మార్కెట్లో ‘బై చైనా, సెల్ ఇండియా’ సెంటిమెంట్!

గోల్డెన్ వీక్ సెలవులు (అక్టోబర్ 1 నుండి 7 వరకు) ముగిసిన అనంతరం మంగళవారం చైనా స్టాక్ మార్కెట్లు వ్యాపారం నిమిత్తం తెరుచుకోనున్న నేపధ్యంలో మార్కెట్లో “బై చైనా, సెల్ ఇండియా” సెంటిమెంట్ జోరందుకుంది. గత 6 ట్రేడింగ్ రోజుల్లో 30 షేర్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఏకంగా 4,786 పాయింట్లు కోల్పోవడంతో బేర్ సెంటిమెంట్ బలంగా ఉన్నదనీ ఎఫ్.ఐ.ఐ లు ఇండియన్ షేర్ మార్కెట్ల నుండి చైనా స్టాక్ మార్కెట్ కు తరలిపోయేందుకు సిద్ధంగా…

ఇంకా తేరుకోని బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ లో రాజకీయ మరియు శాంతి భద్రతల పరిస్ధితులు ఇప్పటికీ మెరుగుపడ లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రధాన పాలనా బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. 15 యేళ్ళ పాటు సాగిన షేక్ హసీనా పాలన మిగిల్చిన వైరాలు, వైరుధ్యాలు, పగలు-ప్రతీకారాలు నివురు గప్పిన నిప్పులా తమ ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి. బహుశా…

బంగ్లాదేశ్ ఉద్యోగాల రిజర్వేషన్ గురించి…

జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో…

పశ్చిమ దేశాలు, రష్యాల తాజా ఘర్షణ కేంద్రం లిబియా -2

ఐరాస గుర్తించిన ప్రభుత్వం పేరు జాతీయామోద ప్రభుత్వం (గవర్న్ మెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ -జి‌ఎన్‌ఏ). రాజధాని ట్రిపోలి ఈ ప్రభుత్వానికి అధికార కేంద్రం. ప్రస్తుతానికి పశ్చిమ దేశాలు అధికారికంగా ఈ ప్రభుత్వాన్నే గుర్తిస్తున్నాయి. అదే సమయంలో జనరల్ హఫ్తార్ నేతృత్వం లోని పోటీ ప్రభుత్వానికి కూడా అండదండలు ఇస్తున్నాయి. 20 మంది ఫ్రెంచి ప్రత్యేక బలగాలతో పాటు ఇటలీ, బ్రిటిష్, అమెరికా ప్రత్యేక బలగాల యూనిట్లు తోబ్రూక్ (హఫ్తార్) ఆర్మీతో కలిసి బెంఘాజీ నగర భద్రతలో…