బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…

రానున్నది జన రంజక బడ్జెట్టేనట!

  మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం…

కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే

రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి…