సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…