ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

తెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. అదిలా ఉంది: మనకు నిత్యం అంతర్జాతీయ వార్తలను ఎర్ర కళ్ళద్దాలతో వీక్షించి వండి వార్చే బ్లాగొకటి ఉంది. అఫ్ కోర్స్, అదేం తప్పు కాదనుకోండి, ప్రతి ఒక్కరం ఒక వార్తని ఏదో ఒక దృక్కోణములోనుంచే…

స్ట్రాస్ కాన్ రేప్ కేసు మెడికల్ రిపోర్టు లీక్, కాన్‌పై బలపడిన అనుమానాలు

ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఒక హోటల్ మెయిడ్ ని రేప్ చేసినట్లు ఆరోఫణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన మహిళ “నఫిస్సాటౌ దియల్లో (32 సం.లు) న్యూయార్క్ మన్‌హట్టన్ లోని ఒక హోటల్ లో మెయిడ్ గా పనిచేస్తోంది. అప్పటి ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ అదే హోటల్‌లోని లగ్జరీ సూట్ లో దిగాడు. ఆ సందర్భంగా కాన్ సూట్ ని…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసిన ఫ్రాన్సు, రష్యా నిరసన

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడిచినట్లుగా ఫ్రాన్సు సైన్యాధికారులు తెలిపారు. బెర్బెర్ తెగల ఫైటర్లకు లిబియా రాజధాని ట్రిపోలికి నైరుతి మూల ఉన్న కొండల్లో ఆయుధాలను జారవిడిచినట్లు ఫ్రాన్సు మిలట్రీ తెలిపింది. ఏప్రిల్ చివరినుండి జూన్ ప్రారంభంవరకూ తిరుగుబాటుదారులకు ఈ విధంగా ఆయుధాలను అందించామని వారు తెలిపారు. ఐతే ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం లిబియా యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకు ఆయుధాలు అందించడాన్ని నిషేధించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల అధికారులే స్వయంగా లిబియాలోని ఇరు…

మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్

“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…

నాటో “డ్రోన్ హెలికాప్టర్” ను కూల్చివేసిన లిబియా సైన్యం

మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం…

నాటో బాంబు దాడుల్లో మరో 15 మంది లిబియా పౌరుల మరణం

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో చేసినట్లుగానే నాటో ఆధ్వర్యంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరుల హత్యాకాండను కొనసాగిస్తున్నాయి. ఆదివారం బాంబుదాడిలో ఐదుగురు పౌరులని చంపేసి ‘సారీ’ చెప్పిన నాటో సోమవారం తెల్లవారు ఝాము దాడిలో మరో 15 మంది పౌరుల్ని రాకెట్లు పేల్చి చంపేసింది. “సోమవారం, జూన్ 20 తెల్లవారు ఝామున నాటో యుద్ధ విమానాలు సొర్మాన్ లో గడ్డాఫీ ప్రభుత్వానికి చెందిన ఓ కీలకమైన కమాండ్ అండ్ కంట్రొల్ సెంటర్ పై సరిగ్గా గురి చూసి…

లిబియాపై నాటో బాంబు దాడిలో ఓ కుటుంబంతో సహా ఐదుగురు పౌరుల మరణం

గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2

సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…

తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది…

అమెరికా, ఇరాన్… పశ్చిమాసియాలో గెలుపెవరిది?

పశ్చిమాసియాలో అరబ్ విప్లవాల నేపధ్యంలో ప్రత్యక్షంగా కనపడని పరోక్ష యుద్ధం ఒకటి సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరో వైపు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పరోక్ష యుద్ధంలో గెలవడానికి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుంటే ఇరాన్ మాత్రం నింపాదిగా జరిగేది చూస్తూ ఉంది. ఇరాన్ విరోధులు ఇరాన్ ప్రమేయం లేకుండానే ప్రజల తిరుగుబాట్లలో నేలకొరుగుతుంటే ఇరాన్ చేయవలసిందేముంటుంది గనక? ఈజిప్టులో ముబారక్ శకం ముగిసింది. ఇరాన్ విరోధి సౌదీ అరేబియా మిత్రులు బహ్రెయిన్, యెమెన్ లు…

పాక్ సైన్యం నిజ స్వరూపం బట్టబయలు, డ్రోన్ దాడులకు పూర్తి మద్దతు

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్దం చేస్తున్న అమెరికా సైన్యం పాకిస్ధాన్ భూభాగంలో తలదాచుకుంటున్న తాలిబాన్ మిలిటెంట్లను అంతమొందించడానికి మానవ రహిత డ్రోన్ విమానాలను అధిక సంఖ్యలో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రోన్ దాడులు పాకిస్ధాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమేనని, కనుక వాటిని మేము అనుమతించబోమనీ పాకిస్ధాన్ సైన్యంతో పాటు, పాక్ ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తాయి. అయితే వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్స్ కేబుల్స్ ద్వారా వెల్లడైన సమాచారం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం ఇప్పుడు తాజా…

ఇజ్రాయెల్ ఉక్కుపాదాన్ని గేలి చేస్తూ పాలస్తీనీయుల స్వాతంత్ర్య పిపాస -వీడియోలు

అమెరికా, ఇంగ్లండుల అండతో పాలస్తీనా భూభాగాన్ని చెరబట్టిన ఇజ్రాయెల్ ఆక్రమణని నిరసిస్తూ, 63 ఏళ పాశవిక నిర్బంధాన్నీ, పశు ప్రవృత్తితో సమానమైన ‘యూదు జాత్యహంకారాన్ని’ ఎదిరిస్తూ వేల మంది పాలస్తీనీయులు మే 15 తేదీన ఇజ్రాయెల్ లోని జాఫా పట్టణంలో ఉద్రిక్తల నడుమ నక్బా (వినాశన దినం – పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు) ని పాటించారు. రోమాంఛితమైన ఆ ఘటనను చిత్రించినప్పటి వీడియోలే ఇవి. ప్రదర్శనలో పాల్గొన్న ఓ కార్యకర్త ఒమర్ సిక్సిక్ ప్రకటన:…