాలతో సంబంధం లేకుండా బస్తర్ లో ఘర్షణను విస్తరించడానికి తమ సంసిద్ధతను చాటుకున్నారు. 2005లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో స్ధానిక పోలీసులు ప్రారంభించిన హింసాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ‘సల్వా జుడుం’ ఉద్యమానికి బహిరంగ…