ఇరాన్ పుణ్యం, సిరియా సమస్యలో ఇండియా మాటకు విలువ!

సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో ఇండియా మాట చెల్లుబాటు అయ్యేందుకు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అలీన దేశాల కూటమి ‘అలీనోద్యమం’ (Non-Aligned Movement) నాయకురాలుగా ఇరాన్ గత యేడు బాధ్యత తీసుకున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల ప్రాభవానికి ప్రత్యామ్నాయ శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇరాన్ ప్రారంభించింది. ఈ కృషిలో ఇండియాను భాగస్వామిగా స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

ఇ-బ్రిక్స్ మా కల -ఈజిప్టు అధ్యక్షుడు

ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి…

మావో మూడు ప్రపంచాలు -ఈనాడు ఆర్టికల్ 5వ భాగం

ఈ రోజు ఈనాడు చదువు పేజిలో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ ఐదవ భాగం వచ్చింది. ఇందులో మధ్య ప్రాచ్యం, బ్రిక్స్, బేసిక్, మూడు ప్రపంచాల సిద్ధాంతం తదితర అంశాలను చర్చించబడింది. ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్  క్లిక్ చేస్తే ఆ పేజికి వెళ్లొచ్చు. కింద బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చదివచ్చు.

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

మా దేశంలో రక్తపాతానికి టర్కీ ఆపాలజీ చెప్పిందా? -సిరియా

టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…

సిరియా విషయంలో అమెరికా హెచ్చరికను తిరస్కరించిన చైనా

సిరియా విషయంలో రష్యా, చైనా లు తగిన మూల్యం చెల్లించక తప్పదన్న అమెరికా హెచ్చరికను చైనా తిరస్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విమర్శ తమకు ఆమోదయోగ్యం కాదని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియు వీమిన్ శనివారం ప్రకటించాడు. “సిరియా సమస్యల పరిష్కారాన్ని తాము అడ్డుకోవడం లేదని” లియు విలేఖరుల సమావేశంలో అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. జులై 6 తేదీన పారిస్ లో జరిగిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ రష్యా’ దేశాల సమావేశాల…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా

సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి…

గడ్డాఫీని చంపడం చట్టబద్ధమేనట! అందుకు లిబియన్లు కోపగించుకుంటే చట్ట విరుద్ధమట!!

గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. బ్రిటన్ లోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…