మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…

అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు -రష్యా

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపు ఇవ్వడాన్ని రష్యా తిరస్కరించింది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. బుధవారం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్, ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. 2003లో అణ్వాయుధాలు నిర్మించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లుగా ఐ.ఎ.ఇ.ఎ ఇటీవల తన నివేదికలో పేర్కొనడాన్ని చూపిస్తూ విలియం హేగ్, ఈ డిమాండ్ చేశాడు. రష్యా తిరస్కరణతో ఇరాన్ పై ఆంక్షలు…

ఇజ్రాయెల్ వెబ్‌సైట్లపై ‘ఎనోనిమస్’ సైబర్ దాడులు, నిరాకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఆర్మీ లతో పాటు వివిధ ప్రభుత్వ వెబ్ సైట్లపైన సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ‘ఎనోనిమస్’ సంస్ధ ప్రకటించిన రెండు రోజుల్లోనే సదర్ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ రూపొందించడంలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురైతే ఆ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైట్లను ఎవరూ హ్యాక్ చెయ్యలేదనీ, కొన్ని సమస్యలవలన మాత్రమే తాత్కాలికంగా…

ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

తెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. అదిలా ఉంది: మనకు నిత్యం అంతర్జాతీయ వార్తలను ఎర్ర కళ్ళద్దాలతో వీక్షించి వండి వార్చే బ్లాగొకటి ఉంది. అఫ్ కోర్స్, అదేం తప్పు కాదనుకోండి, ప్రతి ఒక్కరం ఒక వార్తని ఏదో ఒక దృక్కోణములోనుంచే…

స్ట్రాస్ కాన్ రేప్ కేసు మెడికల్ రిపోర్టు లీక్, కాన్‌పై బలపడిన అనుమానాలు

ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఒక హోటల్ మెయిడ్ ని రేప్ చేసినట్లు ఆరోఫణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన మహిళ “నఫిస్సాటౌ దియల్లో (32 సం.లు) న్యూయార్క్ మన్‌హట్టన్ లోని ఒక హోటల్ లో మెయిడ్ గా పనిచేస్తోంది. అప్పటి ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ అదే హోటల్‌లోని లగ్జరీ సూట్ లో దిగాడు. ఆ సందర్భంగా కాన్ సూట్ ని…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసిన ఫ్రాన్సు, రష్యా నిరసన

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడిచినట్లుగా ఫ్రాన్సు సైన్యాధికారులు తెలిపారు. బెర్బెర్ తెగల ఫైటర్లకు లిబియా రాజధాని ట్రిపోలికి నైరుతి మూల ఉన్న కొండల్లో ఆయుధాలను జారవిడిచినట్లు ఫ్రాన్సు మిలట్రీ తెలిపింది. ఏప్రిల్ చివరినుండి జూన్ ప్రారంభంవరకూ తిరుగుబాటుదారులకు ఈ విధంగా ఆయుధాలను అందించామని వారు తెలిపారు. ఐతే ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం లిబియా యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకు ఆయుధాలు అందించడాన్ని నిషేధించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల అధికారులే స్వయంగా లిబియాలోని ఇరు…

మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్

“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…

నాటో “డ్రోన్ హెలికాప్టర్” ను కూల్చివేసిన లిబియా సైన్యం

మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం…

నాటో బాంబు దాడుల్లో మరో 15 మంది లిబియా పౌరుల మరణం

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో చేసినట్లుగానే నాటో ఆధ్వర్యంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరుల హత్యాకాండను కొనసాగిస్తున్నాయి. ఆదివారం బాంబుదాడిలో ఐదుగురు పౌరులని చంపేసి ‘సారీ’ చెప్పిన నాటో సోమవారం తెల్లవారు ఝాము దాడిలో మరో 15 మంది పౌరుల్ని రాకెట్లు పేల్చి చంపేసింది. “సోమవారం, జూన్ 20 తెల్లవారు ఝామున నాటో యుద్ధ విమానాలు సొర్మాన్ లో గడ్డాఫీ ప్రభుత్వానికి చెందిన ఓ కీలకమైన కమాండ్ అండ్ కంట్రొల్ సెంటర్ పై సరిగ్గా గురి చూసి…

లిబియాపై నాటో బాంబు దాడిలో ఓ కుటుంబంతో సహా ఐదుగురు పౌరుల మరణం

గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…