లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది?
లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది….. … … … నిజం
లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది….. … … … నిజం
లిబియా తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) ను అధికారిక ప్రభుత్వంగా గుర్తించడానికి అమెరీక నిరాకరించింది. రెబెల్ కౌన్సిల్లోని సీనియర్ సభ్యుడొకరు అమెరికా గుర్తింపు పొందడానికి అధ్యక్ష భవనంలొ చర్చలకు హాజరయ్యాడు. రెబెల్ కౌన్సిల్ కోరికను అధ్యక్ష భవనం తిరస్కరించింది. మరో వైపు శుక్రవారం రాత్రి నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో బ్రెగా పట్టణంలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిపే నిమిత్తం వచ్చి ఉన్న 11…
సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి…
నిరాయుధుడుగా ఉన్న లాడెన్ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని…
లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది.…
సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…
లిబియా పౌరుల రక్షణే తమ ధ్యేయమనీ, వారిని రక్షించండి అని ఆదేశించిన సమితి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడమే తమ కర్తవ్యమనీ నాటో ఆధ్వర్యంలో లిబియాపై బాంబులు మిస్సైళ్ళుతో దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు చెబుతున్నాయి. గడ్డాఫీ ఇంటిపై బాంబులేసి అతన్ని చంపాలని ప్రయత్నించినా, అతని కొడుకూ, ముగ్గురు మనవళ్ళను చంపినా, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులను నాశనం చేసినా, చివరికి లిబియా పౌరులే చనిపోయినా అవన్నీ అంతిమంగా లిబియా పౌరుల రక్షణకోసమే నని ఆ…
లిబియా ప్రజలను రక్షించే పేరుతో విచక్షణారహితంగా లిబియాపై వైమానికి దాడులు చేస్తున్న నాటో దళాలు మంగళవారం మరోసారి గడ్డాఫీ నివాస కాంపౌండ్పై పలు క్షిపణులతో దాడి చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించింది. ఏప్రిల్ 30 తేదీన నాటో బాంబు దాడుల్లో గడ్డాఫీ చివరి కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయాక గడ్డాఫీ బహిరంగంగా ఇంతవరకు కనపడలేదు. క్షిపణి దాడుల వలన అద్దాలు పగిలి చెల్లాచెదురు కావడంతో అవి తగిలి నలుగురు పిల్లలు…
పాకిస్ధాన్లోని అబ్బోత్తాబాద్ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…
లిబియాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటాలో నాటో విమానాలు గడ్డాఫీ బలగాలపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే గడ్డాఫీ బలగాలు అనుసరిస్తున్న గెరిల్లా ఎత్తుగడల వలన నాటో వైమానిక దాడులు పెద్దగా ఫలితాలను సాధించలేక పోతున్నాయి. కాల్పులు జరిపి చెట్ల కిందో, భవనాల మధ్యనో దాక్కుంటూ గడ్దాఫీ బలగాల ట్యాంకులు తదితర యుద్ద ఆయుధాలు పని చేస్తుండడంతో వాటిపై బాంబు దాడులు చేసి నాశనం చేయడం నాటో దళాలకు కష్ట సాధ్యంగా మారింది.…
లాడెన్ పాకిస్ధాన్లోని తన స్ధావరంలో ఉండగా తీసిన వీడియో అని చెబుతూ 66 సెకన్ల వీడియో ని అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 66 సెకన్ల నిడివిలో లాడెన్గా చెప్పబడుతున్న వ్యక్తి కనిపీంచేది 12 సెకన్లు మాత్రమే. మిగిలిన భాగమంతా పాత వీడియోల అతుకులు. మంచం మీద కూర్చున్నట్లు కనిపిస్తున్న లాడెన్ వీపు ఒక పక్కనుండి కనిపిస్తోంది. మొఖంలో సగం కంటే తక్కువ భాగం కనిపిస్తోంది.లాడెన్ అని గుర్తించడానికి అనువుగా వీడియో లేదు. లాడెన్ అని…
కాందహార్లో తాలిబాన్ల దాడి రెండో రోజూ కొనసాగుతోంది.14 మంది తాలిబాన్లను చంపినట్లు ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. చనిపోయిన తాలిబాన్లలో కొద్దిమంది పాకిస్తానీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. దాడి ఒసామా హత్యకు ప్రతీకరంగా చెప్పడాన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు. దాడీ ముందే వేసుకున్న పధకం ప్రకారం జరిగిందని తాలిబాన్ చెప్పినట్లుగా బిబిసి తెలిపీంది. ఇద్దరు భద్రతాధికారులు, ముగ్గురు పౌరులు, శనివారం తాలిబాన్లు ఆత్మాహుతి బాంబులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. అప్పటినుండీ కాల్పులు కొనసాగుతున్నాయి. మే…
ఒసామా బిన్ లాడెన్ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…
గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. బ్రిటన్ లోని…
గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…